ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనిషి జీవితానికి సంబంధించిన అంచనాలను కూడా చెప్పగలిగే టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా, వ్యక్తి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అంచనా వేయగలిగే AI ఆధారిత టూల్ ఒకటి రాబోతోంది. దీనికి AI-ECG రిస్క్ ఎస్టిమేటర్ AIRE అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీ గుండె వైఫల్యం ఆధారంగా వ్యక్తి చావు సమయాన్ని అంచనా వేస్తుంది.
ఈ AIRE వ్యవస్థ గుండె పనితీరును విశ్లేషించి, గుండె ఎప్పుడు రక్త ప్రసరణను నిలిపివేస్తుందన్న విషయాన్ని గుర్తించగలుగుతుంది. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఆధ్వర్యంలో రెండు ప్రధాన ఆసుపత్రుల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. వేలాది మంది ఈ ట్రయల్స్లో పాల్గొంటున్నారు, వారి ECG డేటా ఆధారంగా గుండె ఆరోగ్యం గురించి AI విశ్లేషణలు అందిస్తుంది.
AI డెత్ కాలిక్యులేటర్ ప్రాధాన్యత ఏమిటంటే, వైద్యులు కూడా సులభంగా గుర్తించలేని గుండె సమస్యలను గుర్తించగలగడం. AI ఆధారంగా గుండె వైఫల్యాన్ని ముందుగానే అంచనా వేసి, రోగికి తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ టూల్ ఇప్పుడు మొదటి ట్రయల్స్లో 78 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకు ముందు సాధారణంగా గుండె సంబంధిత పరీక్షలు మనిషి ఆరోగ్య స్థితిని చెప్పేవి. కానీ AI ఆధారిత ఈ కొత్త టెక్నాలజీ గుండె పనితీరును డీప్ లెవెల్లో విశ్లేషించి, సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న అంశాన్ని చెబుతుందన్నమాట.
అందుకే, ఈ టెక్నాలజీ వైద్య రంగంలో అనేక కొత్త అవకాశాలను తెర మీదకు తీసుకొస్తోంది. AIRE టూల్ రూపకల్పన కోసం మిలియన్ల ECG రిపోర్టులను సేకరించి, వాటి ఆధారంగా AI విశ్లేషణలను రూపొందించారు. 11.60 లక్షల మంది రోగుల ECG డేటాను విశ్లేషించి, వారి గుండె పనితీరును అంచనా వేసి, అకాల మరణాల గురించి సమాచారాన్ని అందించారు. ప్రజలు ఈ టెక్నాలజీ పట్ల ఆసక్తిని చూపుతున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఈ AI డెత్ కాలిక్యులేటర్పై అనేక మంది ఆసక్తి చూపిస్తుండటంతో, దీనిని మరింత విస్తరించి వినియోగంలోకి తీసుకురావాలని పరిశోధకులు భావిస్తున్నారు.
This post was last modified on November 4, 2024 11:27 am
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…