ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఎన్నో విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మనిషి జీవితానికి సంబంధించిన అంచనాలను కూడా చెప్పగలిగే టెక్నాలజీ ఆవిష్కృతమవుతోంది. అందులో భాగంగా, వ్యక్తి మరణం ఎప్పుడు సంభవిస్తుందో అంచనా వేయగలిగే AI ఆధారిత టూల్ ఒకటి రాబోతోంది. దీనికి AI-ECG రిస్క్ ఎస్టిమేటర్ AIRE అని పేరు పెట్టారు. ఈ టెక్నాలజీ గుండె వైఫల్యం ఆధారంగా వ్యక్తి చావు సమయాన్ని అంచనా వేస్తుంది.
ఈ AIRE వ్యవస్థ గుండె పనితీరును విశ్లేషించి, గుండె ఎప్పుడు రక్త ప్రసరణను నిలిపివేస్తుందన్న విషయాన్ని గుర్తించగలుగుతుంది. యూకేలోని నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ఆధ్వర్యంలో రెండు ప్రధాన ఆసుపత్రుల్లో ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. వేలాది మంది ఈ ట్రయల్స్లో పాల్గొంటున్నారు, వారి ECG డేటా ఆధారంగా గుండె ఆరోగ్యం గురించి AI విశ్లేషణలు అందిస్తుంది.
AI డెత్ కాలిక్యులేటర్ ప్రాధాన్యత ఏమిటంటే, వైద్యులు కూడా సులభంగా గుర్తించలేని గుండె సమస్యలను గుర్తించగలగడం. AI ఆధారంగా గుండె వైఫల్యాన్ని ముందుగానే అంచనా వేసి, రోగికి తగిన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ టూల్ ఇప్పుడు మొదటి ట్రయల్స్లో 78 శాతం ఖచ్చితత్వంతో పనిచేస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇంతకు ముందు సాధారణంగా గుండె సంబంధిత పరీక్షలు మనిషి ఆరోగ్య స్థితిని చెప్పేవి. కానీ AI ఆధారిత ఈ కొత్త టెక్నాలజీ గుండె పనితీరును డీప్ లెవెల్లో విశ్లేషించి, సహజ మరణం ఎప్పుడు సంభవిస్తుందన్న అంశాన్ని చెబుతుందన్నమాట.
అందుకే, ఈ టెక్నాలజీ వైద్య రంగంలో అనేక కొత్త అవకాశాలను తెర మీదకు తీసుకొస్తోంది. AIRE టూల్ రూపకల్పన కోసం మిలియన్ల ECG రిపోర్టులను సేకరించి, వాటి ఆధారంగా AI విశ్లేషణలను రూపొందించారు. 11.60 లక్షల మంది రోగుల ECG డేటాను విశ్లేషించి, వారి గుండె పనితీరును అంచనా వేసి, అకాల మరణాల గురించి సమాచారాన్ని అందించారు. ప్రజలు ఈ టెక్నాలజీ పట్ల ఆసక్తిని చూపుతున్నారు, ప్రపంచ వ్యాప్తంగా ఈ AI డెత్ కాలిక్యులేటర్పై అనేక మంది ఆసక్తి చూపిస్తుండటంతో, దీనిని మరింత విస్తరించి వినియోగంలోకి తీసుకురావాలని పరిశోధకులు భావిస్తున్నారు.
This post was last modified on November 4, 2024 11:27 am
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…