ఇండస్ట్రీకి వచ్చిన అయిదేళ్ల తర్వాత ఎట్టకేలకు మీనాక్షి చౌదరి బోణీ కొట్టేసింది. నిన్నటి దాకా సరైన సక్సెస్ లేక అవకాశాలు వస్తున్నా ఆనందం కరువైన హర్యానా బ్యూటీకి లక్కీ భాస్కర్ రూపంలో లక్కు కలిసి వచ్చింది. రిలీజైన మొదటి రోజే యునానిమస్ పాజిటివ్ టాక్, రివ్యూలతో దూసుకుపోయిన ఈ రెట్రో మనీ థ్రిల్లర్ లో దుల్కర్ సల్మాన్ దే వన్ మ్యాన్ షో అయినప్పటికీ ప్రాధాన్యత పరంగా మీనాక్షి చౌదరికీ మంచి ఎపిసోడ్లు పడ్డాయి. బిడ్డ తల్లిగా నటించాల్సి వచ్చినా పెర్ఫార్మన్స్ చూపించుకోవడానికే దర్శకుడు వెంకీ అట్లూరి తగినంత స్కోప్ ఇవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కి మరింత చేరువయ్యింది.
గుంటూరు కారం, ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంలో చేసినప్పుడు మహేష్ బాబు, విజయ్ లాంటి పెద్ద హీరోల సరసన నటించే అవకాశం దక్కిందని తొలుత సంబరపడినా ఆ ఆనందం వాటి ఫలితాల రూపంలో దక్కకపోవడమే కాక పాత్రలను డిజైన్ చేసిన తీరు నిరాశ కలిగించింది. అందుకే ఇప్పుడు లక్కీ భాస్కర్ తనకు కీలక మలుపు కానుంది. ఇంకో పది రోజుల గ్యాప్ లో వరుణ్ తేజ్ మట్కా రాబోతోంది. అందులో కూడా హీరో భార్యగానే చేయడం గమనార్హం. కాకపోతే క్యారెక్టర్ కి ఏమైనా షాకింగ్ ముగింపు ఇస్తారా లేక వరుణ్ తో సమానంగా వయసు మళ్లే దాకా షేడ్స్ ఉంటాయా చూడాలి.
ఇదే నెలాఖరు విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ వస్తుంది. పోలిక ప్రకారం చూసుకుంటే మిగిలిన సినిమాల కన్నా ఇందులో గ్లామర్ టచ్ ఉండేలా కనిపిస్తోంది. శ్రద్ధ శ్రీనాథ్ ఉన్నప్పటికి లీడ్ రోల్ మీనాక్షిదే. ఇది కూడా బ్రేక్ ఇస్తుందనే నమ్మకం బలంగా ఉంది. ఈ రెండు సక్సెస్ అయితే ఆఫర్లు తిరిగి పుంజుకుంటాయి. విశ్వంభరలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారానికి మీనాక్షి చౌదరి ఇటీవలే స్వయంగా చెక్ పెట్టింది. అదంతా అబద్దమని క్లారిటీ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో కేవలం వారాల వ్యవధిలో ఇన్ని కొత్త రిలీజులు ఉన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకటే. మరి ఈ లక్కుని కొనసాగిస్తుందో లేదో చూడాలి.
This post was last modified on November 3, 2024 4:39 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…