Trends

పంత్‌ను దెబ్బతీసిన డీఆర్‌ఎస్.. ఫ్యాన్స్ లో ఆగ్రహం

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రిషభ్ పంత్ ఆడిన విధానం ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చింది. స్వల్ప లక్ష్యం కోసం భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ, పంత్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు. 64 పరుగులు చేయడానికి కేవలం 57 బంతులు మాత్రమే తీసుకున్న పంత్, తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించాడు. ఈ సమయంలో భారత టాప్‌ ఆర్డర్ దారుణంగా విఫలమైందే గాక, మ్యాచ్ పంత్ ఒక్కడిపై ఆధారపడి ఉండిపోయింది.

కానీ, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌గా డిక్లేర్‌ అయ్యాడు. ముందుగా ఫీల్డ్‌ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ, న్యూజిలాండ్ కెప్టెన్ డీఆర్‌ఎస్‌ కోరడంతో చర్చ మొదలైంది. రివ్యూ ద్వారా బంతి బ్యాట్ అంచు తాకినట్లు స్పష్టమైంది. కానీ అదే సమయంలో పంత్ బ్యాట్ ప్యాడ్‌ను తాకినట్లు వాదన లేకపోలేదు. పంత్ దీనిపై ఫీల్డ్ అంపైర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, థర్డ్‌ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంతి ప్యాడ్లను మాత్రమే తాకిందని, బ్యాట్‌ను తాకలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత అభిమానులు డీఆర్‌ఎస్‌ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పంత్ నిరాశతో పెవిలియన్‌కు చేరి తన అసంతృప్తిని చూపాడు. ఈ ఔట్‌తో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఐదు వికెట్ల ఘనతను రెండవ ఇన్నింగ్స్‌లోనూ సాధించాడు. 

This post was last modified on November 3, 2024 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజు గారు… ఈసారి పవన్ కూడా వస్తున్నాడు!

‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…

49 minutes ago

గుణశేఖర్ నమ్మకం గెలిచిందా

నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…

2 hours ago

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 hours ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

5 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

5 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

8 hours ago