Trends

పంత్‌ను దెబ్బతీసిన డీఆర్‌ఎస్.. ఫ్యాన్స్ లో ఆగ్రహం

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రిషభ్ పంత్ ఆడిన విధానం ఫ్యాన్స్ కు మంచి కిక్కిచ్చింది. స్వల్ప లక్ష్యం కోసం భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్న వేళ, పంత్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు. 64 పరుగులు చేయడానికి కేవలం 57 బంతులు మాత్రమే తీసుకున్న పంత్, తన ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో రాణించాడు. ఈ సమయంలో భారత టాప్‌ ఆర్డర్ దారుణంగా విఫలమైందే గాక, మ్యాచ్ పంత్ ఒక్కడిపై ఆధారపడి ఉండిపోయింది.

కానీ, అజాజ్ పటేల్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌గా డిక్లేర్‌ అయ్యాడు. ముందుగా ఫీల్డ్‌ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినప్పటికీ, న్యూజిలాండ్ కెప్టెన్ డీఆర్‌ఎస్‌ కోరడంతో చర్చ మొదలైంది. రివ్యూ ద్వారా బంతి బ్యాట్ అంచు తాకినట్లు స్పష్టమైంది. కానీ అదే సమయంలో పంత్ బ్యాట్ ప్యాడ్‌ను తాకినట్లు వాదన లేకపోలేదు. పంత్ దీనిపై ఫీల్డ్ అంపైర్‌ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, థర్డ్‌ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు.

ఈ నిర్ణయం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంతి ప్యాడ్లను మాత్రమే తాకిందని, బ్యాట్‌ను తాకలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత అభిమానులు డీఆర్‌ఎస్‌ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పంత్ నిరాశతో పెవిలియన్‌కు చేరి తన అసంతృప్తిని చూపాడు. ఈ ఔట్‌తో న్యూజిలాండ్ బౌలర్ అజాజ్ పటేల్ ఐదు వికెట్ల ఘనతను రెండవ ఇన్నింగ్స్‌లోనూ సాధించాడు. 

This post was last modified on November 3, 2024 4:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

29 minutes ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

53 minutes ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

1 hour ago

RC 16 – ఒకట్రెండు ఆటలు కాదు బాసూ

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉంటుందనే టాక్ ఉంది…

2 hours ago

అంతా సిద్ధం!.. టెస్లా రావడమే ఆలస్యం!

ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా టెస్లాకు పేరుంది. ఆ సంస్థ కార్లు భారత్ లోకి ప్రవేశించేందుకు ఇప్పటికే…

4 hours ago

21 ప‌ద‌వులు.. 60 వేల ద‌రఖాస్తులు..

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటులో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అనేక మందికి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నామినేటెడ్ ప‌ద‌వుల‌తో సంతృప్తి క‌లిగిస్తున్నారు. ఎన్ని…

11 hours ago