ఆ అమ్మాయి వయసు 17 ఏళ్లు. అంటే అద్బుతమైన భవిష్యత్తు కళ్ల ముందు కదలాడుతుంది. 40 ఏళ్ల భవిష్య జీవితాన్ని తనకు అనుకూలమైన రీతిలో సుఖంగా జీవించేందుకు మెట్లు ఏర్పాటు చేసుకునే వయసు అది! కానీ, ఆ పిల్ల దారి తప్పేసింది. సిగరెట్లతో ప్రారంభమైన ఆ అమ్మాయి.. అలవాట్లు గంజా యి వరకు.. అక్కడ నుంచి నిషేధిత డ్రగ్స్ వరకు చేరింది. అన్నం లేకపోయినా.. ఉంటుంది కానీ.. డ్రగ్స్ లేకుండా ఉండలేని స్థితికి చేరింది.
మరి ఈ డ్రగ్స్ ఎక్కడనుంచి వస్తున్నాయి? అంటే.. తెలిసిన యువకుల ద్వారా సేకరించింది. దీనికి ఆ అమ్మాయి.. పెట్టిన ఖర్చు.. ‘సెక్స్’!! ఆశ్చర్యంగా అనిపించినా నిజం. అనైతిక దారిలో నడవడమే కాకుండా.. డ్రగ్స్ కోసం.. ఎవరితోబడితే వారితో సెక్స్లో పాల్గొని వారిని మురిపించింది. ఫలితంగా తాను ప్రమాదంలో చిక్కుకుని ఏకంగా 19 మంది యువకుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టింది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిపోయింది.
ఎక్కడ జరిగింది?
దేవ భూమిగా పేరొందిన ఉత్తరాఖండ్లోని నైనిటాల్కు చెందిన కాలేజీ విద్యార్థి ఒకరు.. 16వ ఏటే.. సిగరెట్లకు అలవాటు పడింది. దీనిని ఆమె స్టయిల్గా భావించింది. యూట్యూబ్ సహా సోషల్ మీడియా ప్రభావం కూడా పడింది. ఆ తర్వాత..పరిచయాలతో పాటు.. అలవాట్లు కూడా పెరిగి.. గంజాయికి దారి తీసింది. అనంతరం.. డ్రగ్స్ వైపు మళ్లింది. ఇక, అక్కడి నుంచి ఆమె అనైతిక సెక్స్ వ్యవహారాలకు కూడా జీవితాన్ని నాశనం చేసుకుంది.
నైనిటాల్లో ఓ ప్రైవేటు వైద్యుడి వద్దకు.. ఈ అమ్మాయితో సెక్స్ చేసిన ఓ యువకుడు అనారోగ్యంతో వచ్చాడు. అతనిని పరీక్షించగా.. ఎయిడ్స్ ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆయన విధుల్లో భాగంగా సర్కారుకు రహస్య సమాచారం చేరవేశారు. దీంతో నైనిటాల్ వ్యాప్తంగా అన్ని కాలేజీల్లోనూ యువతకు ఎయిడ్స్ పరీక్షలు నిర్వహింగా.. అమ్మాయి చదువుతున్న కాలేజీలో 19 మంది యువకులకు ఎయిడ్స్ ఉందని నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆ అమ్మాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్యం అందిస్తున్నారు.
This post was last modified on November 2, 2024 6:08 am
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…