వినియోగదారులు ఎంతో ఇష్టంగా తినే ‘మయోనైజ్’ క్రీమ్పై తెలంగాణ ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. దీనిని వినియోగిస్తే.. రూ.5 నుంచి 10 లక్షల వరకు హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇతర ఆహార తయారీ, విక్రయ కేంద్రాలకు జరిమానా విధిస్తామని తెలిపింది. నిషేధం తక్షణం అమల్లోకి వస్తుందని కూడా స్పష్టం చేసింది. గత కొన్నాళ్లుగా మయోనైజ్ వినియోగంపై వైద్యులు, పర్యావరణ వేత్తలు, ఆరోగ్య నిపుణులు కూడా.. సర్కారుకుకొన్ని సూచనలు చేశారు. దీనిని వినియోగించడంపై నిషేధం విధించాలని వారు కోరారు. దీనిపై అధ్యయనం చేసిన ప్రభుత్వం తాజాగా మయోనైజ్పై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఏంటీ మయోనైజ్?
వీకెండ్స్ సహా.. ఇతర కార్యక్రమాల్లోనూ విరివిగా ఆరగిస్తున్న పదార్థాల్లో బర్గర్లు నుంచి శాండ్విచ్లు, డిప్స్, సలాడ్స్ ఉంటున్నా యి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉండడమే కాకుండా.. మరింతగా తినాలని కూడా అనిపిస్తుంది. దీనికి కారణం.. ఈ పదార్థాలలో ప్రత్యేకంగా వినియోగించే “మయోనైజ్”చాలా చాలా టేస్టీగా, జ్యూసీగా ఉండే మయోనైజ్ను బిర్యానీలు, చికెన్ రోల్స్ సహా స్నాక్స్లోనూ వినియోగిస్తున్నారు. ఈ మయోనైజ్ అనే క్రీమ్ను కోడి గుడ్డు నుంచే తయారుచేస్తారు. అయితే.. కోడిగుడ్డులోని సొనలో ఉండే సాల్మొనెల్లాను అధికంగా వినియోగించడం ద్వారా.. మయోనైజ్ టేస్ట్ పెరుగుతోంది. పైగా గంటల తరబడి నిల్వ కూడా ఉంచుతున్నారు. ఇది ప్రాణాంతకమన్నది వైద్యులు, నిపుణులు చెబుతున్న మాట.
ఏం జరుగుతుంది?
మయోనైజ్ క్రీమ్ను ఎక్కువగా తీసుకోవడం కాదు.. అసలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే… కార్డియో(గుండె సంబంధిత), కీళ్ల సంబంధిత, నరాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా హోటళ్లలో తయారుచేసే మయోనైజ్ ను అస్సలు వినియోగించరాదని కూడా చెబుతున్నారు. ఎందుకంటేనాణ్యత లేని కోడిగుడ్లను కూడా దీనికి వినియోగిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మయోనైజ్ను నిషేధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది.
This post was last modified on October 30, 2024 10:15 pm
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…