Trends

భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అడుగు: టార్గెట్ 2035

భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు ప్రణాళికను వేగవంతం చేయడం, అలాగే దేశీయంగా సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉండటం వంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.

బయోఎకానమీ, పర్యావరణం, ఉపాధి అంశాలను అభివృద్ధి చేయడం అనే బాటలో బయోఈ3 పాలసీని అమలు చేయడం కూడా ఈ ఒప్పందం ఉద్దేశం. భారత అంతరిక్ష కేంద్రం వివిధ రంగాల్లో పరిశోధనలకు తోడ్పాటు అందిస్తుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఆస్ట్రోనాటిక్స్, అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇస్రో మరియు బయోటెక్నాలజీ విభాగం పరస్పర సహకారంతో పలు పరిశోధనలు చేపట్టనున్నాయి.

కేంద్ర క్యాబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు లభించింది. తొలిమాడ్యూల్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని, బీఏఎస్ పూర్తి స్థాయిలో 2035 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా ఉంచుకున్నారు. దీని తర్వాత భారత అంతరిక్ష రంగం మరింత విస్తరించబోతోంది. 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్ర కూడా చేపట్టేందుకు ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్ష పరిశోధనకు నూతన దిశగా మారబోతున్నదని అధికారులు తెలిపారు.

This post was last modified on October 27, 2024 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హెచ్చరికలు వృథా.. చర్యలు ఎప్పుడూ?

ఏపీలో టీడీపీ నాయ‌కులు దారి త‌ప్పుతున్నార‌న్న విష‌యంపై స‌మీక్ష‌లు చేయ‌డం.. వారిపై సీరియ‌స్ అయిన‌ట్టుగా ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డం..…

51 minutes ago

పెద్దిరెడ్డీ అనుచ‌రుల అరెస్టు.. ఏం జ‌రిగింది?

వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్‌గా భావిస్తున్న ఇద్దరు కీలక…

58 minutes ago

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

1 hour ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

2 hours ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

2 hours ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

4 hours ago