భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు ప్రణాళికను వేగవంతం చేయడం, అలాగే దేశీయంగా సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉండటం వంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.
బయోఎకానమీ, పర్యావరణం, ఉపాధి అంశాలను అభివృద్ధి చేయడం అనే బాటలో బయోఈ3 పాలసీని అమలు చేయడం కూడా ఈ ఒప్పందం ఉద్దేశం. భారత అంతరిక్ష కేంద్రం వివిధ రంగాల్లో పరిశోధనలకు తోడ్పాటు అందిస్తుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఆస్ట్రోనాటిక్స్, అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇస్రో మరియు బయోటెక్నాలజీ విభాగం పరస్పర సహకారంతో పలు పరిశోధనలు చేపట్టనున్నాయి.
కేంద్ర క్యాబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు లభించింది. తొలిమాడ్యూల్ను 2028 నాటికి పూర్తి చేయాలని, బీఏఎస్ పూర్తి స్థాయిలో 2035 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా ఉంచుకున్నారు. దీని తర్వాత భారత అంతరిక్ష రంగం మరింత విస్తరించబోతోంది. 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్ర కూడా చేపట్టేందుకు ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్ష పరిశోధనకు నూతన దిశగా మారబోతున్నదని అధికారులు తెలిపారు.
This post was last modified on %s = human-readable time difference 4:37 pm
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబుని మళ్ళీ తెరమీద చూడలేమని బెంగపడుతున్న అభిమానులను రిలీఫ్ దక్కే శుభవార్త రాబోతోందట. అశోక్…
చైనా ఆధునికంగా ఎంత వేగంగా దూసుకుపోతున్నా కూడా ప్రతీ ఏడాది ఏదో ఒక కొత్త కష్టం అక్కడ తీరని నష్టాన్ని…
నవంబర్ 28 దాకా హైదరాబాద్ లో కర్ఫ్యూ విధిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడం బన్నీ అభిమానులకు శరాఘాతమే…
వైసీపీ నేతలు కొందరు పార్టీ నుంచి వెళ్లిపోయారు. మరికొందరు తట్టాబుట్టా సర్దుకున్నారు. అయితే.. ఇంకొందరు.. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. కనీసం…
ఇండియన్ ఓటిటిని మలుపు తిప్పిన వెబ్ సిరీస్ లలో మిర్జాపూర్ ది ప్రత్యేక స్థానం. హింస, అశ్లీలత, బూతు బోలెడంత…
ఈ మధ్య కాలంలో థియేటర్లలో ఎంత బాగా ఆడిన సినిమా అయినా సరే ఓటిటిలోకి వచ్చాక అదే స్థాయి స్పందన…