భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు ప్రణాళికను వేగవంతం చేయడం, అలాగే దేశీయంగా సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉండటం వంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.
బయోఎకానమీ, పర్యావరణం, ఉపాధి అంశాలను అభివృద్ధి చేయడం అనే బాటలో బయోఈ3 పాలసీని అమలు చేయడం కూడా ఈ ఒప్పందం ఉద్దేశం. భారత అంతరిక్ష కేంద్రం వివిధ రంగాల్లో పరిశోధనలకు తోడ్పాటు అందిస్తుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఆస్ట్రోనాటిక్స్, అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇస్రో మరియు బయోటెక్నాలజీ విభాగం పరస్పర సహకారంతో పలు పరిశోధనలు చేపట్టనున్నాయి.
కేంద్ర క్యాబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు లభించింది. తొలిమాడ్యూల్ను 2028 నాటికి పూర్తి చేయాలని, బీఏఎస్ పూర్తి స్థాయిలో 2035 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా ఉంచుకున్నారు. దీని తర్వాత భారత అంతరిక్ష రంగం మరింత విస్తరించబోతోంది. 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్ర కూడా చేపట్టేందుకు ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్ష పరిశోధనకు నూతన దిశగా మారబోతున్నదని అధికారులు తెలిపారు.
This post was last modified on October 27, 2024 4:37 pm
గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…
అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…
ఐపీఎల్ 2025 సీజన్లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అడుగుపెడుతున్న…
సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…
సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…