Trends

భారత అంతరిక్ష ప్రయాణంలో కొత్త అడుగు: టార్గెట్ 2035

భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు ప్రణాళికను వేగవంతం చేయడం, అలాగే దేశీయంగా సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉండటం వంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.

బయోఎకానమీ, పర్యావరణం, ఉపాధి అంశాలను అభివృద్ధి చేయడం అనే బాటలో బయోఈ3 పాలసీని అమలు చేయడం కూడా ఈ ఒప్పందం ఉద్దేశం. భారత అంతరిక్ష కేంద్రం వివిధ రంగాల్లో పరిశోధనలకు తోడ్పాటు అందిస్తుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఆస్ట్రోనాటిక్స్, అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇస్రో మరియు బయోటెక్నాలజీ విభాగం పరస్పర సహకారంతో పలు పరిశోధనలు చేపట్టనున్నాయి.

కేంద్ర క్యాబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు లభించింది. తొలిమాడ్యూల్‌ను 2028 నాటికి పూర్తి చేయాలని, బీఏఎస్ పూర్తి స్థాయిలో 2035 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా ఉంచుకున్నారు. దీని తర్వాత భారత అంతరిక్ష రంగం మరింత విస్తరించబోతోంది. 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్ర కూడా చేపట్టేందుకు ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్ష పరిశోధనకు నూతన దిశగా మారబోతున్నదని అధికారులు తెలిపారు.

This post was last modified on October 27, 2024 4:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

34 minutes ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

7 hours ago