భారత అంతరిక్ష ప్రయాణం మరో కీలక మలుపు తీసుకోబోతోంది. 2035 నాటికి భారత్ సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసే దిశగా ముందుకెళ్తోందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మేరకు ఇస్రో, కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మధ్య కీలక ఒప్పందం కుదిరింది, ఇది దేశంలో శాస్త్రీయ రంగానికి కొత్త శకం తెస్తుందని భావిస్తున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్) ఏర్పాటు ప్రణాళికను వేగవంతం చేయడం, అలాగే దేశీయంగా సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉండటం వంటి ప్రధాన లక్ష్యాలు ఉన్నాయి.
బయోఎకానమీ, పర్యావరణం, ఉపాధి అంశాలను అభివృద్ధి చేయడం అనే బాటలో బయోఈ3 పాలసీని అమలు చేయడం కూడా ఈ ఒప్పందం ఉద్దేశం. భారత అంతరిక్ష కేంద్రం వివిధ రంగాల్లో పరిశోధనలకు తోడ్పాటు అందిస్తుంది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిశోధన, స్పేస్ బయోటెక్నాలజీ, బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయోఆస్ట్రోనాటిక్స్, అంతరిక్ష జీవ శాస్త్రంలో ఇస్రో మరియు బయోటెక్నాలజీ విభాగం పరస్పర సహకారంతో పలు పరిశోధనలు చేపట్టనున్నాయి.
కేంద్ర క్యాబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టుకు మరింత మద్దతు లభించింది. తొలిమాడ్యూల్ను 2028 నాటికి పూర్తి చేయాలని, బీఏఎస్ పూర్తి స్థాయిలో 2035 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా ఉంచుకున్నారు. దీని తర్వాత భారత అంతరిక్ష రంగం మరింత విస్తరించబోతోంది. 2040 నాటికి చంద్రుడిపై మానవ సహిత యాత్ర కూడా చేపట్టేందుకు ఈ ప్రణాళికలో భాగంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ భారత అంతరిక్ష పరిశోధనకు నూతన దిశగా మారబోతున్నదని అధికారులు తెలిపారు.
This post was last modified on October 27, 2024 4:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…