మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా అనే విషయం చాన్నాళ్ల ముందే వెల్లడైంది. తెలుగులో హార్రర్ కామెడీలు ఊపందుకోవడంలో మారుతిదే ప్రధాన పాత్ర. అతను తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది.
దీంతో వరుసగా ఆ జానర్లో సినిమాలు వచ్చాయి. కొన్నేళ్ల తర్వాత ఆ జానర్ జనాలకు మొహం మొత్తేసింది. దీంతో ఆ తరహా సినిమాలు ఆగిపోయాయి. కానీ తనే పక్కన పెట్టేసిన జానర్లో మళ్లీ ఇప్పుడు ‘రాజా సాబ్’ తీస్తున్నాడు మారుతి. హార్రర్ కామెడీ జానర్లో ఎక్కువగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే వచ్చాయి.
ఐతే ప్రభాస్ లాంటి టవరింగ్ స్టార్తో మారుతి ఈ జానర్లో ఈ దశలో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చూశాక ప్రభాస్ పాత్ర, కథ విషయంలో జనాలకు ఒక అంచనా వచ్చేసింది.
ప్రభాస్ ‘రాజా సాబ్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది స్పష్టం. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్లో చూపించిన యంగ్ క్యారెక్టర్ ఒకటైతే.. ఇంకోటేమో లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
‘చంద్రముఖి’లో డాక్టర్, రాజు పాత్రల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా చెలరేగిపోయారో తెలిసిందే. ఆ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఐతే ఈ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి కొనసాగింపుగా తీసిన ‘నాగవల్లి’లో విక్టరీ వెంకటేష్ సైతం ఇలాగే డాక్టర్, రాజు పాత్రల్లో కనిపించాడు.
కానీ ఆయనకు రాజు పాత్ర అస్సలు సూట్ కాలేదు. సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ రజినీలా మెప్పించి బ్లాక్ బస్టర్ అందుకుంటాడా.. లేక వెంకీలా డిజప్పాయింట్ చేసి ఫెయిల్యూర్ను ఖాతాలో వేసుకుంటాడా అన్నది చూడాలి.
ఏపీలో కూటమి సర్కారు కొలువుదీరి రెండేల్లు అవుతోంది. మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి… 2024 ఎన్నికల్లో అత్యంత కష్టతరమైన…
గత ఎన్నికల సమయంలో కొందరు నాయకులు పోటీ చేసిన నియోజకవర్గాల్లో వారు ఓడిపోయారు. అయితే.. ఆ తర్వాత పలువురు నేతలు..…
సత్యనారాయణ గారూ.. రేపు సిద్ధాంతం వస్తున్నా.. అక్కడ కలుద్దాం. అంటూ 87 ఏళ్ల వృద్ధుడు సత్యనారాయణకు ఆదివారం సీఎం చంద్రబాబు…
పెద్ది ఫలితం బాగుంది. కలెక్షన్లు చక్కగా వస్తున్నాయి. సోమవారం పరీక్ష కూడా నెగ్గింది. అయితే ఎక్కడో చిన్న అసంతృప్తి అభిమానులను…
తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇప్పుడు హిట్లర్ పేరుపై రచ్చ సాగుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల…
ఏపీకి బ్రాండ్ గా కొనసాగుతున్న విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు అక్కడిక్కడే…