మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ హార్రర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న సినిమా అనే విషయం చాన్నాళ్ల ముందే వెల్లడైంది. తెలుగులో హార్రర్ కామెడీలు ఊపందుకోవడంలో మారుతిదే ప్రధాన పాత్ర. అతను తీసిన ‘ప్రేమ కథా చిత్రమ్’ అప్పట్లో సెన్సేషనల్ హిట్టయింది.
దీంతో వరుసగా ఆ జానర్లో సినిమాలు వచ్చాయి. కొన్నేళ్ల తర్వాత ఆ జానర్ జనాలకు మొహం మొత్తేసింది. దీంతో ఆ తరహా సినిమాలు ఆగిపోయాయి. కానీ తనే పక్కన పెట్టేసిన జానర్లో మళ్లీ ఇప్పుడు ‘రాజా సాబ్’ తీస్తున్నాడు మారుతి. హార్రర్ కామెడీ జానర్లో ఎక్కువగా చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే వచ్చాయి.
ఐతే ప్రభాస్ లాంటి టవరింగ్ స్టార్తో మారుతి ఈ జానర్లో ఈ దశలో సినిమా చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చూశాక ప్రభాస్ పాత్ర, కథ విషయంలో జనాలకు ఒక అంచనా వచ్చేసింది.
ప్రభాస్ ‘రాజా సాబ్’లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్నది స్పష్టం. ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్లో చూపించిన యంగ్ క్యారెక్టర్ ఒకటైతే.. ఇంకోటేమో లేటెస్ట్గా రిలీజ్ చేసిన పోస్టర్లో కనిపించిన రాజు క్యారెక్టర్. ఇలా హీరో పాత్రను రెండు రకాలుగా చూడగానే జనాలకు చంద్రముఖి, నాగవల్లి సినిమాలు గుర్తుకు వస్తున్నాయి.
‘చంద్రముఖి’లో డాక్టర్, రాజు పాత్రల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎలా చెలరేగిపోయారో తెలిసిందే. ఆ సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అయింది. ఐతే ఈ చిత్ర దర్శకుడు పి.వాసు దీనికి కొనసాగింపుగా తీసిన ‘నాగవల్లి’లో విక్టరీ వెంకటేష్ సైతం ఇలాగే డాక్టర్, రాజు పాత్రల్లో కనిపించాడు.
కానీ ఆయనకు రాజు పాత్ర అస్సలు సూట్ కాలేదు. సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ రజినీలా మెప్పించి బ్లాక్ బస్టర్ అందుకుంటాడా.. లేక వెంకీలా డిజప్పాయింట్ చేసి ఫెయిల్యూర్ను ఖాతాలో వేసుకుంటాడా అన్నది చూడాలి.
This post was last modified on October 24, 2024 6:06 pm
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…