Trends

70 బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్‌కు భారీ నష్టం

ఇటీవల దేశీయ విమానయాన రంగంలో బాంబు బెదిరింపుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది విమానయాన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. గడచిన వారం పది రోజుల్లోనే 70కి పైగా బెదిరింపులు నమోదయ్యాయి. బాంబు బెదిరింపులు వచ్చిన ప్రతిసారీ అన్ని రకాల భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ బెదిరింపులు ప్రధానంగా సోషల్ మీడియా ఖాతాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా అందివ్వబడుతున్నాయి.

అయితే, ఇవన్నీ ఉత్తుత్తి బెదిరింపులే కావడం విశేషం. అయినా సరే, ప్రొటోకాల్ ప్రకారం విమానయాన సంస్థలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడంతో వారికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విమానం గాల్లో ఉన్నప్పుడు బెదిరింపు వస్తే, వెంటనే సమీప విమానాశ్రయంలో దిగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ప్రయాణికులను దింపి, విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం, అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉంటే బాంబ్ స్క్వాడ్‌ని పిలిపించడమనే ప్రక్రియలు జరుగుతాయి. ఈ మొత్తం ప్రక్రియ పూర్తవడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది.

ఇతర విమానాల షెడ్యూల్‌ని చెక్ చేసి ఏటీసీ అనుమతి పొందడం, విమానం మళ్లీ ఎగరాలంటే సమయం పట్టడం వంటివి ఈ ప్రక్రియలో ఒక భాగం. ఈ కారణంగా ప్రయాణికులు ఎయిర్ పోర్ట్‌లో వేచి ఉండాల్సి రావడంతో విమానయాన సంస్థలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో ప్రయాణికులకు అవసరమైన హోటల్ వసతి, భోజన ఏర్పాట్లు, ఇతర సదుపాయాలను అందించాల్సిన బాధ్యత కూడా విమానయాన సంస్థలకే ఉంటుంది.

ఈ ఏర్పాట్లు చేయడంలో అయ్యే ఖర్చు, ఒకవేళ విమానాన్ని దారిమళ్లిస్తే వచ్చే అదనపు ఇంధన ఖర్చులు ఇలా కలిపితే ఒకసారి బెదిరింపులు వచ్చిన ప్రతీసారీ కనీసం రూ. 3 కోట్ల వరకు ఖర్చవుతోందని విమానయాన సంస్థలు చెబుతున్నాయి. అంతే కాకుండా, ఈ పరిస్థితే లీగల్ సమస్యలకు కూడా దారితీస్తోంది. అంతర్జాతీయ కనెక్టింగ్ ఫ్లైట్‌ బుక్ చేసుకున్న ప్రయాణికులు, ఒకవేళ తమ విమానం ఆలస్యం అవ్వడం వల్ల తర్వాతి విమానాన్ని మిస్ అయితే, కోర్టులో కేసులు వేయడం సర్వసాధారణం. మరి ఈ సమస్యలకు ఎలాంటి పరిష్కారం వెతుకుతారో చూడాలి.

This post was last modified on October 20, 2024 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

5 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

5 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

6 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

6 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

7 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

7 hours ago