Trends

ప్రతి విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం!

సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఇకపై మరింత పారదర్శకత రానుంది. కోర్టు విచారణలను ప్రజలందరూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించేందుకు వీలుగా సుప్రీంకోర్టు యాప్‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్‌ పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. లోపాలను సవరించి, త్వరలోనే దీన్ని ప్రారంభించాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. ఈ విధానంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు.

అయితే 2018లోనే సుప్రీంకోర్టు కొన్ని కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, వాస్తవంగా ఈ ప్రణాళిక అమలులోకి రాలేదు. ఇంతవరకు దేశ ప్రజలు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యవహారాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా ఉంది. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు తొలిసారి రాజ్యాంగ ధర్మాసనం విచారణలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ముఖ్యంగా శివసేనలోని విభేదాలు, మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మలుపులతో కూడిన సేన vs సేన కేసు తొలి లైవ్‌ స్ట్రీమింగ్‌ గా అప్పట్లో వైరల్ అయ్యింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీ విరమణ సమయంలో చివరి కేసు విచారణను లైవ్‌ స్ట్రీమ్‌ చేశారు. ఈ తరహా విధానంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కేసులపై కూడా ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఇప్పటివరకు కొన్ని కీలక కేసులనే లైవ్‌ స్ట్రీమ్‌ చేసిన సుప్రీం, ఇప్పుడు అన్ని కేసులను కూడా ఈ విధానంలో చూపేందుకు సిద్ధమవుతోంది. త్వరలో అందుబాటులోకి రానున్న సుప్రీంకోర్టు యాప్‌ ద్వారా ప్రజలు లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

This post was last modified on October 18, 2024 7:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మోక్షజ్ఞ ఉండగా ప్రభాస్ పేరెందుకొచ్చింది

డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో ఒక సినిమా ఉండబోతోందని, దానికి సంబంధించిన ప్రకటన ఏ నిమిషమైనా రావొచ్చని…

1 hour ago

BSNL స్టన్నింగ్ టెక్నాలజీ: ఇక సిమ్‌కార్డ్ తో పనిలేదు

ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించబోతోంది. ఈసారి ప్రముఖ గ్లోబల్ శాటిలైట్…

2 hours ago

ఆరోసారి అదృష్టం కలిసొస్తుందా కీర్తి

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బజ్ తెప్పించడం కష్టం. ఒకటి రెండు ఆడినంత మాత్రాన జనం వాటినే కోరుకుంటారనే గ్యారెంటీ లేదు.…

3 hours ago

మహిళలకు ఫ్రీ బస్ పథకం..షర్మిల వినూత్న నిరసన

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి…

3 hours ago

మీకు ఒక్కటే దారి.. లేదంటే వేటాడి చంపుతాం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం…

4 hours ago

లిక్కర్ వ్యాపారం జొలికెళ్లొద్దు.. చంద్రబాబు సూచన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత మరిన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ…

5 hours ago