సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఇకపై మరింత పారదర్శకత రానుంది. కోర్టు విచారణలను ప్రజలందరూ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించేందుకు వీలుగా సుప్రీంకోర్టు యాప్ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్ పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. లోపాలను సవరించి, త్వరలోనే దీన్ని ప్రారంభించాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. ఈ విధానంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు.
అయితే 2018లోనే సుప్రీంకోర్టు కొన్ని కేసుల విచారణలను లైవ్ స్ట్రీమ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, వాస్తవంగా ఈ ప్రణాళిక అమలులోకి రాలేదు. ఇంతవరకు దేశ ప్రజలు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యవహారాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా ఉంది. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు తొలిసారి రాజ్యాంగ ధర్మాసనం విచారణలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముఖ్యంగా శివసేనలోని విభేదాలు, మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మలుపులతో కూడిన సేన vs సేన కేసు తొలి లైవ్ స్ట్రీమింగ్ గా అప్పట్లో వైరల్ అయ్యింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీ విరమణ సమయంలో చివరి కేసు విచారణను లైవ్ స్ట్రీమ్ చేశారు. ఈ తరహా విధానంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కేసులపై కూడా ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఇప్పటివరకు కొన్ని కీలక కేసులనే లైవ్ స్ట్రీమ్ చేసిన సుప్రీం, ఇప్పుడు అన్ని కేసులను కూడా ఈ విధానంలో చూపేందుకు సిద్ధమవుతోంది. త్వరలో అందుబాటులోకి రానున్న సుప్రీంకోర్టు యాప్ ద్వారా ప్రజలు లైవ్ స్ట్రీమింగ్ను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.
This post was last modified on October 19, 2024 9:40 am
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…