Trends

ప్రతి విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం!

సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఇకపై మరింత పారదర్శకత రానుంది. కోర్టు విచారణలను ప్రజలందరూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించేందుకు వీలుగా సుప్రీంకోర్టు యాప్‌ను త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ యాప్‌ పై ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించారు. లోపాలను సవరించి, త్వరలోనే దీన్ని ప్రారంభించాలని సుప్రీంకోర్టు యోచిస్తోంది. ఈ విధానంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు.

అయితే 2018లోనే సుప్రీంకోర్టు కొన్ని కేసుల విచారణలను లైవ్‌ స్ట్రీమ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ, వాస్తవంగా ఈ ప్రణాళిక అమలులోకి రాలేదు. ఇంతవరకు దేశ ప్రజలు సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యవహారాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేకుండా ఉంది. ఈ నిర్ణయంతో దేశ ప్రజలకు చట్టసంబంధి నిర్ణయాలపై మరింత అవగాహన కలుగుతుందని భావిస్తున్నారు. రెండేళ్ల క్రితం సుప్రీంకోర్టు తొలిసారి రాజ్యాంగ ధర్మాసనం విచారణలను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది.

ముఖ్యంగా శివసేనలోని విభేదాలు, మహారాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మలుపులతో కూడిన సేన vs సేన కేసు తొలి లైవ్‌ స్ట్రీమింగ్‌ గా అప్పట్లో వైరల్ అయ్యింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ ఈ విషయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పదవీ విరమణ సమయంలో చివరి కేసు విచారణను లైవ్‌ స్ట్రీమ్‌ చేశారు. ఈ తరహా విధానంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 వంటి కేసులపై కూడా ప్రత్యక్ష ప్రసారం జరిగింది. ఇప్పటివరకు కొన్ని కీలక కేసులనే లైవ్‌ స్ట్రీమ్‌ చేసిన సుప్రీం, ఇప్పుడు అన్ని కేసులను కూడా ఈ విధానంలో చూపేందుకు సిద్ధమవుతోంది. త్వరలో అందుబాటులోకి రానున్న సుప్రీంకోర్టు యాప్‌ ద్వారా ప్రజలు లైవ్‌ స్ట్రీమింగ్‌ను వీక్షించేందుకు అవకాశం ఉంటుంది.

This post was last modified on October 19, 2024 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమలు బ్యూటీకి సీనియర్ స్టార్ల ఛాన్సులు

గత ఏడాది మలయాళం బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక…

3 hours ago

సునీతా విలియమ్స్ భారత పర్యటన.. ఎప్పుడంటే?

అంతరిక్షం నుంచి భూమికి తిరిగొచ్చిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలోనే భారత్‌కు రానున్నారని సమాచారం. తొమ్మిది నెలల…

4 hours ago

IPL 2025: 13 ఏళ్ల కుర్రాడి ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు?

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో అందరి దృష్టి ఒక చిన్న కుర్రాడిపై నిలిచింది. కేవలం 13 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లో అడుగుపెడుతున్న…

4 hours ago

DSP విలువ తెలిసినట్టు ఉందే

సినిమాలు తగ్గించినా సరే దేవిశ్రీ ప్రసాద్ సంగీతానికి ఉన్న ఫాలోయింగ్ చాలా ప్రత్యేకం. డిసెంబర్లో పుష్ప 2 ది రూల్…

5 hours ago

ఆదివారం రిలీజ్ ఎందుకు భాయ్

సల్మాన్ ఖాన్ సికిందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ మార్చి 30 వస్తున్నట్టు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం అందిందని…

5 hours ago

క్షేమంగా తిరిగొచ్చిన సునీత… అమెరికా, భారత్ లో సంబరాలు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో చిక్కుబడిపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ మంగళవారం సురక్షితంగా భూమిపైకి చేరారు. సునీతతో…

6 hours ago