Trends

BSNL స్టన్నింగ్ టెక్నాలజీ: ఇక సిమ్‌కార్డ్ తో పనిలేదు

ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించబోతోంది. ఈసారి ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసాట్’తో కలిసి డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) టెక్నాలజీని పరిచయం చేయనుంది. ఈ సాంకేతికతతో సిమ్‌కార్డు అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ పొందొచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

డీటుడీ టెక్నాలజీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ కార్లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఈ సాంకేతికత పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి క్వాలిటీ సేవలను అందించవచ్చు. డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీతో నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావచ్చు. అంటే ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు.. నెట్‌వర్క్ లేకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్టివిటీని ఇస్తుందన్నమాట.

మారుమూల గ్రామాల వారికి, కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సాధారణంగా కాల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మొబైల్ టవర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త డీటుడీ టెక్నాలజీతో ఇక టవర్ల అవసరం ఉండదు. సిమ్‌కార్డ్ లేకున్నా కూడా శాటిలైట్ ద్వారా నేరుగా కనెక్ట్ అయ్యి సేవలు పొందవచ్చు. ఇంతకు ముందు వాడుతున్న టెక్నాలజీల కన్నా ఇది విప్లవాత్మక మార్పును తీసుకొస్తుంది.

ఈ టెక్నాలజీపై ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. దాదాపు 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్ ద్వారా కాల్ చేయడం, కనెక్టివిటీ పొందడం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది అత్యంత నమ్మకమైన టెక్నాలజీ అని, గ్రామీణ ప్రాంతాలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే యూజర్లకు ఇది మరింత సౌకర్యంగా ఉండబోతుందని అభిప్రాయపడింది. త్వరలోనే ఈ డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

This post was last modified on October 18, 2024 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దుర్గేశ్ ప్లాన్ సక్సెస్ .. ‘సూర్యలంక’కు రూ.97 కోట్లు

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా జనసేన కీలక నేత కందుల దుర్గేశ్ సత్తా చాటుతున్నారని చెప్పాలి. ప్రభుత్వ ఆధ్వర్యంలోని పర్యాటక…

7 hours ago

బాబుకు జయమంగళ పాదాభివందనం

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ…

8 hours ago

2027 జూన్ నాటికి పోలవరం పూర్తి: చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు… ఏపీకి జీవనాడి. జాతీయ ప్రాజెక్టు హోదా కలిగిన ఈ ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే…

9 hours ago

చివరి నిమిషం టెన్షన్లకు ఎవరు బాధ్యులు

అంతా సిద్దమనుకుని ఇంకాసేపట్లో షోలు పడతాయన్న టైంలో హఠాత్తుగా విడుదల ఆగిపోతే ఆ నిర్మాతలు పడే నరకం అంతా ఇంతా…

9 hours ago

టాస్క్ ఫోర్స్ ఎంట్రీ.. గేట్స్ సహకారానికి రూట్ క్లియర్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నేతృత్వంలోని గేట్స్ అండ్ మిలిండా ఫౌండేషన్ ఏపీకి వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు ఇప్పటికే…

10 hours ago

గురువుని ఇంత ఫాలో అవ్వాలా శిష్యా

ఇవాళ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పెద్ది ఫస్ట్ లుక్ పోస్టర్స్ గురించి సోషల్ మీడియా మంచి…

10 hours ago