ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించబోతోంది. ఈసారి ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసాట్’తో కలిసి డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) టెక్నాలజీని పరిచయం చేయనుంది. ఈ సాంకేతికతతో సిమ్కార్డు అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ పొందొచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.
డీటుడీ టెక్నాలజీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. స్మార్ట్వాచ్లు, స్మార్ట్ కార్లు, ఇతర స్మార్ట్ డివైజ్లకు కూడా ఈ సాంకేతికత పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి క్వాలిటీ సేవలను అందించవచ్చు. డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీతో నేరుగా శాటిలైట్ నెట్వర్క్తో అనుసంధానం కావచ్చు. అంటే ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు.. నెట్వర్క్ లేకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్టివిటీని ఇస్తుందన్నమాట.
మారుమూల గ్రామాల వారికి, కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సాధారణంగా కాల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మొబైల్ టవర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త డీటుడీ టెక్నాలజీతో ఇక టవర్ల అవసరం ఉండదు. సిమ్కార్డ్ లేకున్నా కూడా శాటిలైట్ ద్వారా నేరుగా కనెక్ట్ అయ్యి సేవలు పొందవచ్చు. ఇంతకు ముందు వాడుతున్న టెక్నాలజీల కన్నా ఇది విప్లవాత్మక మార్పును తీసుకొస్తుంది.
ఈ టెక్నాలజీపై ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. దాదాపు 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్ ద్వారా కాల్ చేయడం, కనెక్టివిటీ పొందడం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది అత్యంత నమ్మకమైన టెక్నాలజీ అని, గ్రామీణ ప్రాంతాలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే యూజర్లకు ఇది మరింత సౌకర్యంగా ఉండబోతుందని అభిప్రాయపడింది. త్వరలోనే ఈ డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.
This post was last modified on October 18, 2024 3:16 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…