Trends

BSNL స్టన్నింగ్ టెక్నాలజీ: ఇక సిమ్‌కార్డ్ తో పనిలేదు

ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇవ్వడానికి BSNL సరికొత్త టెక్నాలజీతో సంచలనం సృష్టించబోతోంది. ఈసారి ప్రముఖ గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసాట్’తో కలిసి డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) టెక్నాలజీని పరిచయం చేయనుంది. ఈ సాంకేతికతతో సిమ్‌కార్డు అవసరం లేకుండా నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ పొందొచ్చని అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తయ్యాయి.

డీటుడీ టెక్నాలజీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ కార్లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా ఈ సాంకేతికత పూర్తిగా సపోర్ట్ చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి క్వాలిటీ సేవలను అందించవచ్చు. డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీతో నేరుగా శాటిలైట్ నెట్‌వర్క్‌తో అనుసంధానం కావచ్చు. అంటే ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు.. నెట్‌వర్క్ లేకున్నా ఎలాంటి అంతరాయం లేకుండా కనెక్టివిటీని ఇస్తుందన్నమాట.

మారుమూల గ్రామాల వారికి, కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సాధారణంగా కాల్స్, ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం మొబైల్ టవర్ల మీద ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, ఈ కొత్త డీటుడీ టెక్నాలజీతో ఇక టవర్ల అవసరం ఉండదు. సిమ్‌కార్డ్ లేకున్నా కూడా శాటిలైట్ ద్వారా నేరుగా కనెక్ట్ అయ్యి సేవలు పొందవచ్చు. ఇంతకు ముందు వాడుతున్న టెక్నాలజీల కన్నా ఇది విప్లవాత్మక మార్పును తీసుకొస్తుంది.

ఈ టెక్నాలజీపై ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. దాదాపు 36,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శాటిలైట్ ద్వారా కాల్ చేయడం, కనెక్టివిటీ పొందడం జరిగిందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. ఇది అత్యంత నమ్మకమైన టెక్నాలజీ అని, గ్రామీణ ప్రాంతాలు, క్షేత్ర స్థాయిలో పనిచేసే యూజర్లకు ఇది మరింత సౌకర్యంగా ఉండబోతుందని అభిప్రాయపడింది. త్వరలోనే ఈ డైరెక్ట్ టు డివైజ్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

This post was last modified on October 18, 2024 3:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతి విచారణ లైవ్‌.. సుప్రీంకోర్టు కొత్త ప్రయోగం!

సుప్రీంకోర్టు కార్యకలాపాల్లో ఇకపై మరింత పారదర్శకత రానుంది. కోర్టు విచారణలను ప్రజలందరూ లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా వీక్షించేందుకు వీలుగా సుప్రీంకోర్టు…

1 hour ago

మోక్షజ్ఞ ఉండగా ప్రభాస్ పేరెందుకొచ్చింది

డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ వర్మ కలయికలో ఒక సినిమా ఉండబోతోందని, దానికి సంబంధించిన ప్రకటన ఏ నిమిషమైనా రావొచ్చని…

2 hours ago

ఆరోసారి అదృష్టం కలిసొస్తుందా కీర్తి

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు బజ్ తెప్పించడం కష్టం. ఒకటి రెండు ఆడినంత మాత్రాన జనం వాటినే కోరుకుంటారనే గ్యారెంటీ లేదు.…

4 hours ago

మహిళలకు ఫ్రీ బస్ పథకం..షర్మిల వినూత్న నిరసన

ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి…

4 hours ago

మీకు ఒక్కటే దారి.. లేదంటే వేటాడి చంపుతాం: ఇజ్రాయెల్

ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తాజాగా కీలక ప్రకటన చేశారు. హమాస్ నేత యహ్యా సిన్వర్ మృతితో గాజా యుద్ధం…

5 hours ago

లిక్కర్ వ్యాపారం జొలికెళ్లొద్దు.. చంద్రబాబు సూచన

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన తర్వాత మరిన్ని పథకాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు ఏపీ…

5 hours ago