Trends

46 పరుగులకే.. టీమిండియా మరో చెత్త రికార్డ్

గత 36 ఏళ్ళకు న్యూజిలాండ్ భారత్ గడ్డపై ఒక్క టెస్ట్ సీరీస్ లో కూడా విజయం సాధించలేదు. ఇక బుధవారం బెంగుళూరు చిన్నస్వామీ స్టేడియంలో మొదలైన టెస్టులో భారత్‌ కు తిరుగులేదని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా న్యూజిలాండ్‌ బౌలర్లు భారత్‌ బ్యాటింగ్‌ లైనప్ ను ఒక్కసారిగా కూల్చేశారు. తొలిఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా కేవలం 46 పరుగులకే ఆలౌట్‌ అయింది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో భారత్‌ సొంతగడ్డపై ఇది అత్యల్ప స్కోర్‌.

భారత ఓపెనర్లు రోహిత్‌ శర్మ (2), యశస్వి జైస్వాల్‌ (13) కొన్ని ఓవర్ల పాటు వికెట్‌ ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. అయితే, సౌథీ ఇన్‌స్వింగర్‌ బంతితో రోహిత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి, భారత్‌ను ఇబ్బంది పెట్టాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (0), సర్ఫరాజ్‌ ఖాన్‌ (0) లు కూడా ఆ కివీస్‌ బౌలర్ల ముందు తలవంచారు. ఈ మ్యాచ్‌లో ఐదుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు, అత్యధిక పరుగులు చేసిన వారు రిషభ్‌ పంత్‌ (20), యశస్వి జైస్వాల్‌ (13) మాత్రమే. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ 4 వికెట్లు పడగొట్టగా, సౌథీ ఒక వికెట్‌ తీశాడు.

ఇక భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై ఇది అత్యల్ప స్కోరుగా ఒక చెత్త రికార్డుగా నమోదైంది. 2021లో ముంబయి వేదికగా కివీస్‌పైనే 62 పరుగులు చేసిన భారత్‌ ఈ సారి 46 పరుగులతో ఆ రికార్డును మరింత చెత్తగా మార్చుకుంది. అదిలైడ్‌లో 2020లో ఆస్ట్రేలియాపై 36 పరుగులకే ఆలౌటైన రికార్డుకి ఇది దగ్గరగా ఉంది.

బెంగుళూరులో ఇటీవల వర్షాలు కారణంగా కూడా పిచ్ ఒక్కసారిగా బౌలర్లకు ఆయువు పట్టులా మారింది. దీంతో న్యూజిలాండ్‌ పేసర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బంతులు సంధించారు. న్యూజిలాండ్‌ బౌలర్‌ మ్యాట్‌ హెన్రీ ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి, తన 26వ టెస్టులో వంద వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. అతను అత్యంత వేగంగా ఈ మైలురాయి చేరుకున్న కివీస్‌ బౌలర్లలో మూడో స్థానంలో నిలిచాడు.

This post was last modified on October 17, 2024 2:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కృష్ణార్పణం కానున్న మరో శుక్రవారం

కొన్ని శుక్రవారాలు సినీ ప్రియులకు చప్పగా అనిపిస్తాయి. కొత్త సినిమాల కోసం ఎదురు చూసే మూవీ లవర్స్ కు కళ్ళముందు…

6 mins ago

ఒక షెడ్యూల్‌ అయ్యాక రకుల్‌ను తీసేసి..

టాలీవుడ్లో ఒకప్పుడు కథానాయికగా ఒక వెలుగు వెలిగింది ముంబయి భామ రకుల్ ప్రీత్. 2013లో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో కథానాయికగా…

1 hour ago

బాహుబలి 3 నిజంగా జరిగే పనేనా

కంగువ ప్రమోషన్లలో భాగంగా నిర్మాత జ్ఞానవేల్ రాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి 3 ఉంటుందని, గత వారమే దాని…

3 hours ago

మణిరత్నం – రజినీకాంత్.. ఆమె గాలి తీసేసింది!

కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సిరీస్ తర్వాత కాస్త స్పీడ్ పెంచినట్లు అనిపిస్తోంది. ఇప్పటికే కమల్ హాసన్…

4 hours ago

రేవంత్ సర్కారు తీసుకున్న కొత్త అప్పు వర్సెస్ తీర్చిన కిస్తీ

అప్పు మీద అప్పు తీసుకోవటమే కానీ చేస్తున్నది ఏమీ లేదంటూ రేవంత్ సర్కారు మీద బీఆర్ఎస్ ముఖ్యనేతలు తరచూ విరుచుకుపడుతుండటం…

4 hours ago

ఓటిటిలో మత్తు…..మరింత పెరుగుతోంది

కొన్ని సినిమాలు థియేటర్లలో ఎంత బ్లాక్ బస్టర్ అయినా ఓటిటిలో వచ్చాక స్పందన వేరుగా ఉంటుంది. నెగటివ్ గా కనిపించినా…

5 hours ago