Trends

సన్‌రైజర్స్‌ 2025 రిటెన్షన్‌: క్లాసెన్‌ తో పాటు ఆ ముగ్గురు

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం మెగా వేలం ప్రారంభం కాకముందే, అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ చివరి నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను అందించాల్సి ఉంది. ముందుగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను రూ.18 కోట్లకు, అక్షర్ పటేల్‌ను రూ.14 కోట్లకు, స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను రూ.11 కోట్లకు రిటైన్ చేయనున్నట్లు సమాచారం.

దిల్లీ జట్టు మొత్తం రిటెన్షన్‌ కోసం రూ.75 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమై ఉంది. ఈసారి ప్రతి ఫ్రాంచైజీకి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉండే విధానం అవలంబించనున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా తన కీలక ఆటగాళ్లను మిస్ చేసుకోకుండా ముందడుగు వేసింది.

సన్‌రైజర్స్‌ జట్టు అత్యధిక ధరతో రిటైన్ చేసుకోబోయే ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ కావొచ్చని సమాచారం. పటిష్టమైన హిట్టర్‌గా పేరుపొందిన క్లాసెన్‌ను సన్‌రైజర్స్‌ రూ.23 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్‌ వెబ్‌సైట్లు తెలిపాయి. అలాగే, పాట్ కమిన్స్‌ను కూడా సన్‌రైజర్స్‌ జట్టు రూ.18 కోట్లకు రిటైన్ చేయనుంది.

కెప్టెన్‌గా సేవలు అందించిన కమిన్స్‌ గత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ కు సపోర్ట్ చేసాడు. అతడిని రూ.14 కోట్లకు రిటైన్ చేయనున్నారు. మరోవైపు, ట్రావిస్ హెడ్‌ మరియు ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్‌ తమ జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

This post was last modified on October 17, 2024 9:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago