Trends

సన్‌రైజర్స్‌ 2025 రిటెన్షన్‌: క్లాసెన్‌ తో పాటు ఆ ముగ్గురు

ఐపీఎల్‌ 2025 సీజన్‌ కోసం మెగా వేలం ప్రారంభం కాకముందే, అన్ని ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల రిటెన్షన్‌ జాబితాలను సిద్ధం చేస్తున్నాయి. సెప్టెంబర్‌ చివరి నాటికి ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్‌ జాబితాను అందించాల్సి ఉంది. ముందుగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ ముగ్గురు ప్రధాన ఆటగాళ్లను రిటైన్ చేసుకోనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ను రూ.18 కోట్లకు, అక్షర్ పటేల్‌ను రూ.14 కోట్లకు, స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను రూ.11 కోట్లకు రిటైన్ చేయనున్నట్లు సమాచారం.

దిల్లీ జట్టు మొత్తం రిటెన్షన్‌ కోసం రూ.75 కోట్ల వరకు ఖర్చు చేయడానికి సిద్ధమై ఉంది. ఈసారి ప్రతి ఫ్రాంచైజీకి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, అందులో ఒక రైట్‌ టు మ్యాచ్‌ (ఆర్‌టీఎం) ఉండే విధానం అవలంబించనున్నారు. ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కూడా తన కీలక ఆటగాళ్లను మిస్ చేసుకోకుండా ముందడుగు వేసింది.

సన్‌రైజర్స్‌ జట్టు అత్యధిక ధరతో రిటైన్ చేసుకోబోయే ఆటగాడు హెన్రిచ్‌ క్లాసెన్‌ కావొచ్చని సమాచారం. పటిష్టమైన హిట్టర్‌గా పేరుపొందిన క్లాసెన్‌ను సన్‌రైజర్స్‌ రూ.23 కోట్ల భారీ మొత్తానికి రిటైన్ చేసుకునే అవకాశం ఉందని స్పోర్ట్స్‌ వెబ్‌సైట్లు తెలిపాయి. అలాగే, పాట్ కమిన్స్‌ను కూడా సన్‌రైజర్స్‌ జట్టు రూ.18 కోట్లకు రిటైన్ చేయనుంది.

కెప్టెన్‌గా సేవలు అందించిన కమిన్స్‌ గత సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ గత సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ కు సపోర్ట్ చేసాడు. అతడిని రూ.14 కోట్లకు రిటైన్ చేయనున్నారు. మరోవైపు, ట్రావిస్ హెడ్‌ మరియు ఆల్‌రౌండర్‌ నితీశ్ కుమార్ రెడ్డిని కూడా సన్‌రైజర్స్‌ తమ జట్టులో కొనసాగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

Satya

Recent Posts

చరణ్ లైనప్ లో పెద్ది ఇంపాక్ట్

పెద్ది ఇప్పుడు రామ్ చరణ్ కెరీర్‌లో మరో చాలెంజ్ లాంటి ప్రాజెక్టు. RRR తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్‌ని నిలబెట్టుకోవాలి.…

16 minutes ago

ప్రమోషన్లు నిల్లు… సినిమా కిల్లు

ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా సినిమా అయినా దాన్ని జనంలోకి తీసుకెళ్లాలంటే ప్రచారం తప్పనిసరి. కంటెంట్ ఉంటే చాలు ఇంకేం…

32 minutes ago

సినిమా థియేటర్ లో స్పిరిట్ షూట్ ఎలాగయ్య వంగా

టాలీవుడ్ టాప్ హీరోలు వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి ఒకట్రెండు రిలీజ్‌లు ఉండేలా చూసుకోవాలని ఇటు ఇండస్ట్రీ జనాలు, అటు…

58 minutes ago

అర్జున్ మార్కెట్ బ్రతికే ఉంది

ఒకప్పుడు యాక్షన్ కింగ్ గా మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరో అర్జున్. తెలుగులో మా పల్లెలో గోపాలుడు లాంటి…

2 hours ago

15 ఏళ్ల సూర్యవంశీ… రికార్డులేంటి స్వామి…!

రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్ సీజన్‌ను పూర్తిగా తన సొంతం…

2 hours ago

ఆర్సీబీ గెలిస్తే ఆస్తులు ధ్వంసం చేస్తారా… ఇదెక్కడి ఫ్యానిజం?

​ఐపీఎల్ ఫైనల్స్ లో ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ…

3 hours ago