బుధవారం నుంచి ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో తిరిగి ఫామ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కివీస్కు భారత్ గడ్డపై గత 36 ఏళ్లుగా విజయం దక్కలేదన్న ఆసక్తికర విషయం.
చిన్నస్వామి స్టేడియంలో 2012లో న్యూజిలాండ్తో భారత్ చివరిసారి తలపడ్డప్పుడు టీమ్ఇండియా విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, ధోనీ, రైనా అద్భుత ప్రదర్శనతో భారత్ 2-0 తేడాతో ఆ సిరీస్ను గెలుచుకుంది. అశ్విన్ కీలకమైన ఐదు వికెట్లు తీసి, కివీస్ను రెండో ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేయడంతో, భారత్ విజయాన్ని సులభంగా చేజిక్కించుకుంది.
కివీస్ టెస్టు రికార్డు కూడా 1988 తర్వాత భారత్ గడ్డపై పెద్దగా మెరుగు పడలేదు. ఆ సంవత్సరంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ గెలిచిన తర్వాత, ఇప్పటి వరకు 18 టెస్టుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన తర్వాత కివీస్ సుదీర్ఘ కాలం పాటు ఆ దూకుడుని నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో కూడా పరాభవం పాలైన కివీస్ ర్యాంకింగ్స్లో ఆరవ స్థానానికి పడిపోయింది.
భారత్పై టెస్టు గెలవడం కివీస్కు కష్టమైన సవాలుగా మారింది. ఈ సిరీస్ న్యూజిలాండ్కి డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరే అవకాశాన్ని బలోపేతం చేసే కీలకమైన సిరీస్. ఇంగ్లండ్తో త్వరలో జరగబోయే సిరీస్లోనూ కివీస్ మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం. ఇప్పటివరకు భారత్-కివీస్ మధ్య జరిగిన 62 టెస్టుల్లో భారత్ 22 సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్ 13 సార్లు మాత్రమే గెలిచింది.
This post was last modified on October 17, 2024 9:37 am
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…