Trends

36 ఏళ్ళుగా విజయం లేదా.. మరి టీమిండియాతో గెలుస్తారా?

బుధవారం నుంచి ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కివీస్‌కు భారత్‌ గడ్డపై గత 36 ఏళ్లుగా విజయం దక్కలేదన్న ఆసక్తికర విషయం.

చిన్నస్వామి స్టేడియంలో 2012లో న్యూజిలాండ్‌తో భారత్‌ చివరిసారి తలపడ్డప్పుడు టీమ్‌ఇండియా విజయాన్ని నమోదు చేసింది. విరాట్‌ కోహ్లీ, ధోనీ, రైనా అద్భుత ప్రదర్శనతో భారత్‌ 2-0 తేడాతో ఆ సిరీస్‌ను గెలుచుకుంది. అశ్విన్‌ కీలకమైన ఐదు వికెట్లు తీసి, కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో, భారత్‌ విజయాన్ని సులభంగా చేజిక్కించుకుంది.

కివీస్‌ టెస్టు రికార్డు కూడా 1988 తర్వాత భారత్‌ గడ్డపై పెద్దగా మెరుగు పడలేదు. ఆ సంవత్సరంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ గెలిచిన తర్వాత, ఇప్పటి వరకు 18 టెస్టుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత కివీస్‌ సుదీర్ఘ కాలం పాటు ఆ దూకుడుని నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో కూడా పరాభవం పాలైన కివీస్‌ ర్యాంకింగ్స్‌లో ఆరవ స్థానానికి పడిపోయింది.

భారత్‌పై టెస్టు గెలవడం కివీస్‌కు కష్టమైన సవాలుగా మారింది. ఈ సిరీస్‌ న్యూజిలాండ్‌కి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ చేరే అవకాశాన్ని బలోపేతం చేసే కీలకమైన సిరీస్‌. ఇంగ్లండ్‌తో త్వరలో జరగబోయే సిరీస్‌లోనూ కివీస్‌ మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం. ఇప్పటివరకు భారత్‌-కివీస్‌ మధ్య జరిగిన 62 టెస్టుల్లో భారత్‌ 22 సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్‌ 13 సార్లు మాత్రమే గెలిచింది.

Satya

Recent Posts

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

17 minutes ago

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

47 minutes ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

2 hours ago

నాగబంధం.. ఈ కొత్త సౌండ్ ఎవరిది?

స్టార్లు లేకపోయినా సరే ఏకంగా వంద కోట్ల బడ్జెట్లో భారీగా తెరకెక్కి, కళ్లు చెదిరే విజువల్స్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన…

4 hours ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

5 hours ago