బుధవారం నుంచి ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్ టెస్టు సిరీస్లో తిరిగి ఫామ్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కివీస్కు భారత్ గడ్డపై గత 36 ఏళ్లుగా విజయం దక్కలేదన్న ఆసక్తికర విషయం.
చిన్నస్వామి స్టేడియంలో 2012లో న్యూజిలాండ్తో భారత్ చివరిసారి తలపడ్డప్పుడు టీమ్ఇండియా విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ, ధోనీ, రైనా అద్భుత ప్రదర్శనతో భారత్ 2-0 తేడాతో ఆ సిరీస్ను గెలుచుకుంది. అశ్విన్ కీలకమైన ఐదు వికెట్లు తీసి, కివీస్ను రెండో ఇన్నింగ్స్లో కేవలం 248 పరుగులకే ఆలౌట్ చేయడంతో, భారత్ విజయాన్ని సులభంగా చేజిక్కించుకుంది.
కివీస్ టెస్టు రికార్డు కూడా 1988 తర్వాత భారత్ గడ్డపై పెద్దగా మెరుగు పడలేదు. ఆ సంవత్సరంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ గెలిచిన తర్వాత, ఇప్పటి వరకు 18 టెస్టుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన తర్వాత కివీస్ సుదీర్ఘ కాలం పాటు ఆ దూకుడుని నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్లో కూడా పరాభవం పాలైన కివీస్ ర్యాంకింగ్స్లో ఆరవ స్థానానికి పడిపోయింది.
భారత్పై టెస్టు గెలవడం కివీస్కు కష్టమైన సవాలుగా మారింది. ఈ సిరీస్ న్యూజిలాండ్కి డబ్ల్యూటీసీ ఫైనల్స్ చేరే అవకాశాన్ని బలోపేతం చేసే కీలకమైన సిరీస్. ఇంగ్లండ్తో త్వరలో జరగబోయే సిరీస్లోనూ కివీస్ మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం. ఇప్పటివరకు భారత్-కివీస్ మధ్య జరిగిన 62 టెస్టుల్లో భారత్ 22 సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్ 13 సార్లు మాత్రమే గెలిచింది.
This post was last modified on October 17, 2024 9:37 am
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…
తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి…
ఉమ్మడి రాష్ట్రం ఏపీ, తెలంగాణగా విడిపోయాక సినిమా పరిశ్రమకు సంబంధించిన చర్చలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ పెద్దల మధ్య ప్రస్తావనకు రావడం…
తాను తీసే సినిమా కథ గురించి ఆరంభ దశలోనే మీడియాతో విశేషాలు పంచుకోవడం దర్శక ధీరుడు రాజమౌళికి అలవాటు. ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో రెండు రోజుల క్రితం ఓ కీలక అదికారిక కార్యక్రమం జరిగింది. ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ…