Trends

36 ఏళ్ళుగా విజయం లేదా.. మరి టీమిండియాతో గెలుస్తారా?

బుధవారం నుంచి ప్రారంభమవుతున్న టెస్టు సిరీస్‌లో భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 12 ఏళ్ల తర్వాత ఈ రెండు జట్లు టెస్టు ఆడబోతున్నాయి. ఈ నేపథ్యంలో, న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. అయితే, కివీస్‌కు భారత్‌ గడ్డపై గత 36 ఏళ్లుగా విజయం దక్కలేదన్న ఆసక్తికర విషయం.

చిన్నస్వామి స్టేడియంలో 2012లో న్యూజిలాండ్‌తో భారత్‌ చివరిసారి తలపడ్డప్పుడు టీమ్‌ఇండియా విజయాన్ని నమోదు చేసింది. విరాట్‌ కోహ్లీ, ధోనీ, రైనా అద్భుత ప్రదర్శనతో భారత్‌ 2-0 తేడాతో ఆ సిరీస్‌ను గెలుచుకుంది. అశ్విన్‌ కీలకమైన ఐదు వికెట్లు తీసి, కివీస్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 248 పరుగులకే ఆలౌట్‌ చేయడంతో, భారత్‌ విజయాన్ని సులభంగా చేజిక్కించుకుంది.

కివీస్‌ టెస్టు రికార్డు కూడా 1988 తర్వాత భారత్‌ గడ్డపై పెద్దగా మెరుగు పడలేదు. ఆ సంవత్సరంలో ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌ గెలిచిన తర్వాత, ఇప్పటి వరకు 18 టెస్టుల్లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత కివీస్‌ సుదీర్ఘ కాలం పాటు ఆ దూకుడుని నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవల శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో కూడా పరాభవం పాలైన కివీస్‌ ర్యాంకింగ్స్‌లో ఆరవ స్థానానికి పడిపోయింది.

భారత్‌పై టెస్టు గెలవడం కివీస్‌కు కష్టమైన సవాలుగా మారింది. ఈ సిరీస్‌ న్యూజిలాండ్‌కి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ చేరే అవకాశాన్ని బలోపేతం చేసే కీలకమైన సిరీస్‌. ఇంగ్లండ్‌తో త్వరలో జరగబోయే సిరీస్‌లోనూ కివీస్‌ మెరుగైన ప్రదర్శన చేయడం అత్యవసరం. ఇప్పటివరకు భారత్‌-కివీస్‌ మధ్య జరిగిన 62 టెస్టుల్లో భారత్‌ 22 సార్లు విజయం సాధించగా, న్యూజిలాండ్‌ 13 సార్లు మాత్రమే గెలిచింది.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

55 minutes ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

2 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

3 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

5 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

10 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

12 hours ago