Trends

రిలయన్స్ జియో బడ్జెట్ ఫోన్లు చూశారా..

రిలయన్స్ జియో తాజాగా రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ‘జియో భారత్ వి3’ మరియు ‘వీ4’ పేరిట వచ్చిన ఈ ఫోన్లు ఇప్పుడు సాధారణ మధ్యతరగతి జానాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రూ. 1,099 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్లు 2జీ యూజర్లను 4జీకి మారే అవకాశాన్ని కల్పిస్తాయి. పాత మోడల్ అయిన ‘జియో భారత్ వి2’ విజయవంతమయ్యాక, జియో డిజిటల్ డివైస్‌లతో మరింత మంది వినియోగదారులకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఈ కొత్త ఫోన్లు బడ్జెట్ ధరల్లోనే అధునాతన సౌకర్యాలు అందిస్తున్నాయి. డిజైన్ పరంగా యువతను ఆకట్టుకునేలా స్లీక్‌గా తీర్చిదిద్దారు. ‘జియో భారత్ వి3’ మరియు ‘వీ4’ ఫోన్లు స్టైల్, పెర్ఫార్మెన్స్ పరంగా మరింత మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి. వీటిలో ముందుగానే జియో డిజిటల్ సర్వీసులు ఇన్స్టాల్ చేసి ఉంటాయి, అందులో జియో టీవీ, జియో సినిమా, జియో పే వంటి సదుపాయాలు ఉంటాయి. జియో టీవీ ద్వారా 455 లైవ్ టీవీ చానళ్లను వీక్షించవచ్చు.

ఇక, జియో పే ద్వారా డిజిటల్ పేమెంట్స్ కూడా సులభంగా చేసుకోవచ్చు. ఫోన్లలో 1000 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు, 128 జీబీ వరకు స్టోరేజ్ విస్తరించుకునే అవకాశం ఉంది. వీటిలో 23 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండడం విశేషం. వాయిస్ కాల్స్, డేటా వంటి సేవలను కలిపి కేవలం రూ. 123తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో నెలలో అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు 14 జీబీ డేటా కూడా లభిస్తుంది, ఇది ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే 40% ఎక్కువ ఆదా చేయనుంది. త్వరలో ఈ ఫోన్లు జియోమార్ట్, అమెజాన్‌తో పాటు అన్ని ప్రముఖ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి.

This post was last modified on October 17, 2024 9:40 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

1 hour ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

2 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

2 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

3 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

8 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

12 hours ago