Illustrative picture of coronavirus vaccine under trail
ఆరు నెలలకు పైగా చూస్తున్నాం. ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కరోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ అది తప్పనే తేలుతోంది. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. 50 వేలు, 60 వేలు, 70 వేలు, 80 వేలు, 90 వేలు.. ఇలా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. కొన్ని రోజుల కిందట 95 వేల మార్కును దాటి రోజుకు లక్ష కేసుల మార్కు దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకుముందులా కరోనాకు జనం భయపడటం తగ్గించారు కానీ.. ఈ స్థాయిలో కేసులో పెరుగుతూ వెళ్లడం.. దీనికి బ్రేక్ ఎక్కడో తెలియకపోవడం ఆందోళన రేకెత్తించే విషయమే.
ఐతే ఎట్టకేలకు ఇండియాకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. కరోనా కేసుల తీవ్రత కొంచెం తగ్గింది. ఒక రోజు పెరగడం.. ఒకరోజు కొంచెం తగ్గడం కాకుండా వారం వ్యవధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. గత వారం రోజువారీ సగటు కేసుల సంఖ్య 90 వేలకు అటు ఇటుగా ఉండగా.. ఈ వారం అది 75 వేలకు తగ్గింది.
ఒకసారి ఇలా కొన్ని రోజుల సగటు కేసుల సంఖ్య తగ్గిందీ అంటే.. ఇక అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గుతూ వెళ్తాయని వరల్డ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే ఈ ఏడాది చివరికి చాలా వరకు ఉపశమనం దక్కబోతున్నట్లే. కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తుండగా.. వ్యాక్సిన్ కూడా వచ్చిందంటే కరోనా ముప్పు నుంచి క్రమంగా బయటపడబోతున్నట్లే. మరి రాబోయే రోజుల్లో ట్రెండ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on September 23, 2020 7:57 am
గత ఏడాది ప్రతిష్ఠాత్మకంగా గద్దర్ అవార్డులను మొదలుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఒకేసారి చాలా ఏళ్లకు కలిపి అవార్డులు ప్రకటించిన సంగతి…
దశాబ్దాల క్రితం హీరోలు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితమయ్యేవారు. టీవీ రంగమంటే అసలు అటువైపు చూసేవాళ్ళే కాదు. అమితాబ్ బచ్చన్…
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…