Illustrative picture of coronavirus vaccine under trail
ఆరు నెలలకు పైగా చూస్తున్నాం. ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కరోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ అది తప్పనే తేలుతోంది. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. 50 వేలు, 60 వేలు, 70 వేలు, 80 వేలు, 90 వేలు.. ఇలా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. కొన్ని రోజుల కిందట 95 వేల మార్కును దాటి రోజుకు లక్ష కేసుల మార్కు దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకుముందులా కరోనాకు జనం భయపడటం తగ్గించారు కానీ.. ఈ స్థాయిలో కేసులో పెరుగుతూ వెళ్లడం.. దీనికి బ్రేక్ ఎక్కడో తెలియకపోవడం ఆందోళన రేకెత్తించే విషయమే.
ఐతే ఎట్టకేలకు ఇండియాకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. కరోనా కేసుల తీవ్రత కొంచెం తగ్గింది. ఒక రోజు పెరగడం.. ఒకరోజు కొంచెం తగ్గడం కాకుండా వారం వ్యవధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. గత వారం రోజువారీ సగటు కేసుల సంఖ్య 90 వేలకు అటు ఇటుగా ఉండగా.. ఈ వారం అది 75 వేలకు తగ్గింది.
ఒకసారి ఇలా కొన్ని రోజుల సగటు కేసుల సంఖ్య తగ్గిందీ అంటే.. ఇక అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గుతూ వెళ్తాయని వరల్డ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే ఈ ఏడాది చివరికి చాలా వరకు ఉపశమనం దక్కబోతున్నట్లే. కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తుండగా.. వ్యాక్సిన్ కూడా వచ్చిందంటే కరోనా ముప్పు నుంచి క్రమంగా బయటపడబోతున్నట్లే. మరి రాబోయే రోజుల్లో ట్రెండ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on September 23, 2020 7:57 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…