Illustrative picture of coronavirus vaccine under trail
ఆరు నెలలకు పైగా చూస్తున్నాం. ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కరోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ అది తప్పనే తేలుతోంది. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. 50 వేలు, 60 వేలు, 70 వేలు, 80 వేలు, 90 వేలు.. ఇలా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. కొన్ని రోజుల కిందట 95 వేల మార్కును దాటి రోజుకు లక్ష కేసుల మార్కు దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకుముందులా కరోనాకు జనం భయపడటం తగ్గించారు కానీ.. ఈ స్థాయిలో కేసులో పెరుగుతూ వెళ్లడం.. దీనికి బ్రేక్ ఎక్కడో తెలియకపోవడం ఆందోళన రేకెత్తించే విషయమే.
ఐతే ఎట్టకేలకు ఇండియాకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. కరోనా కేసుల తీవ్రత కొంచెం తగ్గింది. ఒక రోజు పెరగడం.. ఒకరోజు కొంచెం తగ్గడం కాకుండా వారం వ్యవధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. గత వారం రోజువారీ సగటు కేసుల సంఖ్య 90 వేలకు అటు ఇటుగా ఉండగా.. ఈ వారం అది 75 వేలకు తగ్గింది.
ఒకసారి ఇలా కొన్ని రోజుల సగటు కేసుల సంఖ్య తగ్గిందీ అంటే.. ఇక అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గుతూ వెళ్తాయని వరల్డ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే ఈ ఏడాది చివరికి చాలా వరకు ఉపశమనం దక్కబోతున్నట్లే. కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తుండగా.. వ్యాక్సిన్ కూడా వచ్చిందంటే కరోనా ముప్పు నుంచి క్రమంగా బయటపడబోతున్నట్లే. మరి రాబోయే రోజుల్లో ట్రెండ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on September 23, 2020 7:57 am
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…