Illustrative picture of coronavirus vaccine under trail
ఆరు నెలలకు పైగా చూస్తున్నాం. ఇండియాలో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది తప్ప తగ్గట్లేదు. కరోనా వ్యాప్తిలో ఇదే పీక్స్ అనుకున్న ప్రతి సందర్భంలోనూ అది తప్పనే తేలుతోంది. జులై-ఆగస్టు నెలల్లోనే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుతుందని.. ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని ఒక దశలో అంచనా వేశారు.
కానీ అలాంటిదేమీ జరగలేదు. అంతకంతకూ కేసులు పెరుగుతూ వచ్చాయి తప్ప తగ్గలేదు. 50 వేలు, 60 వేలు, 70 వేలు, 80 వేలు, 90 వేలు.. ఇలా దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. కొన్ని రోజుల కిందట 95 వేల మార్కును దాటి రోజుకు లక్ష కేసుల మార్కు దిశగా అడుగులు పడ్డాయి. ఇంతకుముందులా కరోనాకు జనం భయపడటం తగ్గించారు కానీ.. ఈ స్థాయిలో కేసులో పెరుగుతూ వెళ్లడం.. దీనికి బ్రేక్ ఎక్కడో తెలియకపోవడం ఆందోళన రేకెత్తించే విషయమే.
ఐతే ఎట్టకేలకు ఇండియాకు కొంత ఉపశమనం కలిగించే పరిణామం చోటు చేసుకుంది. కరోనా కేసుల తీవ్రత కొంచెం తగ్గింది. ఒక రోజు పెరగడం.. ఒకరోజు కొంచెం తగ్గడం కాకుండా వారం వ్యవధిలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడం విశేషం. గత వారం రోజువారీ సగటు కేసుల సంఖ్య 90 వేలకు అటు ఇటుగా ఉండగా.. ఈ వారం అది 75 వేలకు తగ్గింది.
ఒకసారి ఇలా కొన్ని రోజుల సగటు కేసుల సంఖ్య తగ్గిందీ అంటే.. ఇక అక్కడి నుంచి క్రమంగా కేసులు తగ్గుతూ వెళ్తాయని వరల్డ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. అంచనాలకు తగ్గట్లు కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తే ఈ ఏడాది చివరికి చాలా వరకు ఉపశమనం దక్కబోతున్నట్లే. కేసుల సంఖ్య తగ్గుతూ వెళ్తుండగా.. వ్యాక్సిన్ కూడా వచ్చిందంటే కరోనా ముప్పు నుంచి క్రమంగా బయటపడబోతున్నట్లే. మరి రాబోయే రోజుల్లో ట్రెండ్స్ ఎలా ఉంటాయో చూడాలి.
This post was last modified on September 23, 2020 7:57 am
స్క్రీన్ మీద చూసే థ్రిల్లర్ ని మించిపోతోంది కేరళ 2 స్టోరీ వివాదం. ఇవాళ విడుదల కావాల్సిన ఈ సినిమాని…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి భారీ షాక్ తగిలింది.…
మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ వ్యక్తి హల్చల్ చేయడం కలకలం రేపింది. కార్యాలయ ఆవరణలోకి చొరబడిన అతడు…
ఢిల్లీ మద్యం కేసులోతనను నిరపరాధిగా స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రకటించడం పట్ల ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆయన…
టాలీవుడ్ సంక్రాంతి జ్వరంలో ఊగిపోతోంది. ఎంతగా అంటే ఇంకా ఏడాది సమయం ఉండగానే ఒక నిర్మాణ సంస్థ కథ, దర్శకుడు…
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలు కూటమి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల అత్యంత విశ్వసనీయత ప్రదర్శిస్తున్న విషయం…