Top Rated

ఫేస్ బుక్ లో ఆఖరి రోజు అంటూ ఆ ఉద్యోగి సందేశం ఇప్పుడు సంచలనం

తరచూ ఏదో ఒక చిక్కుల్ని ఎదుర్కొనే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు కొత్త తలనొప్పి షురూ అయినట్లే. ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు తాజాగా చేసిన ఆరోపణలు.. ఇప్పుడా సంస్థకు కొత్త ఇబ్బందులు తప్పేటట్లు లేవంటున్నారు.

ఫేస్ బుక్ ఉద్యోగిగా ఇదే తన చివరి రోజు అంటూ యువ ఇంజనీర్ ఒకరు చేసిన మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేయటంతోపాటు.. ఫేస్ బుక్ మీద విమర్శనాస్త్రాల్ని సంధించేందుకు బోలెడంత అవకాశాన్ని ఇస్తుండటం గమనార్హం.

ఇంతకూ ఆ ఉద్యోగి ఎవరు? అతడు చేసిన ఆరోపణలు ఏమిటన్నది చూస్తే.. సదరు ఉద్యోగి 28 ఏళ్ల యువ ఇంజనీర్ అశోక్ చంద్వానే. అతగాడి తాజా ఆరోపణ ఏమంటే.. ఫేస్ బుక్ సరైన మార్గంలో నడవటం లేదని.. ద్వేషం నుంచి సంస్థ లాభాల్ని పొందుతున్నట్లుగా అతడు పేర్కొన్నాడు.

సుమారు ఐదున్నరేళ్లుగా ఫేస్ బుక్ లో పని చేస్తున్న తనకు ఇదే ఆఖరి రోజుగా పేర్కొన్నాడు. అమెరికాలో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ద్వేష భావనతో లాభం పొందాలనుకునే సంస్థలో భాగస్వామి కావటం తనకు ఇష్టం లేదని.. అందుకే జాబ్ ను వదిలేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. ఈ విషయాల్ని అతడు.. ఫేస్ బుక్ వేదికగానే వెల్లడించటం గమనార్హం.

విద్వేష సమాచారం.. అసత్య సమాచారాన్ని నియంత్రించాలని పలువురు హక్కుల ఉద్యమకారులు.. సామాజిక కార్యకర్తలు కోరినా.. ఫేస్ బుక్ అందుకు తగ్గట్లు చర్యలు తీసుకోవటం లేదన్నాడు. సంస్థ తగిన చర్యలు తీసుకోవటంపై తన నిరసనను వ్యక్తం చేసిన అతడు.. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. తన మనసులోని మాటను చెప్పి సంచలనంగా మారాడు. ఇదిలా ఉంటే.. తమ సంస్థ విద్వేషం నుంచి ఎప్పుడు లాభం పొందలేదని ఫేస్ బుక్ ప్రతినిధి స్పష్టం చేస్తున్నారు.

This post was last modified on September 10, 2020 10:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టంగ్ స్లిప్ లతో టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న దీపక్ రెడ్డి

టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…

3 minutes ago

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

2 hours ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

2 hours ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

5 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

8 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

8 hours ago