మనకు చిన్న దెబ్బ తగిలితే విలవిలలాడిపోతాం. బాధను మాటల రూపంలో వ్యక్తం చేస్తాం. మనల్ని ఎవరైనా గాయపరిస్తే వాళ్లను అంత తేలిగ్గా వదిలిపెట్టం. మరి నోరు లేని మూగజీవాలను దెబ్బ తీస్తే వాటి బాధను అవి ఎలా చెప్పుకోవాలి. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కొందరు వాటి మీద ప్రతాపం చూపించేస్తుంటారు.
మూగజీవాలను హింసించడంలో శాడిస్టిక్ ఆనందం పొందుతుంటారు. కేవలం హింసించడమే కాదు.. వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పాపులర్ అవుదామని చూసేవాళ్లు కూడా ఉంటారు. అలాంటి శాడిస్టు కుర్రాళ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఒక కుక్క పిల్ల కాలు పట్టుకుని గాల్లో గిరగిరా తిప్పి విసిరి కొట్టి వినోదం పొందుతున్న శాడిస్టుల వీడియో అది. ఒకరికి ఇద్దరు ఇలా దిగ్భ్రాంతికర రీతిలో కుక్క పిల్లను హింసించారు. దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ వీడియో కూడా తీసుకున్నారు. అది సోషల్ మీడియాలోకి వచ్చింది. చూసిన వాళ్లందరికీ గుండె తరక్కుపోయేలా ఉన్న వీడియోను లక్షలాది మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ ఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అంటున్నారు.
లొకేషన్ గుర్తు పట్టి ఇలా చేసింది ఎవరో తెలుసుకుని వారికి శిక్ష పడేలా చూడాలని.. ఇలాంటి వారికి బుద్ధి చెప్పకపోతే ఈ తరహా ఉదంతాలు కొనసాగుతాయని నెటిజన్లు అంటున్నారు. ఆ మధ్య చెన్నైలో ఒక వ్యక్తి.. కోతిని మేడ మీది నుంచి విసిరేస్తూ వినోదం చూసిన వీడియో సైతం ఇలాగే వైరల్ అయింది. ఆ వ్యక్తిని గుర్తించిన మూగజీవాల సంరక్షకులు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…