మెగా ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఇది..!

మెగా ఫ్యాన్స్‌కి మాంచి కిక్కిచ్చే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఇందులో కీల‌క పాత్ర పోషించ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టించారు. రెజీనా కాసాండ్రా ఇందులో స్పెష‌ల్ సాంగ్ చేసింది.

కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ల‌పై రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. గ‌త ఏడాది మే నెల‌లోనే ఈ సినిమా విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఎట్ట‌కేల‌కు ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ఇటీవ‌లె అధికారికంగా ప్ర‌క‌టించారు.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. మెగా మల్టీస్టారర్‌గా రాబోతున్న ఆచార్య తెలుగులో మాత్ర‌మే కాదు హిందీలోనూ రిలీజ్ కాబోతోంది. అవును, ఈ సినిమా హిందీ వ‌ర్ష‌న్‌ను పెన్‌ స్టూడియోస్ వారు విడుద‌ల చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స‌ద‌రు సంస్థ అధికారంగా తెలియ‌జేసింది. ఈ మేర‌కు ఓ పోస్ట‌ర్‌ను కూడా వ‌ద‌ల‌గా.. మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

కాగా, దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యానికి నక్సలిజాన్ని జోడించి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్‌లు నక్సలైట్లుగా క‌నిపించ‌బోతున్నారు. అలాగే మణిశర్మ అందించే సంగీతం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలవ‌బోతోంది.