సంపద సృష్టి. ఈ మాట ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు జోరుగా వినిపించింది. “సూపర్ సిక్స్ అమలు చేస్తాం అంటే.. కొంతమంది .. ఎలా అమలు చేస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ మళ్లీ చెబుతున్నాం.. అమలు చేస్తాం. సంపదసృష్టిస్తాం.. ఆ సంపదను అందరికీ పంచుతాం. అప్పుడు అన్నీ అమలవుతాయి..” ఇదీ.. ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు చెప్పిన మాట. దీంతో సంపద సృష్టిపై తరచుగా కూటమి సర్కారుకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి.
అయితే.. ఇప్పుడు ఈ సంపద సృష్టిలో తొలి అడుగు పడినట్టేనా? అంటే.. టీడీపీ నాయకులు ఔననే అంటున్నారు. దీనికి కారణం.. తాజాగా సోమవారం నుంచి నూతన మద్యం విధానం అందుబాటులోకి రానుంది. ఈ విధానంతో సర్కారుకు కాసుల వర్షం కురియనుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికే 3,396 మద్యం షాపుల కోసం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దీని ద్వారా దరఖాస్తు రుసుముల రూపంలో ఆదాయం 1,798 కోట్ల రూపాయలు సమకూరింది.
సగటున ఒక్కో దుకాణానికి 26 మంది పోటీ పడ్డారు. ఈ నెల 16 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభం కానున్నా యి. అయితే.. కథ ఇక్కడితో అయిపోలేదు. సోమవారం నిర్వహించే లాటరీలో అవకాశం దక్కించుకున్న వ్యాపారులు.. అప్పటికప్పుడు ఆయా ప్రాంతాల వారీగా వ్యాపార లైసెన్సుకు సంబంధించి కోట్ల రూపాయ లను ప్రభుత్వానికి చెల్లించాలి. అంటే.. ఉదాహరణకు ఏదైనా కాలేజీలో చేరాలని అనుకుంటే ముందు దరఖాస్తు కొని అప్లయి చేస్తాం. తర్వాత.. సీటు వస్తే..కోర్సుకు ఫీజు చెల్లించినట్టుగా ఇప్పుడు వ్యాపారులు చెల్లించాలి.
ఈ ధరలు.. ప్రాంతం, జిల్లా, జనాభా, మద్యం వినియోగం లెక్కలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు విశాఖపట్నం వంటి నగరాల్లో 20 వేల మందికి ఒక బార్ ఉంటే.. 10వేల మందికి ఒక వైన్ షాపు ఉంటుంది. ఇక్కడ మద్యం అమ్మకాలు కూడా ఎక్కువగానేఉంటాయి. కాబట్టి.. లైసెన్సు ఫీజు కింద.. ప్రభుత్వానికి 2 నుంచి 5 కోట్ల రూపాయల వరకు చెల్లించాలి. ఇక, విజయవాడ, అనంతపురం, గుంటూరు, రాజమండ్రి వంటి సిటీల్లో మాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు కాబట్టి.. అక్కడ మరో రెండు కోట్లు ఎక్కువగా చెల్లించాలి. ఇలా.. మొత్తంగా ఇలా.. 3,396 దుకాణాలు కోట్ల రూపాయల్లోనే చెల్లించాలి. సుమారు 3 వేల కోట్ల రూపాయల వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. సో.. ఇదంతా సంపద సృష్టేనని తమ్ముళ్లు ప్రచారం చేస్తున్నారు.
This post was last modified on October 15, 2024 3:18 pm
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…