వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. ‘అన్న’ అనే పదానికి జగన్ కళంకమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అసలు.. వివేకా హత్య జరిగిందే ఎంపీ సీటు కోసమని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు ఎంపీ సీటును అవినాష్కు ఇవ్వడాన్ని వివేకా అడ్డుకున్నారని.. అవినాష్ లాంటి వారికి ఈ సీటు ఇవ్వద్దని చెప్పారని అన్నారు.
అయితే.. జగన్ వివేకా మాట వినకుండా అవినాష్రెడ్డికే ఈ సీటును ఇచ్చారన్న షర్మిల.. ఇక, తనకు ఎంపీ సీటు ఇవ్వద్దన్న వివేకాపై అవినాష్ కక్ష పెంచుకున్నారని తెలిపారు. వివేకా బతికి ఉంటే ఎప్పటికైనా తనకు రాజకీయంగా అడ్డేనని అవినాష్ భావించినట్టు చెప్పారు. ఇక, వివేకా గుండె పోటు కథంతా జగన్ సొంత మీడియా సృష్టేనని షర్మిల ఆరోపించారు. కానీ.. ఇప్పుడు ఇదంతా సునీతే చేయించారని అవినాష్ రెడ్డి చెబుతుండడం దారుణమని తప్పుబట్టారు. చివరకు సొంత తండ్రిని సునీతే చంపుకున్నారన్న విధంగా అవినాషే చిత్రీకరించారని ఆరోపించారు.
“ఎంపీ సీటుకు అవినాష్ సరికాదమ్మా.. అని వివేకా నాకు స్వయంగా చెప్పారు.” అని షర్మిల తెలిపారు. ఈ కేసులో మొదట్లో సీబీఐ విచారణ కోరింది జగనేనని తెలిపారు. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐని కాదని సొంత పోలీసులను నియమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సునీత ఎన్నిసార్లు బ్రతిమాలినా.. జగన్ పట్టించుకోలేదన్నారు. కనీసం సీబీఐ విచారణకు ఆదేశించాలన్న విన్నపాన్ని కూడా వదిలేశారన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతోనే సీబీఐ విచారణ జరిగిందని షర్మిల చెప్పారు.
అవినాష్ చెప్పినట్టుగా వివేకాకు శత్రువులు ఎవరూ లేరని షర్మిల తెలిపారు. ఒక వేళ శత్రువులే ఉండి ఉంటే.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎందుకు పట్టుకోలేక పోయారని ఆమె ప్రశ్నించారు. కనీసం ఈ హత్య కేసును విచారించి ఒక కొలిక్కి తీసుకురావాలన్న స్పృహ కూడా జగన్కు లేకుండా పోయిందని.. చెల్లెలు అడిగిందన్న కనీస జాలి దయ కూడా చూపించలేక పోయారని విమర్శించారు. “శత్రువులు ఇంతకన్నా ఎవరూ ఉండరు. ఇలాంటి ‘అన్న’ ఉంటే శత్రువులు అవసరం లేదు.” అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా.. ఈ కేసు కొలిక్కి రావాలని.. హంతకులు జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…