Political News

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. ‘అన్న‌’ అనే ప‌దానికి జ‌గ‌న్ కళంక‌మ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త‌న బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తాజాగా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. అస‌లు.. వివేకా హ‌త్య జ‌రిగిందే ఎంపీ సీటు కోస‌మ‌ని తెలిపారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎంపీ సీటును అవినాష్‌కు ఇవ్వ‌డాన్ని వివేకా అడ్డుకున్నార‌ని.. అవినాష్ లాంటి వారికి ఈ సీటు ఇవ్వ‌ద్ద‌ని చెప్పార‌ని అన్నారు.

అయితే.. జ‌గ‌న్ వివేకా మాట విన‌కుండా అవినాష్‌రెడ్డికే ఈ సీటును ఇచ్చార‌న్న ష‌ర్మిల‌.. ఇక‌, తన‌కు ఎంపీ సీటు ఇవ్వ‌ద్ద‌న్న వివేకాపై అవినాష్ క‌క్ష పెంచుకున్నార‌ని తెలిపారు. వివేకా బ‌తికి ఉంటే ఎప్ప‌టికైనా త‌న‌కు రాజ‌కీయంగా అడ్డేన‌ని అవినాష్‌ భావించిన‌ట్టు చెప్పారు. ఇక‌, వివేకా గుండె పోటు క‌థంతా జ‌గ‌న్ సొంత మీడియా సృష్టేన‌ని ష‌ర్మిల ఆరోపించారు. కానీ.. ఇప్పుడు ఇదంతా సునీతే చేయించార‌ని అవినాష్ రెడ్డి చెబుతుండ‌డం దారుణ‌మని త‌ప్పుబ‌ట్టారు. చివ‌ర‌కు సొంత తండ్రిని సునీతే చంపుకున్నార‌న్న విధంగా అవినాషే చిత్రీక‌రించార‌ని ఆరోపించారు.

“ఎంపీ సీటుకు అవినాష్ స‌రికాద‌మ్మా.. అని వివేకా నాకు స్వ‌యంగా చెప్పారు.” అని ష‌ర్మిల తెలిపారు. ఈ కేసులో మొద‌ట్లో సీబీఐ విచార‌ణ కోరింది జ‌గ‌నేన‌ని తెలిపారు. కానీ, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీబీఐని కాద‌ని సొంత పోలీసుల‌ను నియ‌మించుకున్నార‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో సునీత ఎన్నిసార్లు బ్ర‌తిమాలినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌న్న విన్న‌పాన్ని కూడా వ‌దిలేశార‌న్నారు. ప్ర‌స్తుతం కోర్టు ఆదేశాల‌తోనే సీబీఐ విచార‌ణ జ‌రిగింద‌ని ష‌ర్మిల చెప్పారు.

అవినాష్ చెప్పిన‌ట్టుగా వివేకాకు శ‌త్రువులు ఎవ‌రూ లేర‌ని ష‌ర్మిల తెలిపారు. ఒక వేళ శ‌త్రువులే ఉండి ఉంటే.. ఐదేళ్ల వైసీపీ పాల‌నలో ఎందుకు ప‌ట్టుకోలేక పోయార‌ని ఆమె ప్ర‌శ్నించారు. క‌నీసం ఈ హ‌త్య కేసును విచారించి ఒక కొలిక్కి తీసుకురావాల‌న్న స్పృహ కూడా జ‌గ‌న్‌కు లేకుండా పోయింద‌ని.. చెల్లెలు అడిగింద‌న్న క‌నీస జాలి ద‌య కూడా చూపించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. “శ‌త్రువులు ఇంత‌క‌న్నా ఎవ‌రూ ఉండ‌రు. ఇలాంటి ‘అన్న‌’ ఉంటే శ‌త్రువులు అవ‌స‌రం లేదు.” అని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా.. ఈ కేసు కొలిక్కి రావాల‌ని.. హంత‌కులు జైలుకు వెళ్లాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

This post was last modified on March 18, 2026 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

6 minutes ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

9 minutes ago

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా…

19 minutes ago

ఆ సంస్థకు చుక్కలు చూపిస్తున్న 2026

కేవీఎన్ ప్రొడక్షన్స్.. కర్ణాటకకు చెందిన నిర్మాణ సంస్థ. దీని అధినేత పేరు నారాయణ. ఐదేళ్ల ముందు ‘సాకత్’ అనే మిడ్…

44 minutes ago

ప్రొడ్యూసర్ల కోసం పవన్ త్యాగం

రెమ్యునేషన్లు పూర్తిగా చేతికి అందకుంటే డబ్బింగ్ చెప్పకుండా ఇబ్బంది పెట్టే స్టార్ హీరోలు ఇండస్ట్రీలో లేకపోలేదు. అందుకే బిజినెస్ జరిగినా…

1 hour ago

మా సీఎం స్టాలినే.. త‌మిళ‌నాట ‘ఏపీ పాలిటిక్స్’ రిపీట్‌!

ఏపీకి పొరుగునే ఉన్న త‌మిళ‌నాడులో ఇప్పుడు ఇదే త‌ర‌హా రాజ‌కీయాలు కూడా క‌నిపిస్తున్నాయి. పార్టీలు లెక్క‌కు మిక్కిలిగా ఉన్నా.. నాయ‌కులు…

1 hour ago