Political News

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. ‘అన్న‌’ అనే ప‌దానికి జ‌గ‌న్ కళంక‌మ‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త‌న బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో తాజాగా క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావించారు. అస‌లు.. వివేకా హ‌త్య జ‌రిగిందే ఎంపీ సీటు కోస‌మ‌ని తెలిపారు. 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఎంపీ సీటును అవినాష్‌కు ఇవ్వ‌డాన్ని వివేకా అడ్డుకున్నార‌ని.. అవినాష్ లాంటి వారికి ఈ సీటు ఇవ్వ‌ద్ద‌ని చెప్పార‌ని అన్నారు.

అయితే.. జ‌గ‌న్ వివేకా మాట విన‌కుండా అవినాష్‌రెడ్డికే ఈ సీటును ఇచ్చార‌న్న ష‌ర్మిల‌.. ఇక‌, తన‌కు ఎంపీ సీటు ఇవ్వ‌ద్ద‌న్న వివేకాపై అవినాష్ క‌క్ష పెంచుకున్నార‌ని తెలిపారు. వివేకా బ‌తికి ఉంటే ఎప్ప‌టికైనా త‌న‌కు రాజ‌కీయంగా అడ్డేన‌ని అవినాష్‌ భావించిన‌ట్టు చెప్పారు. ఇక‌, వివేకా గుండె పోటు క‌థంతా జ‌గ‌న్ సొంత మీడియా సృష్టేన‌ని ష‌ర్మిల ఆరోపించారు. కానీ.. ఇప్పుడు ఇదంతా సునీతే చేయించార‌ని అవినాష్ రెడ్డి చెబుతుండ‌డం దారుణ‌మని త‌ప్పుబ‌ట్టారు. చివ‌ర‌కు సొంత తండ్రిని సునీతే చంపుకున్నార‌న్న విధంగా అవినాషే చిత్రీక‌రించార‌ని ఆరోపించారు.

“ఎంపీ సీటుకు అవినాష్ స‌రికాద‌మ్మా.. అని వివేకా నాకు స్వ‌యంగా చెప్పారు.” అని ష‌ర్మిల తెలిపారు. ఈ కేసులో మొద‌ట్లో సీబీఐ విచార‌ణ కోరింది జ‌గ‌నేన‌ని తెలిపారు. కానీ, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత సీబీఐని కాద‌ని సొంత పోలీసుల‌ను నియ‌మించుకున్నార‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో సునీత ఎన్నిసార్లు బ్ర‌తిమాలినా.. జ‌గ‌న్ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించాల‌న్న విన్న‌పాన్ని కూడా వ‌దిలేశార‌న్నారు. ప్ర‌స్తుతం కోర్టు ఆదేశాల‌తోనే సీబీఐ విచార‌ణ జ‌రిగింద‌ని ష‌ర్మిల చెప్పారు.

అవినాష్ చెప్పిన‌ట్టుగా వివేకాకు శ‌త్రువులు ఎవ‌రూ లేర‌ని ష‌ర్మిల తెలిపారు. ఒక వేళ శ‌త్రువులే ఉండి ఉంటే.. ఐదేళ్ల వైసీపీ పాల‌నలో ఎందుకు ప‌ట్టుకోలేక పోయార‌ని ఆమె ప్ర‌శ్నించారు. క‌నీసం ఈ హ‌త్య కేసును విచారించి ఒక కొలిక్కి తీసుకురావాల‌న్న స్పృహ కూడా జ‌గ‌న్‌కు లేకుండా పోయింద‌ని.. చెల్లెలు అడిగింద‌న్న క‌నీస జాలి ద‌య కూడా చూపించ‌లేక పోయార‌ని విమ‌ర్శించారు. “శ‌త్రువులు ఇంత‌క‌న్నా ఎవ‌రూ ఉండ‌రు. ఇలాంటి ‘అన్న‌’ ఉంటే శ‌త్రువులు అవ‌స‌రం లేదు.” అని వ్యాఖ్యానించారు. ఇప్ప‌టికైనా.. ఈ కేసు కొలిక్కి రావాల‌ని.. హంత‌కులు జైలుకు వెళ్లాల‌ని కోరుకుంటున్న‌ట్టు చెప్పారు.

This post was last modified on March 18, 2026 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వీరభద్రుడు చాలా మాస్ ఉన్నాడు

సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…

18 minutes ago

విజ‌య్ అలా… ఉద‌య‌నిధి ఇలా

త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాక కొన్ని రోజుల పాటు న‌డిచిన డ్రామాకు ఆదివారం తెర‌ప‌డి, ఆదివారం నాడు త‌మిళ…

34 minutes ago

నంబర్ వన్ కమెడియన్లు ఒక్కటయ్యారు

తెలుగులో ఒకప్పట్లా ఇబ్బడిముబ్బడిగా కమెడియన్లు లేరిప్పుడు. ఉన్న వాళ్లలో కూడా నిలకడగా నవ్వించేవాళ్లు తక్కువ. కొంచెం లేటుగా ఊపందుకుని.. వెన్నెల…

2 hours ago

బండి వివాదంపై తగ్గేదేలే అంటున్న బీఆర్ఎస్

కేంద్ర మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, కేసు…

3 hours ago

త్రిష చేతిలో బంపర్ ఆఫర్?

మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 40 ప్లస్ వయసులోనూ ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా, పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న…

4 hours ago

మాజీ సీఎం ఇంటికి కొత్త సీఎం… వాహ్!

తమిళనాట కొత్త రాజకీయానికి తెర తీసిన స్టార్ హీరో దళపతి విజయ్… ప్రతి అడుగులోనూ తనదైన శైలి ప్రత్యేకతను చాటుతున్నారు.…

4 hours ago