వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. ‘అన్న’ అనే పదానికి జగన్ కళంకమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. అసలు.. వివేకా హత్య జరిగిందే ఎంపీ సీటు కోసమని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు ఎంపీ సీటును అవినాష్కు ఇవ్వడాన్ని వివేకా అడ్డుకున్నారని.. అవినాష్ లాంటి వారికి ఈ సీటు ఇవ్వద్దని చెప్పారని అన్నారు.
అయితే.. జగన్ వివేకా మాట వినకుండా అవినాష్రెడ్డికే ఈ సీటును ఇచ్చారన్న షర్మిల.. ఇక, తనకు ఎంపీ సీటు ఇవ్వద్దన్న వివేకాపై అవినాష్ కక్ష పెంచుకున్నారని తెలిపారు. వివేకా బతికి ఉంటే ఎప్పటికైనా తనకు రాజకీయంగా అడ్డేనని అవినాష్ భావించినట్టు చెప్పారు. ఇక, వివేకా గుండె పోటు కథంతా జగన్ సొంత మీడియా సృష్టేనని షర్మిల ఆరోపించారు. కానీ.. ఇప్పుడు ఇదంతా సునీతే చేయించారని అవినాష్ రెడ్డి చెబుతుండడం దారుణమని తప్పుబట్టారు. చివరకు సొంత తండ్రిని సునీతే చంపుకున్నారన్న విధంగా అవినాషే చిత్రీకరించారని ఆరోపించారు.
“ఎంపీ సీటుకు అవినాష్ సరికాదమ్మా.. అని వివేకా నాకు స్వయంగా చెప్పారు.” అని షర్మిల తెలిపారు. ఈ కేసులో మొదట్లో సీబీఐ విచారణ కోరింది జగనేనని తెలిపారు. కానీ, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐని కాదని సొంత పోలీసులను నియమించుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో సునీత ఎన్నిసార్లు బ్రతిమాలినా.. జగన్ పట్టించుకోలేదన్నారు. కనీసం సీబీఐ విచారణకు ఆదేశించాలన్న విన్నపాన్ని కూడా వదిలేశారన్నారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలతోనే సీబీఐ విచారణ జరిగిందని షర్మిల చెప్పారు.
అవినాష్ చెప్పినట్టుగా వివేకాకు శత్రువులు ఎవరూ లేరని షర్మిల తెలిపారు. ఒక వేళ శత్రువులే ఉండి ఉంటే.. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎందుకు పట్టుకోలేక పోయారని ఆమె ప్రశ్నించారు. కనీసం ఈ హత్య కేసును విచారించి ఒక కొలిక్కి తీసుకురావాలన్న స్పృహ కూడా జగన్కు లేకుండా పోయిందని.. చెల్లెలు అడిగిందన్న కనీస జాలి దయ కూడా చూపించలేక పోయారని విమర్శించారు. “శత్రువులు ఇంతకన్నా ఎవరూ ఉండరు. ఇలాంటి ‘అన్న’ ఉంటే శత్రువులు అవసరం లేదు.” అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా.. ఈ కేసు కొలిక్కి రావాలని.. హంతకులు జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
This post was last modified on March 18, 2026 6:15 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…