Political News

లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీ.. టీడీపీలో క‌ల‌వ‌రం!

మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని ఓ పాఠ‌శాల‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఈ విష‌యాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. మీడియా స‌హా.. అధికారుల‌కు కూడా చెప్ప‌కుండానే ఎలాంటి కాన్వాయ్ కూడా రాకుండానే.. కేవ‌లం రెండు కార్ల‌తో స‌ద‌రు పాఠ‌శాల‌ను విజిట్ చేశారు. మ‌ధ్యాహ్న భోజ‌నాన్ని స్వ‌యంగా రుచి చూశారు. కొన్నాళ్ల కింద‌ట ఇదే పాఠ‌శాల‌లో విద్యార్థులు మ‌ధ్యాహ్న భోజ‌నం బాగోలేద‌ని.. ఆరోపిస్తూ.. డ‌స్ట్‌బిన్‌ల‌లో వాటిని వేసేశారు.

ఈ దృశ్యాల‌ను స్వ‌యంగా ప్ర‌ధానోపాధ్యాయుడు జానీ వీడియోలు తీసి సోష‌ల్ మీడియాలో పెట్టారు. దీంతో వివాదం పెరిగి.. స‌ర్కారుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలో మంత్రి లోకేష్ ఆక‌స్మిక తనిఖీ చేసి.. మ‌ధ్యాహ్న భోజ‌నం రుచి చూశారు. విద్యార్థుల‌తోనూ ముచ్చ‌టించి వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. అయితే.. ఇది ఆ పాఠ‌శాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేత‌ల‌కు సెగ పెంచేసింది. త‌ర‌చుగా మంత్రి లోకేష్‌.. మీమీ నియోజ‌క‌ర్గాల్లో ప‌ర్య‌టించి.. పాఠ‌శాల‌ల ప‌నితీరును ప‌రిశీలించాల‌ని చెబుతున్నారు.

కానీ, కొంద‌రు మాత్ర‌మే ప‌ర్య‌టిస్తున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఉదాశీనంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎప్పుడూ ఉండేదే క‌దా! అని లైట్ తీసుకుంటున్నారు. ఇదొక్క‌టే కాదు.. ప్ర‌జాద‌ర్బార్‌లు నిర్వ‌హించాలని చెబుతున్నా.. అలానే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌, అంత‌ర్గ‌త క‌ల‌హాల‌కు అనేక నియోజ‌క‌వ‌ర్గాలు ఆల‌వాలంగా మారాయి. వీటిని ఎప్ప‌టిక‌ప్పుడు లోకేష్ ఖండిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు లైట్ తీసుకుంటు న్నారు. తాజాగా ఎవ‌రికీ చెప్ప‌కుండానే.. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న పాఠ‌శాల‌కు లోకేష్ రావ‌డంతో నాయ‌కులు ఉలిక్కిప‌డ్డారు.

త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇలాంటి ఆక‌స్మిక త‌నిఖీలు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని భావించిన నాయ‌కులు బుధ‌వారం తెల‌తెల‌వారుతూనే.. పాఠ‌శాలల బాట ప‌ట్టారు. ప్రార్థ‌నా గీతం నుంచి వారు పాఠ‌వాల‌ను ప‌ర్య‌వేక్షించారు. విద్యార్థుల హాజ‌రును తెలుసుకున్నారు. వంట‌కు వినియోగించే ప‌దార్థాల‌ను ప‌రిశీలిం చారు. అయితే.. ఇది కూడా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ కాదు. కొన్నింటికే ప‌రిమితం అయ్యారు. మొత్తంగా నారా లోకేష్ ఆక‌స్మిక త‌నిఖీలు పార్టీలో క‌ల‌వరం రేపాయి. ప్ర‌స్తుతానికి లోకేష్ ఎవ‌రిపైనా సీరియ‌స్ కాక‌పోయినా.. ముంద‌స్తుగా నాయ‌కులు అలెర్టు కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 18, 2026 5:58 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

5 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago