Political News

జ‌మిలికి జై:  చంద్ర‌బాబు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నిక‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వం.. తీసుకువ‌స్తున్న వ‌న్ నేష‌న్‌- వ‌న్ ఎల‌క్ష‌న్‌కు తాము అనుకూల‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి రాష్ట్రంలో ప్ర‌తి ఏటా వ‌స్తున్న ఎన్నిక‌ల కార‌ణంగా అభివృద్ధి ప‌నుల‌కు విఘాతం క‌లుగుతోంద‌ని చెప్పారు. దీనివ‌ల్ల రాష్ట్రాల జీడీపీ స‌హా దేశ జీడీపీ కూడా ఇబ్బందిగా మారింద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఒకేసారి దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని చెప్పారు.

అంతేకాదు.. గ‌తంలో వాజ‌పేయి హ‌యాంలోనూ ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్పుడు తొలిసారి తామే అనుకూలంగా సిగ్న‌ల్స్ ఇచ్చామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రాలు ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒకే సారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కార‌ణంగా.. దేశ ఖ‌జానాకు కూడా మేలు జ‌రుగుతుంద‌ని, ఎన్నిక‌ల సంఘంపైనా భారం త‌గ్గుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ పార్ల‌మెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీల‌కు  ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. అన్ని రాష్ట్రాలు ఒకే స‌మ‌యంలో అభివృద్ది బాట‌ప‌ట్టేందుకు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌మ విజ‌న్ ఇదేన‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంలో రాష్ట్రాల‌న్నీ క‌లిసి కూర్చుని ఆలోచించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. రాష్ట్రాల సంయుక్త స‌మావేశానికి అవ‌స‌రం అయితే.. తానే నేతృత్వం వ‌హిస్తాన‌న్నారు. తాజాగా జ‌రిగిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్‌పైనా చ‌ర్చజ‌రిగిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యాన్ని ద‌ర్శించారు. మూలా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా అమ్మ‌వారు సరస్వ‌తీ రూపంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌బుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు కేంద్రం స‌హ‌కరిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లూ భంగ‌ప‌డ్డాయ‌ని.. ఇప్పుడు వాటిని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. మ‌రోవైపు 100 రోజుల పాల‌న‌పై వైసీపీ యాగీ చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర‌ద సాయం అంద‌రికీ అందిస్తున్నామ‌ని.. ప్ర‌తిరూపాయికీ లెక్క ఉంద‌ని, వైసీపీ మాదిరిగా దొంగ లెక్క‌లు చెప్పాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on October 10, 2024 12:27 am

Share

Recent Posts

ఎన్డీయే క‌న్వీన‌ర్‌గా చంద్ర‌బాబు… ఛాన్స్ ఖాయ‌మేనా?

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూట‌మిని బ‌లోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మ‌రింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మ‌క అడుగులు…

1 hour ago

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

2 hours ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

6 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

7 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

8 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

8 hours ago