Political News

జ‌మిలికి జై:  చంద్ర‌బాబు

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌స్తున్న జ‌మిలి ఎన్నిక‌ల‌కు ఏపీ సీఎం చంద్ర‌బాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నిక‌ల‌ను స్వాగ‌తిస్తున్న‌ట్టు చెప్పారు. తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వం.. తీసుకువ‌స్తున్న వ‌న్ నేష‌న్‌- వ‌న్ ఎల‌క్ష‌న్‌కు తాము అనుకూల‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌తి రాష్ట్రంలో ప్ర‌తి ఏటా వ‌స్తున్న ఎన్నిక‌ల కార‌ణంగా అభివృద్ధి ప‌నుల‌కు విఘాతం క‌లుగుతోంద‌ని చెప్పారు. దీనివ‌ల్ల రాష్ట్రాల జీడీపీ స‌హా దేశ జీడీపీ కూడా ఇబ్బందిగా మారింద‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఒకేసారి దేశ‌వ్యాప్తంగా ఎన్నిక‌లు జ‌ర‌గాల‌న్న‌దే త‌న అభిమ‌త‌మ‌ని చెప్పారు.

అంతేకాదు.. గ‌తంలో వాజ‌పేయి హ‌యాంలోనూ ఈ ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్పుడు తొలిసారి తామే అనుకూలంగా సిగ్న‌ల్స్ ఇచ్చామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. ఇప్పుడు రాష్ట్రాలు ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఒకే సారి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ కార‌ణంగా.. దేశ ఖ‌జానాకు కూడా మేలు జ‌రుగుతుంద‌ని, ఎన్నిక‌ల సంఘంపైనా భారం త‌గ్గుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. దేశ పార్ల‌మెంటుకు, రాష్ట్రాల అసెంబ్లీల‌కు  ఒకే విడ‌త‌లో ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే.. అన్ని రాష్ట్రాలు ఒకే స‌మ‌యంలో అభివృద్ది బాట‌ప‌ట్టేందుకు వీలు క‌లుగుతుంద‌ని పేర్కొన్నారు. ఈ విష‌యంలో త‌మ విజ‌న్ ఇదేన‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంలో రాష్ట్రాల‌న్నీ క‌లిసి కూర్చుని ఆలోచించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. రాష్ట్రాల సంయుక్త స‌మావేశానికి అవ‌స‌రం అయితే.. తానే నేతృత్వం వ‌హిస్తాన‌న్నారు. తాజాగా జ‌రిగిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో వ‌న్ నేష‌న్ – వ‌న్ ఎల‌క్ష‌న్‌పైనా చ‌ర్చజ‌రిగిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పారు. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ దుర్గ‌మ్మ ఆల‌యాన్ని ద‌ర్శించారు. మూలా న‌క్ష‌త్రం సంద‌ర్భంగా అమ్మ‌వారు సరస్వ‌తీ రూపంలో భ‌క్తుల‌కు ద‌ర్శ‌న మిచ్చారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌బుత్వం త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రంలో అభివృద్ధిని ప‌రుగులు పెట్టించేందుకు కేంద్రం స‌హ‌కరిస్తుంద‌ని ఆయ‌న చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో అన్ని వ్య‌వ‌స్థ‌లూ భంగ‌ప‌డ్డాయ‌ని.. ఇప్పుడు వాటిని గాడిలో పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని.. దీనికి కొంత స‌మ‌యం ప‌డుతుంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. మ‌రోవైపు 100 రోజుల పాల‌న‌పై వైసీపీ యాగీ చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌ర‌ద సాయం అంద‌రికీ అందిస్తున్నామ‌ని.. ప్ర‌తిరూపాయికీ లెక్క ఉంద‌ని, వైసీపీ మాదిరిగా దొంగ లెక్క‌లు చెప్పాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేద‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. 

This post was last modified on October 10, 2024 12:27 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

6 minutes ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

34 minutes ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

1 hour ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

2 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

2 hours ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

5 hours ago