టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. ఆయన మంగళవారం బెంగళూరులో టాటా సన్స్ చైర్మన్ ఎం చంద్రశేఖరన్తో భేటీ అయిన తర్వాత.. బుధవారం తీపి కబురు చెబుతానంటూ ట్వీట్ చేశారు. అన్నట్టుగానే బుధవారం నారా లోకేష్ సంచలన విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్)ను ఒప్పించినట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలో విశాఖలో టీసీ ఎస్ను ఏర్పాటు చేసేందుకు టాటా ముందుకు వచ్చినట్టు చెప్పారు.
ఈ టీసీఎస్తో 10 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నారా లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గతాన్ని మననం చేసుకున్నారు. తాను నిర్వహించిన యువగళం పాదయాత్రలో అనేక మంది చదువుకున్న యువత తమ బాధలు వెల్లడించారని పేర్కొన్నారు. ఉన్నత చదువు చదివి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని.. దీంతో కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని, ఇక్కడికే కంపెనీలను తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని వారు కోరినట్టు తెలిపారు.
ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే.. తప్పకుండా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తామని తాను మాటిచ్చిన ట్టు తెలిపారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం.. తాజాగా సీటీఎస్ కంపెనీని ఒప్పించానని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇదిలావుంటే, మంగళవా రం నాటి భేటీలో ఏపీలో టీసీఎస్ ఏర్పాటు చేస్తే.. కల్పించే సౌకర్యాలను నారా లోకేష్ వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో కంపెనీని ఏర్పాటు చేసేందుకు సీటీఎస్ ముందుకు వచ్చింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ), ఎయిరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో కూడా టాటా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది.
This post was last modified on October 10, 2024 12:19 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…