టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ చేసిన కృషి ఫలించింది. ఆయన మంగళవారం బెంగళూరులో టాటా సన్స్ చైర్మన్ ఎం చంద్రశేఖరన్తో భేటీ అయిన తర్వాత.. బుధవారం తీపి కబురు చెబుతానంటూ ట్వీట్ చేశారు. అన్నట్టుగానే బుధవారం నారా లోకేష్ సంచలన విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా కన్సల్టెన్సీ సర్వీస్(టీసీఎస్)ను ఒప్పించినట్టు ఆయన తెలిపారు. ఈ క్రమంలో విశాఖలో టీసీ ఎస్ను ఏర్పాటు చేసేందుకు టాటా ముందుకు వచ్చినట్టు చెప్పారు.
ఈ టీసీఎస్తో 10 వేల ఐటీ ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని నారా లోకేష్ పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా నారా లోకేష్ గతాన్ని మననం చేసుకున్నారు. తాను నిర్వహించిన యువగళం పాదయాత్రలో అనేక మంది చదువుకున్న యువత తమ బాధలు వెల్లడించారని పేర్కొన్నారు. ఉన్నత చదువు చదివి పొరుగు రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని.. దీంతో కుటుంబాలకు దూరంగా ఉంటున్నామని, ఇక్కడికే కంపెనీలను తీసుకువచ్చే ఏర్పాటు చేయాలని వారు కోరినట్టు తెలిపారు.
ఆ సమయంలో తాము అధికారంలోకి వస్తే.. తప్పకుండా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తామని తాను మాటిచ్చిన ట్టు తెలిపారు. ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం.. తాజాగా సీటీఎస్ కంపెనీని ఒప్పించానని తెలిపారు. త్వరలోనే మరిన్ని ప్రఖ్యాత ఐటీ కంపెనీలు రప్పించి లక్షలాది మందికి స్థానికంగా ఉపాధి కల్పిస్తామని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇదిలావుంటే, మంగళవా రం నాటి భేటీలో ఏపీలో టీసీఎస్ ఏర్పాటు చేస్తే.. కల్పించే సౌకర్యాలను నారా లోకేష్ వివరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో కంపెనీని ఏర్పాటు చేసేందుకు సీటీఎస్ ముందుకు వచ్చింది. అదేవిధంగా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ), ఎయిరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో కూడా టాటా గ్రూప్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది.
This post was last modified on October 10, 2024 12:19 am
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న జమిలి ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు జై కొట్టారు. తాము ఈ ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం మాట్లాడితే.. రెడ్ బుక్..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని దేశ ప్రజలు భుజాలకు ఎత్తుకున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీ…
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు…
ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక దాని తర్వాత..ఒకటి ఆయన సంచల న కామెంట్లతో…
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న క్రేజీ మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం తారక్ లేకుండా…