హరియాణా.. దేశరాజధాని ఢిల్లీతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రం. ఇక్కడ తాజాగా జరిగిన ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ పరాజయం పాలవుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఏబీపీ -సీ ఓటరు సర్వే తప్ప.. మిగిలినవన్నీ కూడా.. హరియాణా ప్రజలు కాంగ్రెస్ వైపే చూస్తున్నారని.. ఇక్కడ విజయం దక్కించుకోవడం కమలనాథులకు కష్టమేనని చెప్పుకొచ్చాయి.
ప్రజల మూడ్ కాంగ్రెస్ వైపే ఉందని కూడా లెక్కలు వేశాయి. కానీ, ఎగ్జిట్ పోల్ ఫలితాను తలకిందులు చేస్తూ.. ప్రజలు తీర్పు చెప్పారు. మరోసారి బీజేపీవైపే మొగ్గు చూపించారు. అయితే.. ఫైట్ మాత్రం టఫ్గా సాగడం గమనార్హం. బొటా బొటి మేజిక్ ఫిగర్తో బీజేపీ మరోసారి అధికారం దక్కించుకుంది. తాజాగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన ఈవీఎంల ఓట్ల లెక్కింపులో ఆదిలో కాంగ్రెస్ జోరు చూపించింది.
కానీ… రౌండ్లు పెరుగుతూ.. కౌంటింగ్ పూర్తయ్యే సమయానికి.. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. తొలి రెండు రౌండ్లలో వెనుకబడ్డ.. బీజేపీ తర్వాత తర్వాత.. తన సత్తా చాటుతోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న హరియాణాలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించారు. ఈ నెల 4 న జరిగిన పోలింగ్ అనంతరం.. మంగళవారం ఓట్ల లెక్కింపు ప్రారంభించారు.
తాజాగా అందిన సమాచారం మేరకు మేజిక్ ఫిగర్ 46 స్థానాలకు గాను బీజేపీ ఏకపక్షంగా ఈ సీట్లను దక్కించుకుంది. దీంతో అధికారంలోకి వచ్చేందుకు కావాల్సిన స్థానాలు కమల నాథులకు దక్కాయి. ఇక, కాంగ్రెస్కు 37 చోట్ల విజయం దక్కింది. అదేవిధంగా స్తానిక పార్టీ ఐఎస్ ఎల్డీ పార్టీ 3 స్థానాల్లోనూ.. ఇండిపెండెంట్లు 4 స్థానాల్లోనూ విజయం దక్కించుకున్నారు. దీంతో వరుసగా మూడోసారి కూడా బీజేపీ హరియాణాలో అధికారం చేపట్టడం ఖాయమైంది.
This post was last modified on October 8, 2024 6:31 pm
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…