నిత్యం పాకిస్థాన్ కవ్వింపులు, ఉక్రమూకల హల్చల్తో బిక్కుబిక్కుమనే జమ్ము కశ్మీర్లో పాగా వేయాలని.. తమ సత్తా నిరూపించుకోవాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత.. లద్ధాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. మిగిలిన జమ్ము కశ్మీర్ను అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా వేరు చేశారు. ఇక్కడే తాజాగా మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లున్న జమ్ము కశ్మీర్లో తమకు అధికారం దక్కుతుందని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. లెక్కలేనన్ని సార్లు ఇక్కడ పర్యటించి ప్రచారం కూడా చేశారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మరిన్ని సార్లు ఇక్కడ సభలు పెట్టి.. కశ్మీరీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛ, ఉగ్రవాద నిర్మూలన.. సహా అనేక విషయాలపై ఆయన ఇక్కడ ప్రసంగాలు దంచికొట్టారు. కానీ, ప్రజా తీర్పు మాత్రం భిన్నంగా వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు.
మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కౌంటింగ్ పూర్తయింది. దీని ప్రకారం.. ఎన్సీకి 41 స్థానాలు, కాంగ్రెస్కు 9 స్థానాలు దక్కాయి. దీంతో మేజిక్ ఫిగర్ అయిన.. 46 సీట్లను ఈ కూటమి దాటేసింది. ఇక, బీజేపీకి వచ్చేసరికి కేవలం 24 స్థానాలే దక్కాయి. (మొత్తం 56 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది)
ఇక, పీడీపీకి 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 13 చోట్ల విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిని ఏకం చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాలని బీజేపీ చూస్తున్నా.. కాంగ్రెస్+ఎన్సీకి అంతకుమించిన మెజారిటీ ఉండడంతో ఈ సారికి ప్రతిపక్షంలోనే కమల నాథులు కూర్చోవాల్సి వస్తోంది. పైగా.. జమ్ము కశ్మీర్లొ దాదాపు 10 ఏళ్ల తర్వాత.. ఎన్నికలు జరగడం విశేషం.
This post was last modified on October 8, 2024 6:29 pm
ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…
దేశంలో సినీ అభిమానం పరంగా టాప్లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్లో ఈ…
కొన్ని సినిమాలు థియేటర్లలో సరిగా ఆడవు. వాటిని ఓటీటీలో చూసినపుడు ఇలాంటి చిత్రాలను ఎలా ఫ్లాప్ చేశారు అంటూ ఆశ్చర్యపోతుంటారు…
సామాజికంగా.. సమస్యల పరిష్కారం పరంగా.. నాయకులు దూకుడు ప్రదర్శిస్తారు. నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క…
వచ్చే ఎన్నికల్లోనూ కూటమి విజయం సాధిస్తుందన్న బలమైన సంకేతాలు వస్తున్నాయి. నాయకులు చెప్పడమే కాదు.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కొన్ని ఆన్లైన్…
ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…