నిత్యం పాకిస్థాన్ కవ్వింపులు, ఉక్రమూకల హల్చల్తో బిక్కుబిక్కుమనే జమ్ము కశ్మీర్లో పాగా వేయాలని.. తమ సత్తా నిరూపించుకోవాలని బీజేపీ ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన తర్వాత.. లద్ధాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేశారు. మిగిలిన జమ్ము కశ్మీర్ను అసెంబ్లీతో కూడిన రాష్ట్రంగా వేరు చేశారు. ఇక్కడే తాజాగా మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 అసెంబ్లీ సీట్లున్న జమ్ము కశ్మీర్లో తమకు అధికారం దక్కుతుందని బీజేపీ భారీ ఆశలే పెట్టుకుంది.
ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. లెక్కలేనన్ని సార్లు ఇక్కడ పర్యటించి ప్రచారం కూడా చేశారు. ఇక, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. మరిన్ని సార్లు ఇక్కడ సభలు పెట్టి.. కశ్మీరీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. స్వేచ్ఛ, ఉగ్రవాద నిర్మూలన.. సహా అనేక విషయాలపై ఆయన ఇక్కడ ప్రసంగాలు దంచికొట్టారు. కానీ, ప్రజా తీర్పు మాత్రం భిన్నంగా వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమికి ప్రజలు అధికారం అప్పగించారు.
మొత్తం 90 స్థానాలున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కౌంటింగ్ పూర్తయింది. దీని ప్రకారం.. ఎన్సీకి 41 స్థానాలు, కాంగ్రెస్కు 9 స్థానాలు దక్కాయి. దీంతో మేజిక్ ఫిగర్ అయిన.. 46 సీట్లను ఈ కూటమి దాటేసింది. ఇక, బీజేపీకి వచ్చేసరికి కేవలం 24 స్థానాలే దక్కాయి. (మొత్తం 56 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది)
ఇక, పీడీపీకి 2 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థులు 13 చోట్ల విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు వీరిని ఏకం చేసి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నించాలని బీజేపీ చూస్తున్నా.. కాంగ్రెస్+ఎన్సీకి అంతకుమించిన మెజారిటీ ఉండడంతో ఈ సారికి ప్రతిపక్షంలోనే కమల నాథులు కూర్చోవాల్సి వస్తోంది. పైగా.. జమ్ము కశ్మీర్లొ దాదాపు 10 ఏళ్ల తర్వాత.. ఎన్నికలు జరగడం విశేషం.
This post was last modified on October 8, 2024 6:29 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…