తెలంగాణ టీడీపీకి జోష్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత.. పార్టీకి పునర్వైభవం తెచ్చేలా.. వచ్చేలా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న, తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఈ క్రమంలో గతంలో పార్టీకి దూరమైన కీలక నాయకులు ఇప్పుడు తిరిగి సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా సీఎం చంద్రబాబును తెలంగాణలోని ఇతర పార్టీల నాయకులు కలుసుకున్నారు. వీరిలో చాలా మంది కీలక నేతలే ఉండడం గమనార్హం.
హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖరెడ్డి, మల్లారెడ్డి తదతరులు చంద్రబాబును ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తీగల కృష్నారెడ్డి.. గతంలో టీడీపీలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ నేతగానే ఆయన హైదరాబాద్ మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత.. రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ మారిపోయారు. అయితే.. ప్రస్తుతం ఆయన రాజకీయంగా పార్టీలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చంద్రబాబును కలిసిన తీగల పార్టీలో చేరుతానంటూ ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ తనకు పుట్టినిల్లు వంటిదని.. రాజకీయాల్లో తనకు అనేక పదవులు ఇచ్చిందని తెలిపారు. త్వరలోనే సైకిల్ ఎక్కనున్నట్టు ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో పనిచేయడం తనకు ఎంతో సంతోషంగా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యేలు, మామ అల్లుళ్లు మర్రి రాజశేఖరరెడ్డి, మల్లా రెడ్డి కూడా.. చంద్రబాబుతో ఇదే విషయంపై చర్చించినట్టు సమాచారం.
అయితే.. వీరు కృష్ణారెడ్డి మాదిరిగా బయటకు ఏమీ చెప్పకపోయినా.. పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తం చేయడంతోపాటు.. త్వరలోనే చంద్రబాబును మరోసారి కలిసేందుకు కూడా అప్పాయింట్మెంటు కోరినట్టు సమాచారం. బీఆర్ ఎస్ తరఫున విజయం దక్కించుకున్న వీరిద్దరూ.. ప్రస్తుత ప్రభుత్వం నుంచి సెగ ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపడం గమనార్హం.
This post was last modified on October 7, 2024 6:45 pm
సూపర్ స్టార్ రజినీకాంత్కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్తో మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్…
ఇటీవలే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన ‘ఎన్’ కన్వెన్షన్ విషయమై ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్…
ఒకప్పుడు తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే చక్కటి తెలుగు టైటిళ్లు పెట్టేవారు. మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు,…
సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ పర్యటన అధికారికం. కేంద్ర ప్రభుత్వమే.. ముఖ్యమంత్రులను ఆహ్వానించింది. తాజాగా రెండు రోజుల కిందట…
మాస్ పోలీస్ గా సింగంని పరిచయం చేసింది కోలీవుడ్ హీరో సూర్య, దర్శకుడు హరినే అయినప్పటికీ దాన్ని విజయవంతంగా సీక్వెల్స్…
వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పుంగనూరు-చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన అంగళ్లు ప్రాంతానికి వచ్చినప్పుడు.. పెద్ద రచ్చ…