Political News

తెలంగాణ టీడీపీకి జోష్.. సైకిలెక్కేందుకు నేతల క్యూ!

తెలంగాణ టీడీపీకి జోష్ వ‌చ్చింది. దాదాపు ఐదేళ్ల త‌ర్వాత‌.. పార్టీకి పున‌ర్‌వైభ‌వం తెచ్చేలా.. వ‌చ్చేలా పార్టీ అధినేత చంద్ర‌బాబు తీసుకున్న‌, తీసుకుంటున్న చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్నాయి. ఈ క్ర‌మంలో గ‌తంలో పార్టీకి దూర‌మైన కీల‌క నాయ‌కులు ఇప్పుడు తిరిగి సైకిల్ ఎక్కేందుకు క్యూ క‌డుతున్నారు. తాజాగా సీఎం చంద్ర‌బాబును తెలంగాణ‌లోని ఇత‌ర పార్టీల నాయ‌కులు క‌లుసుకున్నారు. వీరిలో చాలా మంది కీల‌క నేత‌లే ఉండ‌డం గ‌మ‌నార్హం.

హైద‌రాబాద్ మాజీ మేయ‌ర్ తీగ‌ల కృష్ణారెడ్డి, ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు మ‌ర్రి రాజ‌శేఖ‌రెడ్డి, మ‌ల్లారెడ్డి త‌దత‌రులు చంద్ర‌బాబును ఆయ‌న నివాసంలో క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా వారు పార్టీలో చేరేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. తీగ‌ల కృష్నారెడ్డి.. గ‌తంలో టీడీపీలో ఉన్న విష‌యం తెలిసిందే. టీడీపీ నేత‌గానే ఆయ‌న హైద‌రాబాద్ మేయ‌ర్‌గా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత‌.. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో పార్టీ మారిపోయారు. అయితే.. ప్ర‌స్తుతం ఆయ‌న రాజ‌కీయంగా పార్టీల‌కు దూరంగా ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా చంద్ర‌బాబును క‌లిసిన తీగ‌ల పార్టీలో చేరుతానంటూ ప్ర‌క‌టించారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ త‌న‌కు పుట్టినిల్లు వంటిద‌ని.. రాజ‌కీయాల్లో త‌న‌కు అనేక ప‌ద‌వులు ఇచ్చింద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే సైకిల్ ఎక్క‌నున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో ప‌నిచేయ‌డం త‌న‌కు ఎంతో సంతోషంగా ఉంటుంద‌ని తెలిపారు. అదేవిధంగా ప్ర‌స్తుత ఎమ్మెల్యేలు, మామ అల్లుళ్లు మ‌ర్రి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, మ‌ల్లా రెడ్డి కూడా.. చంద్ర‌బాబుతో ఇదే విష‌యంపై చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం.

అయితే.. వీరు కృష్ణారెడ్డి మాదిరిగా బ‌య‌ట‌కు ఏమీ చెప్ప‌క‌పోయినా.. పార్టీ మారేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. త్వ‌ర‌లోనే చంద్ర‌బాబును మ‌రోసారి క‌లిసేందుకు కూడా అప్పాయింట్‌మెంటు కోరిన‌ట్టు స‌మాచారం. బీఆర్ ఎస్ త‌ర‌ఫున విజ‌యం ద‌క్కించుకున్న వీరిద్ద‌రూ.. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం నుంచి సెగ ను ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టీడీపీ వైపు మొగ్గు చూపడం గ‌మ‌నార్హం.

This post was last modified on October 7, 2024 6:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రంప్ ఇమేజ్ ఎంత దారుణంగా పడిదంటే

అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…

47 minutes ago

జగన్ ‘మావిగన్’… ట్రోల్ మెటీరియల్ అయిందే

‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…

1 hour ago

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

3 hours ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

4 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

6 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

6 hours ago