Political News

సీబీఎన్ ఢిల్లీ టూర్‌.. జ‌గ‌న్‌కు డ‌ర్‌!!

సీఎం చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్తున్నారు. ఈ ప‌ర్య‌ట‌న అధికారికం. కేంద్ర ప్ర‌భుత్వ‌మే.. ముఖ్య‌మంత్రుల‌ను ఆహ్వానించింది. తాజాగా రెండు రోజుల కింద‌ట ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో జ‌రిగిన భారీ ఎన్ కౌంట‌ర్‌లో 40 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్ర‌మంలో మావోయిస్టు ప్ర‌భావిత రాష్ట్రాలైన‌ తెలంగాణ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, ఏపీ, ఒడిశా, ప‌శ్చిమ‌బెంగాల్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా భేటీ కానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చంద్ర‌బాబు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని కూడా క‌ల‌వ‌నున్నారు.

కేవ‌లం మావోయిస్టు స‌మ‌స్య‌లపైనే కాకుండా.. ఇటీవ‌ల రాష్ట్రంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పైనా చంద్ర‌బాబు ప్ర‌ధానికి వివ‌రించ‌నున్నారు. బుడ‌మేరు ప‌టిష్టం, వ‌ర‌ద బాధితుల‌కు సాయం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్‌(స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌)లో విలీనం చేయ‌డం, పోల‌వ‌రానికి బ‌డ్జెట్‌లో కేటాయించిన నిధుల విడుద‌ల‌తోపాటు వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధుల విడుద‌ల వంటి అంశాల‌పైనే చ‌ర్చిస్తార‌ని.. పార్టీకార్యాల‌యం తెలిపింది.

అయితే.. చంద్ర‌బాబు ఢిల్లీ టూర్ పై వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ చాలా ఉత్సుక‌త‌తో కూపీ లాగుతున్నారు. ఆయ‌న ఏం మాట్లాడ‌తారు? ఏం చేస్తారు? అనే విష‌యాల‌పై జ‌గ‌న్ ఢిల్లీ వ‌ర్గాల నుంచి స‌మాచారం సేక‌రిస్తున్న‌ట్టు తెలిసింది. దీనికి కార‌ణం.. తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వివాద‌మే. ఈ వివాదం తెర‌మీదికి వ‌చ్చిన త‌ర్వాత‌.. బీజేపీ పూర్తిగా చంద్ర‌బాబు వెంటే నిలిచింది. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి కూడా.. చంద్ర‌బాబును వెనుకేసుకుని వ‌చ్చారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించారు.

ఇక‌, కేంద్రంలోని కొంద‌రు స‌చివులు కూడా .. తిరుమ‌ల బాలాజీ ల‌డ్డూ అప‌విత్రం కావ‌డంపై గుర్రుగా ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఖ‌చ్చితంగా లడ్డూ ప్ర‌స్తావ‌న లేకుండా ఉండ‌ద ని జ‌గ‌న్ భావిస్తున్నారు. త‌న హ‌యాంలో చోటు చేసుకున్న తిరుమ‌ల అక్ర‌మాల‌పై ఇప్ప‌టికే స‌మాచారం సేక‌రించిన చంద్ర‌బాబు వీటిపై ప్ర‌ధానికి మ‌రిన్ని ఫిర్యాదులు చేసే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న త‌ల‌పో స్తున్నారు. ఇదే జ‌రిగితే.. త‌న‌కున్న ప‌రువు మ‌రింత పోతుంద‌ని ఆయ‌న భ‌య‌ప‌డుతున్న ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

మ‌రోవైపు సుప్రీంకోర్టు ఆదేశాల‌తో సీబీఐ నుంచి ఇద్ద‌రు అధికారుల‌ను నియ‌మించాల్సి ఉంది. సీబీఐ ఎంత స్వ‌తంత్ర సంస్థ అయినా.. ప్ర‌ధాని చేతిలో ప‌నిచేస్తోంద‌న్న విమ‌ర్శ‌లు ఉండ‌నే ఉన్నాయి. అందుకే ప‌దేళ్లుగా జ‌గ‌న్‌పై సీబీఐ దూకుడు త‌గ్గించింద‌న్న విమ‌ర్శ‌లు కూడా తెలిసిందే. మొత్తంగా చంద్ర‌బాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న విష‌యంలో జ‌గ‌న్ భ‌య‌ప‌డుతుండ‌డంపై సోష‌ల్ మీడియాలో చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on October 7, 2024 6:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

25 minutes ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

43 minutes ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

49 minutes ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

1 hour ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

2 hours ago

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

4 hours ago