వైసీపీ హయాంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు.. పుంగనూరు-చిత్తూరు సరిహద్దు ప్రాంతమైన అంగళ్లు ప్రాంతానికి వచ్చినప్పుడు.. పెద్ద రచ్చ జరిగిన విషయం తెలిసిందే. వాస్తవానికి పుంగనూరు పర్యటనకు సంబంధించి తమకు ఎలాంటి సమాచారం లేదని.. కానీ, చంద్రబాబు అంగళ్లు ప్రాంతం నుంచి పుంగనూరులోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయనను అడుగు కూడా పెట్టనివ్వలేదు.
ఇక, చంద్రబాబు పుంగనూరులో అడుగు పెడుతున్నారని తెలిసి.. వైసీపీ నాయకులు కూడా విజృంభించారు. ఈ క్రమంలోనే టీడీపీ-వైసీపీ నాయకులకు మధ్య తీవ్ర రణరంగం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సిబ్బంది కూడా రాళ్లు తగిలి గాయపడ్డారు. అప్పట్లో ఈ ఘటనపై వైసీపీ నేత ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో పుంగనూరు పోలీసులు చంద్రబాబు, దేవినేని ఉమా సహా అనేక మంది నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల విచారణ ప్రారంభమయ్యేలోగానే రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి. అయితే.. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఈ కేసు యూటర్న్ తీసుకుంది. అప్పటి వరకు ఎఫ్ ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ‘ఇది ఉత్తుత్తి కేసే.. దీనిలో ఏమీ లేదు’ అని పేర్కొంటూ.. జిల్లా కోర్టులో అఫిడవిట్ సమర్పించి.. కేసును కొట్టేసేందుకు అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో జిల్లా కోర్టు నుంచి సంచలన ఆదేశాలు వచ్చాయి. ఫిర్యాదు చేసిన ఉమాపతి రెడ్డి ఏం చెబుతున్నారో తెలుసుకోవాలని ఆదేశించింది.
దీంతో పోలీసులు ఉమాపతి రెడ్డి నుంచి అఫిడవిట్ కోరారు. ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తమకు లిఖిత పూర్వకంగా అఫిడవిట్ ఇవ్వాలని ఆయనను కోరారు(ఆయన మాత్రం తనను బెదిరిం చారని చెబుతున్నారు. దీనిపై కూడా మరో కేసు కోర్టులోనే వేస్తానని చెబుతున్నారు). కానీ, ఉమాపతి మాత్రం కేసును వెనక్కి తీసుకునేది లేదని చెబుతున్నారు. అవసరమైతే.. తనపై ఒత్తిడి చేస్తున్న పోలీసులపై హైకోర్టులో కేసు వేస్తానని అంటున్నారు. దీంతో అంగళ్లు కేసు ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on October 7, 2024 6:34 pm
ఈ మధ్య వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు, దివ్వెల మాధురి అనే వివాహితకు మధ్య సంబంధం గురించి ఎంత రచ్చ…
తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నా రు. ఇటీవల వెలుగు చూసిన తిరుమల…
తెలంగాణ టీడీపీకి జోష్ వచ్చింది. దాదాపు ఐదేళ్ల తర్వాత.. పార్టీకి పునర్వైభవం తెచ్చేలా.. వచ్చేలా పార్టీ అధినేత చంద్రబాబు తీసుకున్న,…
సూపర్ స్టార్ రజినీకాంత్కు సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్తో మంచి అనుబంధం ఉంది. వీరి కలయికలో రెండు బ్లాక్ బస్టర్ మూవీస్…
ఇటీవలే హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిన ‘ఎన్’ కన్వెన్షన్ విషయమై ఇటీవల పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్…
ఒకప్పుడు తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే చక్కటి తెలుగు టైటిళ్లు పెట్టేవారు. మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు,…