Political News

‘అంగ‌ళ్లు’ కేసు.. యూట‌ర్న్‌!

వైసీపీ హ‌యాంలో ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. పుంగ‌నూరు-చిత్తూరు స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన అంగ‌ళ్లు ప్రాంతానికి వ‌చ్చిన‌ప్పుడు.. పెద్ద ర‌చ్చ జ‌రిగిన విష‌యం తెలిసిందే. వాస్త‌వానికి పుంగ‌నూరు ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని.. కానీ, చంద్ర‌బాబు అంగ‌ళ్లు ప్రాంతం నుంచి పుంగ‌నూరులోకి ప్ర‌వేశించే ప్ర‌య‌త్నం చేశార‌ని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను అడుగు కూడా పెట్ట‌నివ్వ‌లేదు.

ఇక‌, చంద్ర‌బాబు పుంగ‌నూరులో అడుగు పెడుతున్నార‌ని తెలిసి.. వైసీపీ నాయ‌కులు కూడా విజృంభించారు. ఈ క్ర‌మంలోనే టీడీపీ-వైసీపీ నాయ‌కుల‌కు మ‌ధ్య తీవ్ర ర‌ణ‌రంగం చోటు చేసుకుంది. ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు దాడులు చేసుకున్నారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు సిబ్బంది కూడా రాళ్లు త‌గిలి గాయ‌ప‌డ్డారు. అప్ప‌ట్లో ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ నేత ఉమాప‌తి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు అప్ప‌ట్లో పుంగ‌నూరు పోలీసులు చంద్ర‌బాబు, దేవినేని ఉమా స‌హా అనేక మంది నాయ‌కుల‌పై హ‌త్యాయ‌త్నం కేసులు న‌మోదు చేశారు.

ఈ కేసుల విచార‌ణ ప్రారంభ‌మ‌య్యేలోగానే రాష్ట్రంలో ఎన్నిక‌లు వ‌చ్చాయి. అయితే.. కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఈ కేసు యూటర్న్ తీసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఎఫ్ ఐఆర్ న‌మోదు చేసిన పోలీసులు.. తాజాగా ‘ఇది ఉత్తుత్తి కేసే.. దీనిలో ఏమీ లేదు’ అని పేర్కొంటూ.. జిల్లా కోర్టులో అఫిడ‌విట్ స‌మ‌ర్పించి.. కేసును కొట్టేసేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని అభ్య‌ర్థించారు. ఈ క్ర‌మంలో జిల్లా కోర్టు నుంచి సంచ‌ల‌న ఆదేశాలు వ‌చ్చాయి. ఫిర్యాదు చేసిన ఉమాప‌తి రెడ్డి ఏం చెబుతున్నారో తెలుసుకోవాల‌ని ఆదేశించింది.

దీంతో పోలీసులు ఉమాప‌తి రెడ్డి నుంచి అఫిడ‌విట్ కోరారు. ఈ కేసును ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్టు త‌మ‌కు లిఖిత పూర్వ‌కంగా అఫిడవిట్ ఇవ్వాల‌ని ఆయ‌నను కోరారు(ఆయ‌న మాత్రం త‌న‌ను బెదిరిం చార‌ని చెబుతున్నారు. దీనిపై కూడా మ‌రో కేసు కోర్టులోనే వేస్తాన‌ని చెబుతున్నారు). కానీ, ఉమాప‌తి మాత్రం కేసును వెన‌క్కి తీసుకునేది లేద‌ని చెబుతున్నారు. అవ‌స‌ర‌మైతే.. త‌న‌పై ఒత్తిడి చేస్తున్న పోలీసుల‌పై హైకోర్టులో కేసు వేస్తాన‌ని అంటున్నారు. దీంతో అంగ‌ళ్లు కేసు ఇప్ప‌ట్లో తేలేలా క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on October 7, 2024 6:34 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

8 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

16 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago