Political News

ప్రియమైన మోడీ అంటూనే అంకెలతో ఉతికేసిన రేవంత్



తెలంగాణ రాష్ట్రంలో తాము అమలు చేస్తున్న రైతురుణ మాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. డియర్ మోడీ అంటూనే.. రైతుల రుణమాఫీపై తమ ప్రభుత్వ కమిట్ మెంట్ ను.. గణాంకాల్ని ప్రస్తావించిన ఆయన.. పనిలో పనిగా రుణమాఫీపై తెలంగాణ విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ.. వారి ప్రచారంలోని అంశాల్ని పేర్కొంటూ.. అవన్నీ ఎంత అబద్ధాల్లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందుకోసం అధికారిక గణాంకాల్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తాము అధికార పగ్గాలు చేపట్టిన మొదటి ఏడాదిలోనే రూ.2 లక్షల వరకు పంట రుణాన్ని మాఫీను విజయవంతంగా అమలుచేసినట్లుగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి వివరాల్ని వెల్లడించారు.

అంతేకాదు.. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీని అమలు చేయనున్నట్లుగా పేర్కొన్నారు. మహారాష్ట్రలో శనివారం జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని.. దాని అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నట్లుగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు.


దీనికి బదులు అన్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించారు. తాము అమలు చేసిన రుణమాఫీ వివరాల్ని గణాంకాల రూపంలో చెప్పుకొచ్చారు. ఆ వివరాల్ని చూస్తే..


–  మొదటి విడత కింద జులై 18న 11.34 లక్షల మందికి లక్ష రూపాయిల వరకు రూ.6034.97 కోట్ల మేర మాఫీ చేశాం.
–  రెండో విడతగా జులై 30న 6.40 లక్షల రైతులకు రూ.1.50 లక్షలు చొప్పున మొత్తం రూ.6190 కోట్లు
–  మూడో విడతలో భాగంగా ఆగస్టు 15న 4.46 లక్షల మందికి రూ.2 లక్షలు చొప్పున రూ.5644.24 కోట్ల మొత్తాన్ని రుణమాఫీ చేశాం.
–  మొత్తం 22.22 లక్షల మందికి రూ.17,869 కోట్ల భారీ మొత్తాన్ని రుణమాఫీ కింద రైతులకు అందజేశాం.
రైతుల సంక్షేమంపై తమ ప్రభుత్వానికి ఉన్న కమిట్ మెంట్ ను తెలిసేలా చేస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్.. తామిప్పుడు రూ.2 లక్షలకు పైగా అప్పున్న రైతులు రూ.2 లక్షలపైన అదనంగా ఉన్న అప్పును బ్యాంకులకు చెల్లిస్తే మిగిలిన రూ.2 లక్షల మొత్తాన్ని ప్రభుత్వం రుణమాఫీ కింద రైటాఫ్ చేస్తుందన్నారు. రైతులకు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిర్ణీత కాలపరిమితతో పూర్తి చేసే విషయంలో తాము కట్టుబడి ఉన్నట్లుగా చెప్పారు.
ఇప్పటికే తమ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు రుణమాఫీ అమలు కోసం రూ.26 వేల కోట్లను కేటాయించిందని.. అర్హత కలిగిన ప్రతి రైతును ఆదుకోవటానికి రూ.31 వేల కోట్లను వెచ్చించేందుకు సిద్ధమయ్యామని చెప్పిన సీఎం రేవంత్.. ‘‘రైతుల రుణమాఫీ విషయంలో మా ప్రభుత్వ పారదర్శకతను తెలిపేందుకు మా ప్రభుత్వ వెబ్ సైట్లో ఉన్న సమాచారాన్ని మీకు పంపుతున్నాం. వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వటంలో మా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని భావిస్తున్నాం. తెలంగాణలో రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు మీ సహకారం.. మార్గదర్శకత్వం కావాలి’’ అంటూ లేఖను ముగించిన వైనం ఆసక్తికరంగా మారింది.  

This post was last modified on October 7, 2024 6:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

9 minutes ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

5 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

8 hours ago

నెగిటివిటీ వలయంలో దురంధర్ విలవిలా

బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…

8 hours ago

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

10 hours ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

12 hours ago