ప్రత్తిపాటి పుల్లారావు.. టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, చిలకలూరి పేట ఎమ్మెల్యే. ప్రస్తుతం ఆయన గురించి టీడీపీ ఆరా తీస్తోంది. దీనికి కారణం ప్రత్తిపాటి యాక్టివ్గా పార్టీలో పాల్గొనకపోవడమే. అసలు ఆయన ఎక్కడా కనిపించడం లేదు. నెల రోజుల కిందట.. ఆయన సతీమణి వెంకాయమ్మ.. బర్త్ డే సందర్భంగా స్థానిక పోలీసులను ఇంటికి పిలిచి.. వారితో కేకులు తెప్పించుకుని కట్ చేశారన్న విషయం ప్రధాన మీడియాలోనే వచ్చింది.
ఇది పెద్ద వివాదంగా మారిపోయింది. దీంతో స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత.. ప్రత్తిపాటి కూడా వివరణ ఇచ్చారు. ఆ ఘటన యాదృచ్ఛికంగా జరిగిందని.. అసలు అక్కడ పోలీసులే లేరని..మీడియా కట్టుకథ అల్లేసిందని ఆయన చెప్పుకొచ్చారు. సరే.. ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది. కానీ, తర్వాత ప్రత్తిపాటి ఎక్కడా కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి? అనేది ఇప్పు డు మిలియన్ డాలర్ల ప్రశ్న.
దీనిపై రెండు కారణాలు పార్టీ సీనియర్ల మధ్య చర్చగా నడుస్తున్నాయి. 1) తన కుమారుడిపై వైసీపీ హయాంలో నమోదైన జీఎస్టీ కేసులను రద్దు చేయాలని ప్రత్తిపాటి కోరుతున్నారు. 2) తన సతీమణి వెంకాయమ్మకు నామినేటెడ్ పదవిని అడుగుతున్నారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు టీడీపీ సీనియర్ల మధ్య చర్చకు వస్తున్నాయి. వాస్తవానికి వైసీపీ నమోదుచేసిన కేసులను రద్దు చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ, జీఎస్టీ వంటివి కేంద్ర ఆర్థిక శాఖ సూచనలతో నమోదు చేసిన కేసు కావడంతో దీనిని రద్దు చేయడం అనేది ఎంత వరకు సాధ్యమో తెలియదు.
ఈ విషయంపై చంద్రబాబు మౌనంగా ఉన్నారు. ఇక, వెంకాయమ్మకు నామినేటెడ్ పదవిని ఇవ్వడాన్ని పార్టీలోని కొందరు విభేదిస్తున్నారు. భర్త మంత్రిగా ఉన్నప్పుడే.. ఆమెను తట్టుకోలేక పోయామని.. ఇప్పుడు నామినేటెడ్ పదవి ఇస్తే.. ఇక, తాము పార్టీని వదిలేయాల్సి వస్తుందని.. కీలక నేతలు ముఖం మీదే చెప్పేస్తున్నారు. దీంతో నామినేటెడ్ పదవి విషయంలో చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నారు. సో.. ఈ రెండు అంశాల కారణంగానే ప్రత్తిపాటి మౌనంగా ఉన్నారని.. పార్టీలో యాక్టివ్గా లేరని సీనియర్ల వాదన. మరి ఏది నిజమో తేలాలంటే వెయిట్ చేయాల్సిందే.
This post was last modified on October 7, 2024 7:39 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…