Political News

బీఆర్ఎస్‌కు వంద‌ల కోట్లు ఎక్క‌డ నుంచి వ‌చ్చాయ్‌: రేవంత్‌రెడ్డి

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. 10 ఏండ్ల కింద‌ట క‌ర‌పత్రాల‌కే సొమ్ములు లేవ‌ని చందాలు అడిగిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఇప్పుడు 1500 కోట్ల రూపాయ‌ల పైగా నిధులు వ‌చ్చాయ‌న్నారు. ఈ సొమ్ముడు ఏడ నుంచి వ‌చ్చాయో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. “అధికారంలో ఉండ‌గా.. అదిలించి.. బెదిరించి.. రాబ‌ట్టుకున్న సొమ్ములు కాదా? కాద‌ని చెప్పే ధైర్యం ఉందా?” అని నిల‌దీశారు.

తెలంగాణ ఉద్యమంతో త‌ప్ప‌.. కేసీఆర్ ఎలివేష‌న్‌కు మ‌రో మార్గం కూడా లేద‌న్నారు. ఇంకా.. దానినే ప‌ట్టుకుని వేలాడుతున్నార‌ని విమ‌ర్శించారు. “ప‌దేళ్ల పాల‌న‌లో ఇది చేసినం.. అది చేసినం అని చెప్పుకొని ప్ర‌జ‌ల్లోకి వెళ్లే ధైర్యం లేని వాళ్లు మాకు పాఠాలు చెబుతున్నారు” అని రేవంత్ దుయ్య‌బ‌ట్టారు. తెలంగాణ ఉద్య‌మం అనే ముసుగు పెట్టుకుని తెలంగాణ స‌మాజం నుంచి గౌర‌వం పొందార‌ని.. దానిని తీసేస్తే.. ఏపాటి గౌర‌వం ఉంటుందో అంద‌రికీ తెలిసిందేన‌న్నారు.

మూసీ పేరు ఎందుకు పెట్టుకోరు..

ఈ సంద‌ర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అనేక మంది త‌ల్లిదండ్రులు.. త‌మ పిల్ల‌ల‌కు గంగ‌, కావేరీ, కృష్ణ వేణి, గోదావ‌రి అని న‌దుల పేరు పెట్టుకున్నారు. కానీ, మూసీ న‌ది పేరు ఎందుకు పెట్టుకోలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఎంద‌కంటే.. మూసీ అంటే మురికి కాసారం కాబ‌ట్టే ఆ పేరు పెట్టుకోలేద‌ని, ఇప్పుడు దానినే తాము సంస్క‌రిస్తున్నామ‌ని.. ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా.. ఎంద‌రు అడ్డు ప‌డినా.. మూసిని ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామ‌న్నారు.

ప్రజల గూడు చెదిరిపోతుంద‌ని ఆలోచిస్తే.. ప్రాజెక్టులు వ‌చ్చేవా? అని ప్ర‌శ్నించారు. నిరాశ్ర‌యులయ్యే వారికి అండ‌గా ఉంటామ‌ని.. మూసీ న‌దిని మాత్రం ప్రక్షాళ‌న చేసి తీరుతామ‌ని రేవంత్ చెప్పారు. మల్లన్నసాగర్ కోసం రైతులను బలవంతంగా ఖాళీ చేయించిన‌ప్పుడు.. ఈ నేత‌లకు మ‌న‌సు ఎలా వ‌చ్చిందో చెప్పాల‌ని మాజీ మంత్రులు కేటీఆర్‌, హ‌రీష్‌రావుల‌ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు.

This post was last modified on October 6, 2024 9:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

26 minutes ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

48 minutes ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

1 hour ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

2 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

3 hours ago

KVN… అగ్ర సంస్థకు అంతులేని అడ్డంకులు

సౌత్ లో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదగాలని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్స్. మూలాలు కర్ణాటకనే…

4 hours ago