తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి” అని పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి సీఎం అప్పాయింట్మెంట్ లెటర్లు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయన్నారు.
అందుకే అప్పట్లో తాను.. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పిలుపుతో చేపట్టిన ఉద్యమానికి నిరుద్యోగులు మద్దతుగా నిలిచారన్నారు. అప్పట్లోనే తాను.. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు పోతే తప్ప.. సాధారణ నిరుద్యోగులకు, పేదలకు ఉద్యోగాలు రావని చెప్పానని ఇప్పుడు అదే జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏళ్ల తరబడి నిరుద్యోగులను వేధించిందని విమర్శించారు. “ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పిస్తరు. తర్వాత.. పక్కన పెడతరు” అని దుయ్యబట్టారు.
తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుతోనే ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు. ఆ మార్పుకు నాంది పలికిన నిరుద్యోగుల కలలు నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిందే.. నిధులు-నియామకాల కోసమని. కానీ, ఈ విషయాన్ని కేసీఆర్ కుటుంబం తమకు ఆపాదించుకుని నిధులు-నియామకాలు అంటే తమ కుటుంబానికే అనుకుందని ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించలేదని దుయ్యబట్టారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్ద పీట వేస్తోందని రేవంత్ చెప్పారు. త్వరలోనే చేపట్టనున్న రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణంలో ప్రస్తుతం ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారే కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీలలోనూ యువ ఉద్యోగుల పాత్రం కీలకంగా మారనుందని వెల్లడించారు.
This post was last modified on October 6, 2024 9:12 pm
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…