తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “నేను చెప్పినట్టే కేసీఆర్ ఉద్యోగం పోయింది. ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయి” అని పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన 1,635 మందికి సీఎం అప్పాయింట్మెంట్ లెటర్లు అందించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు వచ్చాయన్నారు.
అందుకే అప్పట్లో తాను.. విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ పిలుపుతో చేపట్టిన ఉద్యమానికి నిరుద్యోగులు మద్దతుగా నిలిచారన్నారు. అప్పట్లోనే తాను.. కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు పోతే తప్ప.. సాధారణ నిరుద్యోగులకు, పేదలకు ఉద్యోగాలు రావని చెప్పానని ఇప్పుడు అదే జరిగిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేందుకు ఏళ్ల తరబడి నిరుద్యోగులను వేధించిందని విమర్శించారు. “ఎన్నికల సమయంలో ప్రకటనలు గుప్పిస్తరు. తర్వాత.. పక్కన పెడతరు” అని దుయ్యబట్టారు.
తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుతోనే ఇప్పుడు ఉద్యోగాలు కూడా వచ్చాయని తెలిపారు. ఆ మార్పుకు నాంది పలికిన నిరుద్యోగుల కలలు నెరవేరుస్తున్నామన్నారు. తెలంగాణ వచ్చిందే.. నిధులు-నియామకాల కోసమని. కానీ, ఈ విషయాన్ని కేసీఆర్ కుటుంబం తమకు ఆపాదించుకుని నిధులు-నియామకాలు అంటే తమ కుటుంబానికే అనుకుందని ఫలితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించలేదని దుయ్యబట్టారు.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం యువతకు పెద్ద పీట వేస్తోందని రేవంత్ చెప్పారు. త్వరలోనే చేపట్టనున్న రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణంలో ప్రస్తుతం ఇంజనీర్లుగా ఉద్యోగాలు పొందిన వారే కీలక పాత్ర పోషించనున్నారని చెప్పారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ, ఫార్మాసిటీలలోనూ యువ ఉద్యోగుల పాత్రం కీలకంగా మారనుందని వెల్లడించారు.
This post was last modified on October 6, 2024 9:12 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…