Political News

మోడీకి ఎదురు దెబ్బ‌.. హ‌రియాణాలో కాంగ్రెస్‌దే అధికారం!

తాజాగా రెండు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప్ర‌ధాన న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉన్న హ‌రియాణాలోనూ.. ప‌దేళ్ల త‌ర్వాత జ‌మ్ము క‌శ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నిక‌లు తాజాగా ముగిశాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ విజ‌యం ద‌క్కించుకోవ‌డం ద్వారా మోడీ త‌న హ‌వాను నిల‌బెట్టుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ఆయా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. అనేక ప‌థ‌కాలు కూడా ప్ర‌క‌టించారు. మొత్తం జ‌మ్మూ క‌శ్మీర్‌లో మూడు ద‌శ‌లు, హ‌రియాణాలో ఒక విడ‌తలోనూ పోలింగ్ జ‌రిగింది.

ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ఈ నెల 8న కేంద్ర ఎన్నిక‌ల సంఘం వెల్ల‌డించ‌నుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫ‌లితం రెండూ రానున్నాయి. అయితే.. ఈ రెండు రాష్ట్రాల ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన ద‌రిమిలా.. ఎగ్జిల్ పోల్స్ అంచ‌నాలు వెలువ‌డ్డాయి. వీటి ప్ర‌కారం.. బీజేపీ అధికారంలో ఉన్న హ‌రియాణాలో క‌మ‌ల నాధుల‌కు భారీ ఎదురు దెబ్బ‌త‌గిలే అవ‌కాశం ఉంద‌ని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. హ‌రియాణాలో కాంగ్రెస్ ఏక‌ప‌క్షంగా విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని సంస్థ‌లు పేర్కొన్నాయి. ఇది మోడీ స‌ర్కారుకు తీవ్ర సంక‌టంగా మార‌నుంది. ఎందుకంటే.. దీనికి ఆనుకుని ఉన్న ఢిల్లీలోనూ త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు రానున్నాయి.

ఢిల్లీలో హ‌రియాణా ఎన్నిక‌ల ఫ‌లితం తాలూకు ప్ర‌భావం ప‌డ‌నుంది. దీంతో ఇప్పుడు బీజేపీ నేత‌లు ఎగ్జిట్ పోల్స్‌పై మౌనం పాటి స్తున్నారు. ఇదిలావుంటే, జ‌మ్ము క‌శ్మీర్‌పైనా బీజేపీ అనేక ఆశ‌లు పెట్టుకుంది. ఉగ్ర‌వాదం నిర్మూల‌న‌, పాకిస్తాన్ దూకుడుకు బ్రేక్ వేసిన నేప‌థ్యంలో మోడీ హ‌వా జోరుగా ఉంటుంద‌ని క‌మ‌ల నాథులు భావించారు. కానీ, ఇక్కడ ప్ర‌జా తీర్పున‌కు సంబంధించి వ‌చ్చిన ఎగ్జిట్‌పోల్స్‌లో భిన్న‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. ఇక్క‌డ ఏ పార్టీకీ మెజారిటీ ద‌క్క‌డం లేదు. దీంతో జ‌మ్ము క‌శ్మీర్‌లో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని ఎగ్జిట్ పోల్సు చెబుతున్నాయి. ఇక్క‌డ‌.. ఏ ఒక్క పార్టీకీ మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని స‌ర్వేలు చాటి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

1) హ‌రియాణా(మొత్తం 90 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్: పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ – 55, బీజేపీ – 26. ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ – 1, సట్టా బజార్ సర్వే: కాంగ్రెస్ – 50, బీజేపీ – 25, ఏబీపీ-సీ ఓటర్ సర్వే: బీజేపీ – 78, కాంగ్రెస్ -8, న్యూస్ 18-ఐపీఎస్ఓఎస్ సర్వే: బీజేపీ – 75, కాంగ్రెస్ -10 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటాయ‌ని పేర్కొన్నాయి.

2) జమ్మూ కశ్మీర్ (మొత్తం 90 స్థానాలు) ఎగ్జిట్ పోల్స్‌: పీపుల్స్ పల్స్: జేకేఎన్ సీ(జ‌మ్ము క‌శ్మీర్ నేష‌న‌ల్ కాంగ్రెస్‌) -33-35, బీజేపీ 23-27, కాంగ్రెస్ 13-15, జేకే పీడీపీ 7-11, ఏఐపీ 1, ఇతరులు 4-5, రిపబ్లిక్ మాట్రిజ్ స‌ర్వే: బీజేపీ -25, కాంగ్రెస్ -12, ఎన్సీపీ- 15, పీడీపీ -28, ఇతరులు – 7 స్థానాలు ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. ఇక్క‌డ 46 స్థానాలు వ‌స్తే త‌ప్ప‌.. అధికారం ద‌క్కించుకునే అవ‌కాశం ఏ పార్టీకీ లేదు. దీంతో ఈ స‌ర్వేలు నిజ‌మైతే సంకీర్ణం ఖాయం.

This post was last modified on October 6, 2024 3:19 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రా మచ్చా వెనుక సోషల్ మీడియా రచ్చ

ఇటీవలే విడుదలైన గేమ్ ఛేంజర్ రెండో పాట 'రా మచ్చ రా' మీద సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది.…

27 mins ago

దేవర 2 వెనుక పెద్ద స్కెచ్చే ఉంది

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ అనుకున్నది సాధించేశారు. దేవర పార్ట్ 1 అంచనాలకు మించి విజయం సాధించడంతో వాళ్ళ…

2 hours ago

వంద రోజుల దగ్గరలో కల్కికో సమస్య

వెయ్యి కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడి విడుదలై…

4 hours ago

సూర్య కంగువ….24 కనెక్షన్ ?

బాహుబలి రేంజులో కోలీవుడ్ స్థాయిని పెంచుతుందని అక్కడి యావత్ పరిశ్రమ ఆశలు పెట్టుకున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. ఇప్పటికే…

5 hours ago

శ్రీకాకుళంలో వైసీపీ ధ‌ర్మాన చిచ్చు.. ఎప్ప‌టికి చ‌ల్లారునో.. !

అధికారంలో ఉన్న‌ప్పుడు అంతా నాదే అంటూ.. కొంద‌రు వైసీపీ నేత‌లు చెల‌రేగిపోయారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు అవ‌కాశం కూడా క‌ల్పించ‌లేదు. బ‌ల‌మైన…

5 hours ago

వీరయ్య నాయుడు స్ఫూర్తితో వైజాగ్ వాసు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆ మధ్య విభిన్నంగా ఏదైనా చేద్దామని ఒప్పుకున్న సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గని,…

7 hours ago