అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అంటూ.. కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో నాయకులకు అవకాశం కూడా కల్పించలేదు. బలమైన వర్గాలను కూడా పార్టీకి దూరం చేశారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పార్టీని నడిపించారు. అయితే.. వారు అనుకున్నట్టుగా.. వారు ఊహించుకున్న ట్టుగా.. ఎన్నికల ఫలితం రాలేదు. అంతా తలకిందలు అయిపోయింది. ఈ పరిణామం.. సదరు చక్రం తిప్పిన నాయకులకు ఎలా ఉన్నా.. పార్టీకి మాత్రం తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది.
ఇలాంటి పరిణామమే ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీలో కనిపిస్తోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడ చివరి రెండున్నరేళ్లు రెచ్చిపోయారు. అంతా తానే అయి చక్రం తిప్పారు. ఫలితంగా అప్పటి వరకు బలమైన వాయిస్ వినిపించిన నాయకులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇది గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గాల్లోనూ పార్టీని ఘోరంగా ఓడించింది. అయితే.. ఇప్పుడు అధికారం కోల్పోయింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ అధినేత నిర్ణయించుకున్నారు.
కానీ, సిక్కోలు వంటి జిల్లాల్లో ధర్మాన వంటి నాయకులను కొనసాగిస్తే.. తాము కొనసాగేది లేదని క్షేత్రస్థా యి నాయకులు చెబుతున్నారు. దీనికి కారణం.. ధర్మాన అనుసరించిన విధానాలేనని చెబుతున్నారు. జిల్లాలో అతి పెద్ద సామాజిక వర్గం కాళింగులకు అవకాశం ఇస్తే.. బలమైన ఎదుగుదల ఉంటుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ధర్మాన కు అవకాశం ఇవ్వడం.. ఆయన చెప్పినట్టే ఇంకా వినమని చెప్పడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
అంతేకాదు.. క్యాడర్ ఎవరితో సమన్వయం చేసుకోవాలో కూడా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ధర్మాన వైపే అందరూ ఉండే పరిస్థితి ఏర్పడిందని.. ఇది తమకు సుతరాము ఇష్టం లేదని నాయకులు తేల్చి చెబుతున్నారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన సీతయ్యకు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పజెబితే బాగుంటుందని అంటున్నారు. కానీ, సీతయ్యకు ధర్మానకు పడని కారణంగా.. జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిందన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. కేవలం తన స్వార్థం కోసం పనిచేసే ఇలాంటి వారిని పక్కన పెట్టాలని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. మరి జగన్ ఏమేరకు స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 5, 2024 9:56 pm
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…