అధికారంలో ఉన్నప్పుడు అంతా నాదే అంటూ.. కొందరు వైసీపీ నేతలు చెలరేగిపోయారు. క్షేత్రస్థాయిలో నాయకులకు అవకాశం కూడా కల్పించలేదు. బలమైన వర్గాలను కూడా పార్టీకి దూరం చేశారు. తాము చెప్పిందే వేదం అన్నట్టుగా పార్టీని నడిపించారు. అయితే.. వారు అనుకున్నట్టుగా.. వారు ఊహించుకున్న ట్టుగా.. ఎన్నికల ఫలితం రాలేదు. అంతా తలకిందలు అయిపోయింది. ఈ పరిణామం.. సదరు చక్రం తిప్పిన నాయకులకు ఎలా ఉన్నా.. పార్టీకి మాత్రం తీవ్ర ఇబ్బందిగా మారిపోయింది.
ఇలాంటి పరిణామమే ఇప్పుడు శ్రీకాకుళం వైసీపీలో కనిపిస్తోంది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇక్కడ చివరి రెండున్నరేళ్లు రెచ్చిపోయారు. అంతా తానే అయి చక్రం తిప్పారు. ఫలితంగా అప్పటి వరకు బలమైన వాయిస్ వినిపించిన నాయకులు కూడా పార్టీకి దూరమయ్యారు. ఇది గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నియోజకవర్గాల్లోనూ పార్టీని ఘోరంగా ఓడించింది. అయితే.. ఇప్పుడు అధికారం కోల్పోయింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని పార్టీ అధినేత నిర్ణయించుకున్నారు.
కానీ, సిక్కోలు వంటి జిల్లాల్లో ధర్మాన వంటి నాయకులను కొనసాగిస్తే.. తాము కొనసాగేది లేదని క్షేత్రస్థా యి నాయకులు చెబుతున్నారు. దీనికి కారణం.. ధర్మాన అనుసరించిన విధానాలేనని చెబుతున్నారు. జిల్లాలో అతి పెద్ద సామాజిక వర్గం కాళింగులకు అవకాశం ఇస్తే.. బలమైన ఎదుగుదల ఉంటుందని మెజారిటీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, ధర్మాన కు అవకాశం ఇవ్వడం.. ఆయన చెప్పినట్టే ఇంకా వినమని చెప్పడంతో నాయకులు తర్జన భర్జన పడుతున్నారు.
అంతేకాదు.. క్యాడర్ ఎవరితో సమన్వయం చేసుకోవాలో కూడా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి స్పష్టత లేకపోవడంతో ధర్మాన వైపే అందరూ ఉండే పరిస్థితి ఏర్పడిందని.. ఇది తమకు సుతరాము ఇష్టం లేదని నాయకులు తేల్చి చెబుతున్నారు. కళింగ సామాజిక వర్గానికి చెందిన సీతయ్యకు పూర్తిస్థాయి నాయకత్వ బాధ్యతలు అప్పజెబితే బాగుంటుందని అంటున్నారు. కానీ, సీతయ్యకు ధర్మానకు పడని కారణంగా.. జిల్లాలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారిందన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. కేవలం తన స్వార్థం కోసం పనిచేసే ఇలాంటి వారిని పక్కన పెట్టాలని మెజారిటీ నాయకులు చెబుతున్నారు. మరి జగన్ ఏమేరకు స్పందిస్తారో చూడాలి.
This post was last modified on October 5, 2024 9:56 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…