తిరుమల లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ హిందువులు ఆచరించే సనాతన ధర్మం గురించి చాలా బలంగా గళాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేవారిపై ఆయన విరుచుకుపడుతున్నారు. గట్టిగా హెచ్చరికలూ జారీ చేస్తున్నారు.
తాజాగా తిరుపతి సభలో ఆయన పరోక్షంగా డీఎంకే నేత, ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా విమర్శలు గుప్పించారు. కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను పవన్ ఉటంకించారు.
ఈ వ్యాఖ్యలపై డీఎంకే నుంచి స్పందన వచ్చింది. తాజాగా మీడియా వాళ్లు ఉదయనిధిని స్పందించమని కోరగా.. ఆయన. వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం దాటవేశారు. కాగా డీఎంకే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుసగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే ఆ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన విషయం మరిచిపోరాదంటూ బీజేపీపై కౌంటర్ వేశారు ఇళంగోవన్.
తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ అన్నారు.
ఇటీవల చెన్నైకి వెళ్లి ఓఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ తమిళనాడు గురించి, అక్కడి రాజకీయాల గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తూనే సనాతన ధర్మాన్ని కాపాడాలని అక్కడి నేతలకు పిలుపునిచ్చారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…