Political News

ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు డీఎంకే కౌంట‌ర్

తిరుమ‌ల ల‌డ్డు వివాదం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందువులు ఆచ‌రించే స‌నాత‌న ధ‌ర్మం గురించి చాలా బ‌లంగా గ‌ళాన్ని వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌నాత‌న ధ‌ర్మాన్ని త‌క్కువ చేసి మాట్లాడేవారిపై ఆయ‌న విరుచుకుప‌డుతున్నారు. గ‌ట్టిగా హెచ్చ‌రిక‌లూ జారీ చేస్తున్నారు.

తాజాగా తిరుప‌తి స‌భ‌లో ఆయ‌న ప‌రోక్షంగా డీఎంకే నేత, ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ మీద కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్‌తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప‌వ‌న్ ఉటంకించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై డీఎంకే నుంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మీడియా వాళ్లు ఉదయ‌నిధిని స్పందించ‌మ‌ని కోర‌గా.. ఆయ‌న‌. వెయిట్ అండ్ సీ అంటూ స‌మాధానం దాట‌వేశారు. కాగా డీఎంకే పార్టీ నేత‌లు ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తున్నారు.

తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుసగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.

సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే ఆ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన విష‌యం మ‌రిచిపోరాదంటూ బీజేపీపై కౌంట‌ర్ వేశారు ఇళంగోవ‌న్.

తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ అన్నారు.

ఇటీవ‌ల చెన్నైకి వెళ్లి ఓఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప‌వ‌న్ త‌మిళ‌నాడు గురించి, అక్క‌డి రాజ‌కీయాల గురించి సానుకూల వ్యాఖ్య‌లు చేస్తూనే స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడాల‌ని అక్క‌డి నేత‌లకు పిలుపునిచ్చారు.

This post was last modified on October 5, 2024 4:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

3 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

19 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago