తిరుమల లడ్డు వివాదం తర్వాత పవన్ కళ్యాణ్ హిందువులు ఆచరించే సనాతన ధర్మం గురించి చాలా బలంగా గళాన్ని వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడేవారిపై ఆయన విరుచుకుపడుతున్నారు. గట్టిగా హెచ్చరికలూ జారీ చేస్తున్నారు.
తాజాగా తిరుపతి సభలో ఆయన పరోక్షంగా డీఎంకే నేత, ప్రస్తుత తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మీద కూడా విమర్శలు గుప్పించారు. కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను పవన్ ఉటంకించారు.
ఈ వ్యాఖ్యలపై డీఎంకే నుంచి స్పందన వచ్చింది. తాజాగా మీడియా వాళ్లు ఉదయనిధిని స్పందించమని కోరగా.. ఆయన. వెయిట్ అండ్ సీ అంటూ సమాధానం దాటవేశారు. కాగా డీఎంకే పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పవన్ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు.
తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుసగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.
సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే ఆ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసిన విషయం మరిచిపోరాదంటూ బీజేపీపై కౌంటర్ వేశారు ఇళంగోవన్.
తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ అన్నారు.
ఇటీవల చెన్నైకి వెళ్లి ఓఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ తమిళనాడు గురించి, అక్కడి రాజకీయాల గురించి సానుకూల వ్యాఖ్యలు చేస్తూనే సనాతన ధర్మాన్ని కాపాడాలని అక్కడి నేతలకు పిలుపునిచ్చారు.
This post was last modified on October 5, 2024 4:36 pm
ఏపీలో టీడీపీ నాయకులు దారి తప్పుతున్నారన్న విషయంపై సమీక్షలు చేయడం.. వారిపై సీరియస్ అయినట్టుగా ఒక ప్రకటన విడుదల చేయడం..…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ప్రస్తుత పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రైట్ హ్యాండ్స్గా భావిస్తున్న ఇద్దరు కీలక…
ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…
పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…
పెంపుడు జంతువుల పట్ల యజమానులు, కుటుంబ సభ్యులు ఎంత ప్రేమను పెంచుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయా జంతువులు…
ఒకప్పుడు పాత సినిమాల పాటలను యథేచ్ఛగా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవరికీ ఏ అభ్యంతరాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…