Political News

ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు డీఎంకే కౌంట‌ర్

తిరుమ‌ల ల‌డ్డు వివాదం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందువులు ఆచ‌రించే స‌నాత‌న ధ‌ర్మం గురించి చాలా బ‌లంగా గ‌ళాన్ని వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. స‌నాత‌న ధ‌ర్మాన్ని త‌క్కువ చేసి మాట్లాడేవారిపై ఆయ‌న విరుచుకుప‌డుతున్నారు. గ‌ట్టిగా హెచ్చ‌రిక‌లూ జారీ చేస్తున్నారు.

తాజాగా తిరుప‌తి స‌భ‌లో ఆయ‌న ప‌రోక్షంగా డీఎంకే నేత, ప్ర‌స్తుత త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ మీద కూడా విమ‌ర్శ‌లు గుప్పించారు. కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, కొందరు వైరస్‌తో పోల్చారని.. ఇటువంటివి సరికాదంటూ ఉదయ్ నిధి స్టాలిన్ వ్యాఖ్యలను ప‌వ‌న్ ఉటంకించారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై డీఎంకే నుంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా మీడియా వాళ్లు ఉదయ‌నిధిని స్పందించ‌మ‌ని కోర‌గా.. ఆయ‌న‌. వెయిట్ అండ్ సీ అంటూ స‌మాధానం దాట‌వేశారు. కాగా డీఎంకే పార్టీ నేత‌లు ఒక్కొక్క‌రుగా ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై స్పందిస్తున్నారు.

తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డీఎంకే నేతలు వరుసగా స్టేట్మెంట్లు ఇచ్చారు. మతం పేరుతో మూఢనమ్మకాలు, మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డీఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు.

సనాతన ధర్మం గురించి మాట్లాడే వారు సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నుండి తుడిచిపెట్టుకుపోయారని, డీఎంకే ఆ ఎన్నిక‌ల్లో క్లీన్‌స్వీప్ చేసిన విష‌యం మ‌రిచిపోరాదంటూ బీజేపీపై కౌంట‌ర్ వేశారు ఇళంగోవ‌న్.

తాము అందరికీ సమాన హక్కులు ఉండాలని మాట్లాడుతున్నామని, మనుధర్మం గురించి మాట్లాడే వారు ఏ కులానికి చెందిన వారైనా ఆలయాల్లో పూజారులుగా ఉండేందుకు వీలు కల్పించే చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేయాలని ఇళంగోవన్ అన్నారు.

ఇటీవ‌ల చెన్నైకి వెళ్లి ఓఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ప‌వ‌న్ త‌మిళ‌నాడు గురించి, అక్క‌డి రాజ‌కీయాల గురించి సానుకూల వ్యాఖ్య‌లు చేస్తూనే స‌నాత‌న ధ‌ర్మాన్ని కాపాడాల‌ని అక్క‌డి నేత‌లకు పిలుపునిచ్చారు.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

50 minutes ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

2 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

4 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

5 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

6 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

7 hours ago