రాష్ట్రంలో రెడ్ బుక్కుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్కు మాత్రమే పరిమితమైంది. ఆయన తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అనే పదాన్ని ప్రయోగించడంతోపాటు.. పుస్తకాన్ని కూడా పరిచయం చేశారు.
అదే ఇప్పటికీ.. ఎక్కడ ఏకేసు పెట్టినా వినిపిస్తోంది. ఇక, టీడీపీలోనే మరో నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా తన దగ్గర కూడా రెడ్ బుక్కు ఉందని.. దానిలోనూ వందకు పైగా పేర్లు ఉన్నాయని కొన్నాళ్ల కిందట ఆరోపించారు.
అయితే.. భూమా రెడ్ బుక్ వ్యవహారం చప్పబడింది. దానిపై ఎవరూ కామెంట్లు చేయలేదు. అయితే.. నారా లోకేష్ రెడ్ బుక్ మాత్రం తరచుగా లైవ్లోనే ఉంది. ఆయన కూడా ఎక్కడ సందర్భం వచ్చినా.. ఔను నా దగ్గర రెడ్బుక్ ఉందనే చెబుతున్నారు. దానిలో ఐపీఎస్లు, ఐఏఎస్ల పేర్లు కూడా ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఈ బుక్ వివాదం ఇలా ఉంటే, ఇప్పుడు వైసీపీ కూడా రెడ్ బుక్కులు తెరవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.
వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ రెడ్ బుక్లు మెయింటెన్ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ బుక్లోని ప్రతి ఒక్కరికీ బుద్ధి చెప్పేలా(అంటే శిక్షించేలా) జగన్ చర్యలు తీసుకుంటా రని కూడా చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ కూడా ఇక రెడ్ బుక్కులు ప్రారంభించనుందన్న చర్చ మొదలైంది. అయితే.. సజ్జల వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? అనేది చర్చ.
ఎందుకంటే.. కూటమి సర్కారు వచ్చి మూడు మాసాలు మాత్రమే అయింది. ఇంతలోనే వైసీపీ రెడ్ బు క్కుల మాట మాట్లాడితే.. ప్రజలు హర్షించే అవకాశం లేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న మీరు.. ఇప్పుడు ఇలా వ్యవహరిస్తారా? అనే చర్చ కూడా తెరమీదికి వస్తుంది. కానీ, ఇప్పుడు సజ్జల వ్యాఖ్యల అంతరార్థం.. తమ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో జోష్ నింపేందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఇంకా సమయం ఉందని.. అప్పటికి ఈ విషయం తెరమరుగైనా కావొచ్చని అంటున్నారు. కానీ, తీవ్ర నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ను ఏదో ఒక విధంగా గాడిలో పెట్టేందుకు సజ్జల ఇలా రెడ్ బుక్ ప్లాన్ చేసి ఉంటారని.. తద్వారా కేడర్ పుంజుకుంటుం దని ఆయన ఆశించి ఉంటారని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…