రాష్ట్రంలో రెడ్ బుక్కుల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఒకప్పుడు ఇది టీడీపీ యువ నాయకుడు, ప్రస్తుత మంత్రి నారా లోకేష్కు మాత్రమే పరిమితమైంది. ఆయన తన యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ అనే పదాన్ని ప్రయోగించడంతోపాటు.. పుస్తకాన్ని కూడా పరిచయం చేశారు.
అదే ఇప్పటికీ.. ఎక్కడ ఏకేసు పెట్టినా వినిపిస్తోంది. ఇక, టీడీపీలోనే మరో నాయకురాలు, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కూడా తన దగ్గర కూడా రెడ్ బుక్కు ఉందని.. దానిలోనూ వందకు పైగా పేర్లు ఉన్నాయని కొన్నాళ్ల కిందట ఆరోపించారు.
అయితే.. భూమా రెడ్ బుక్ వ్యవహారం చప్పబడింది. దానిపై ఎవరూ కామెంట్లు చేయలేదు. అయితే.. నారా లోకేష్ రెడ్ బుక్ మాత్రం తరచుగా లైవ్లోనే ఉంది. ఆయన కూడా ఎక్కడ సందర్భం వచ్చినా.. ఔను నా దగ్గర రెడ్బుక్ ఉందనే చెబుతున్నారు. దానిలో ఐపీఎస్లు, ఐఏఎస్ల పేర్లు కూడా ఉన్నాయని బహిరంగంగానే చెబుతున్నారు. ఇదిలావుంటే.. ఈ బుక్ వివాదం ఇలా ఉంటే, ఇప్పుడు వైసీపీ కూడా రెడ్ బుక్కులు తెరవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం గమనార్హం.
వైసీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ సలహాదారు.. సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా మాట్లాడుతూ.. పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ రెడ్ బుక్లు మెయింటెన్ చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ బుక్లోని ప్రతి ఒక్కరికీ బుద్ధి చెప్పేలా(అంటే శిక్షించేలా) జగన్ చర్యలు తీసుకుంటా రని కూడా చెప్పుకొచ్చారు. దీంతో రాష్ట్రంలో వైసీపీ కూడా ఇక రెడ్ బుక్కులు ప్రారంభించనుందన్న చర్చ మొదలైంది. అయితే.. సజ్జల వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? అనేది చర్చ.
ఎందుకంటే.. కూటమి సర్కారు వచ్చి మూడు మాసాలు మాత్రమే అయింది. ఇంతలోనే వైసీపీ రెడ్ బు క్కుల మాట మాట్లాడితే.. ప్రజలు హర్షించే అవకాశం లేదు. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న మీరు.. ఇప్పుడు ఇలా వ్యవహరిస్తారా? అనే చర్చ కూడా తెరమీదికి వస్తుంది. కానీ, ఇప్పుడు సజ్జల వ్యాఖ్యల అంతరార్థం.. తమ పార్టీలో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో జోష్ నింపేందుకే ఇలా వ్యాఖ్యానించి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి ఇంకా సమయం ఉందని.. అప్పటికి ఈ విషయం తెరమరుగైనా కావొచ్చని అంటున్నారు. కానీ, తీవ్ర నిస్తేజంలో ఉన్న వైసీపీ క్యాడర్ను ఏదో ఒక విధంగా గాడిలో పెట్టేందుకు సజ్జల ఇలా రెడ్ బుక్ ప్లాన్ చేసి ఉంటారని.. తద్వారా కేడర్ పుంజుకుంటుం దని ఆయన ఆశించి ఉంటారని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం.
This post was last modified on October 5, 2024 11:19 am
వాహనదారులకు షాకిచ్చేలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రహదారులపై ట్రాఫిక్ రూల్స్కు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ..…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్లు.. మూడు రోజుల సంక్రాంతి పండుగను పురస్కరించుకుని వారి సొంత ఊరు వెళ్లేందుకు…
రాష్ట్రంలో అభివృద్ది చేసే విషయంలో ఎవరు ఎన్ని విధాల అడ్డు పడినా.. తాము ముందుకు సాగుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…
2026 బడ్జెట్ ద్వారా నిర్మలా సీతారామన్ టీమ్ ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన…
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో టీమ్ ఇండియాకు ఊహించని మార్పు చోటుచేసుకుంది. గాయంతో దూరమైన ఆల్ రౌండర్…
ప్రజల కోసం తాను ఒక్కరోజు కూడా సెలవుతీసుకోకుండా.. అవిశ్రాంతంగా పనిచేస్తున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ…