Political News

నందిగం సురేష్‌కు బెయిల్‌.. ఎన్ని ష‌ర‌తులంటే!

వైసీపీ కీల‌క నాయ‌కుడు, బాప‌ట్ల‌ మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్ర‌స్తుతం గుంటూరు జైల్లో ఉన్న ఆయ‌న‌కు హైకోర్టు కొంత మేర‌కు రిలీఫ్ ఇచ్చింది. అయితే.. అనేక ష‌రతులు విధించింది. మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై 2021లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు దాడి చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కార్యాల‌యం ధ్వంస‌మైంది. దీనిపై అప్ప‌ట్లోనే కేసులు న‌మోదు చేసినా కీల‌క వ్య‌క్తుల‌ను మాత్రం పక్క‌న పెట్టారు. ఈ క్ర‌మంలో తాజాగా కూట‌మి స‌ర్కారు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని మ‌రిన్ని కేసులు న‌మోదు చేసింది.

ఈ నేప‌థ్యంలోనే మాజీ ఎంపీ నందిగం సురేష్ స‌హా 30 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు. వీరిని మాజీ సీఎం వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా ప‌రామ‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇదే కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి ర‌మేష్‌, వైసీపీ యువ నేత దేవినేని అవినాష్ చౌద‌రి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స‌హా మ‌రికొంద‌రు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ తెచ్చుకున్నారు. ప్ర‌స్తుతం వీరిపై ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే.. జైల్లో ఉన్న నందిగం సురేష్ స‌హా.. విజ‌య‌వాడ డిప్యూటీ మేయ‌ర్ అవుతు శైల‌జ భ‌ర్త అవుతు శ్రీనివాస‌రెడ్డిల‌ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు.

కొన్నాళ్ల కింద‌టే వీరు త‌మ‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని ఏపీ హైకోర్టును అభ్య‌ర్థించారు. ఈ క్ర‌మంలో ప‌లు మార్లు వాద ప్ర‌తివాద‌న‌లు విన్న హైకోర్టు తాజాగా వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే.. ప‌లు ష‌ర‌తులు విధించింది. రూ.15 పూచీక‌త్తులు రెండు స‌మ‌ర్పించాల‌ని సూచించింది. అదేవిధంగా ఈ కేసులో చార్జిషీట్ దాఖ‌ల‌య్యే వ‌ర‌కు 1, 15 తారీకుల్లో సంబంధిత పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి సంత‌కం చేయాల‌ని నిర్దేశించింది. అంతేకాదు.. విచార‌ణాధికారి ఎప్పుడు పిలిస్తే అప్ప‌డు ద‌ర్యాప్తునకు స‌హ‌క‌రించాల‌ని కూడా ష‌ర‌తు విధించింది. పాస్ పోర్టును పోలీసుల‌కు అందించాల‌ని.. విదేశాల‌కు వెళ్ల‌రాద‌ని పేర్కొంది.

అదేవిధంగా సాక్షుల‌ను ప్ర‌భావితం చేయ‌రాద‌ని మాజీ ఎంపీ నందిగం సురేష్‌, అవుతు శ్రీనివాస‌రెడ్డికి కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఇక‌పై ఇలాంటి నేరాల్లో పాలు పంచుకోరాద‌ని, క‌నీసం వాటి ఊసు కూడా ఎత్తరాద‌ని పేర్కొంది.తాజా కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను ఎక్క‌డా వెల్ల‌డించరాద‌ని కూడా ష‌రతుల్లో పేర్కొంది. ఈ మేర‌కు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ కృపాసాగ‌ర్ త‌న తీర్పులో పేర్కొన్నారు. కాగా, శ‌నివారం మ‌ధ్యాహ్నం నాటికి నందిగం సురేష్ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

This post was last modified on October 4, 2024 10:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

2 minutes ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

18 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

1 hour ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago