వైసీపీ కీలక నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్న ఆయనకు హైకోర్టు కొంత మేరకు రిలీఫ్ ఇచ్చింది. అయితే.. అనేక షరతులు విధించింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021లో వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కార్యాలయం ధ్వంసమైంది. దీనిపై అప్పట్లోనే కేసులు నమోదు చేసినా కీలక వ్యక్తులను మాత్రం పక్కన పెట్టారు. ఈ క్రమంలో తాజాగా కూటమి సర్కారు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరిన్ని కేసులు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ నందిగం సురేష్ సహా 30 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. వీరిని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ కూడా పరామర్శించిన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జోగి రమేష్, వైసీపీ యువ నేత దేవినేని అవినాష్ చౌదరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సహా మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం వీరిపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే.. జైల్లో ఉన్న నందిగం సురేష్ సహా.. విజయవాడ డిప్యూటీ మేయర్ అవుతు శైలజ భర్త అవుతు శ్రీనివాసరెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి జైల్లో ఉంచారు.
కొన్నాళ్ల కిందటే వీరు తమకు బెయిల్ మంజూరు చేయాలని ఏపీ హైకోర్టును అభ్యర్థించారు. ఈ క్రమంలో పలు మార్లు వాద ప్రతివాదనలు విన్న హైకోర్టు తాజాగా వీరికి బెయిల్ మంజూరు చేసింది. అయితే.. పలు షరతులు విధించింది. రూ.15 పూచీకత్తులు రెండు సమర్పించాలని సూచించింది. అదేవిధంగా ఈ కేసులో చార్జిషీట్ దాఖలయ్యే వరకు 1, 15 తారీకుల్లో సంబంధిత పోలీసు స్టేషన్కు వెళ్లి సంతకం చేయాలని నిర్దేశించింది. అంతేకాదు.. విచారణాధికారి ఎప్పుడు పిలిస్తే అప్పడు దర్యాప్తునకు సహకరించాలని కూడా షరతు విధించింది. పాస్ పోర్టును పోలీసులకు అందించాలని.. విదేశాలకు వెళ్లరాదని పేర్కొంది.
అదేవిధంగా సాక్షులను ప్రభావితం చేయరాదని మాజీ ఎంపీ నందిగం సురేష్, అవుతు శ్రీనివాసరెడ్డికి కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఇకపై ఇలాంటి నేరాల్లో పాలు పంచుకోరాదని, కనీసం వాటి ఊసు కూడా ఎత్తరాదని పేర్కొంది.తాజా కేసుకు సంబంధించిన వివరాలను ఎక్కడా వెల్లడించరాదని కూడా షరతుల్లో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ తన తీర్పులో పేర్కొన్నారు. కాగా, శనివారం మధ్యాహ్నం నాటికి నందిగం సురేష్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
This post was last modified on October 4, 2024 10:26 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…