ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రులు హరీష్రావు, కేటీఆర్లపై సైబరాబాద్ పోలీసు స్టేషన్లో గురువారం అర్ధరాత్రి కేసులు నమోదయ్యాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందనరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం. అంతేకాదు.. దర్యాప్తును ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. గురువారం రాత్రి రఘునందనరావు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
గత నాలుగు రోజులుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ రఘునందనరావుతో కలిసిఆమె పాల్గొన్న కార్యక్రమంలో సురేఖను రఘునందనరావు నూలుతో తయారు చేసిన మాల వేసి సత్కరించారు. ఈ ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమంలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేశారు. దీనిపై మొదలైన రగడ.. పెను దుమారంగా మారి.. పెద్ద పొలిటికల్ సునామీగా అవతరించింది.
అయితే.. అసలు ఈ ఫొటోలను మార్ఫింగ్ చేయించింది.. ప్రచారం చేయిస్తున్నది కూడా.. కేటీఆర్, హరీష్ రావులేనని పేర్కొంటూ ఎంపీ రఘునందనరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఈ వార్తలకు సొంత వ్యాఖ్యానాలు జోడించి ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లపైనా రఘునందన రావు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రులు ఇద్దరిపైనా, యూట్యూబ్ చానెళ్ల బాధ్యులపైనా సైబరాబా ద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నేడు ధర్నాలకు పిలుపు
గురువారం అర్ధరాత్రి నమోదైన కేసులపై బీఆర్ ఎస్ నాయకత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా హరీష్రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సహా వరంగల్ జిల్లాలోనూ ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
This post was last modified on October 4, 2024 10:31 am
తొంభై దశకంలో మాస్ హీరోగా తిరుగులేకుండా దూసుకుపోతున్న టైంలో బాలకృష్ణకు విలన్ గా నటించిన మోహన్ రాజ్ అలియాస్ కీరికదన్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది…
ఒక వివాదం చెలరేగినప్పుడు వెంటనే స్పందించడం అనేది ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ కనిపిస్తోంది. ముఖ్యమంత్రులే ఆయా…
రాజమౌళితో ఏ హీరో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినా అతని తర్వాత సినిమా ఖచ్చితంగా డిజాస్టరవుతుందనే సెంటిమెంట్ ఇప్పటిదాకా…
బీఆర్ ఎస్ నాయకురాలు, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫామ్…
మొన్న తెలంగాణ మంత్రి కొండా సురేఖ రేపిన వివాదం ఎంత దూరం వెళ్లిందో చూస్తున్నాం. నాగార్జున ముందు క్షమాపణ కోరడంతో…