ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రులు హరీష్రావు, కేటీఆర్లపై సైబరాబాద్ పోలీసు స్టేషన్లో గురువారం అర్ధరాత్రి కేసులు నమోదయ్యాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందనరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం. అంతేకాదు.. దర్యాప్తును ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. గురువారం రాత్రి రఘునందనరావు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
గత నాలుగు రోజులుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ రఘునందనరావుతో కలిసిఆమె పాల్గొన్న కార్యక్రమంలో సురేఖను రఘునందనరావు నూలుతో తయారు చేసిన మాల వేసి సత్కరించారు. ఈ ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమంలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేశారు. దీనిపై మొదలైన రగడ.. పెను దుమారంగా మారి.. పెద్ద పొలిటికల్ సునామీగా అవతరించింది.
అయితే.. అసలు ఈ ఫొటోలను మార్ఫింగ్ చేయించింది.. ప్రచారం చేయిస్తున్నది కూడా.. కేటీఆర్, హరీష్ రావులేనని పేర్కొంటూ ఎంపీ రఘునందనరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఈ వార్తలకు సొంత వ్యాఖ్యానాలు జోడించి ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లపైనా రఘునందన రావు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రులు ఇద్దరిపైనా, యూట్యూబ్ చానెళ్ల బాధ్యులపైనా సైబరాబా ద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నేడు ధర్నాలకు పిలుపు
గురువారం అర్ధరాత్రి నమోదైన కేసులపై బీఆర్ ఎస్ నాయకత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా హరీష్రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సహా వరంగల్ జిల్లాలోనూ ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
This post was last modified on October 4, 2024 10:31 am
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్స్(డీజీ)గా పదోన్నతి కల్పించింది. వీరిలో మహేశ్ భగవత్, స్వాతి లక్రా,…