ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ మాజీ మంత్రులు హరీష్రావు, కేటీఆర్లపై సైబరాబాద్ పోలీసు స్టేషన్లో గురువారం అర్ధరాత్రి కేసులు నమోదయ్యాయి. మెదక్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ నాయకుడు రఘునందనరావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇద్దరు మాజీ మంత్రులపైనా కేసులు నమోదు చేయడం గమనార్హం. అంతేకాదు.. దర్యాప్తును ప్రత్యేక బృందాలను కూడా నియమించారు. గురువారం రాత్రి రఘునందనరావు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు.
గత నాలుగు రోజులుగా తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎంపీ రఘునందనరావుతో కలిసిఆమె పాల్గొన్న కార్యక్రమంలో సురేఖను రఘునందనరావు నూలుతో తయారు చేసిన మాల వేసి సత్కరించారు. ఈ ఫొటోలను కొందరు సామాజిక మాధ్యమంలో మార్ఫింగ్ చేసి అభ్యంతరకర రీతిలో ప్రచారం చేశారు. దీనిపై మొదలైన రగడ.. పెను దుమారంగా మారి.. పెద్ద పొలిటికల్ సునామీగా అవతరించింది.
అయితే.. అసలు ఈ ఫొటోలను మార్ఫింగ్ చేయించింది.. ప్రచారం చేయిస్తున్నది కూడా.. కేటీఆర్, హరీష్ రావులేనని పేర్కొంటూ ఎంపీ రఘునందనరావు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. అంతేకాదు.. ఈ వార్తలకు సొంత వ్యాఖ్యానాలు జోడించి ప్రసారం చేసిన పలు యూట్యూబ్ ఛానెళ్లపైనా రఘునందన రావు ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ మంత్రులు ఇద్దరిపైనా, యూట్యూబ్ చానెళ్ల బాధ్యులపైనా సైబరాబా ద్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
నేడు ధర్నాలకు పిలుపు
గురువారం అర్ధరాత్రి నమోదైన కేసులపై బీఆర్ ఎస్ నాయకత్వం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా శుక్రవారం ధర్నాలకు, నిరసనలకు పిలుపునిచ్చింది. ముఖ్యంగా హరీష్రావు, కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో నిరసనలు నిర్వహించనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ సహా వరంగల్ జిల్లాలోనూ ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
This post was last modified on October 4, 2024 10:31 am
చరిత్రలో ముందు నుంచీ మహిళా దర్శకురాళ్లు తెలుగులోనే కాదు ఏ భాషలో అయినా తక్కువే. కేవలం విజయనిర్మల గారు ఒక్కరే…
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…