మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శించే క్రమంలోనే మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో నాగ చైతన్య, సీనియర్ హీరో నాగార్జునల పేర్లను ప్రస్తావిస్తూ వారి వ్యక్తిగత జీవితానికి, పరువు ప్రతిష్టలకు భంగం కలిగేలా సురేఖ చేసిన కామెంట్లు ఇటు ఏపీ, తెలంగాణ రాజకీయాలతోపాటు టాలీవుడ్ నూ కుదిపేశాయి. దీంతో, సురేఖ వ్యాఖ్యలపై సమంత, నాగార్జున, నాగ చైతన్య, అమల, అఖిల్, టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హీరో నాని, నటుడు ప్రకాష్ రాజ్, మాజీ మంత్రి రోజాతో పాటు పలువురు తీవ్రంగా మండిపడ్డారు.
ఈ క్రమంలోనే తాజాగా కొండా సురేఖ తన వ్యాఖ్యలపై స్పందించారు. సమంతను ఉద్దేశిస్తూ సురేఖ తాజాగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే తన ఉద్దేశ్యమని సురేఖ వివరణనిచ్చే ప్రయత్నం చేశారు. సమంత మనోభావాలను దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదని సమంతనుద్దేశించి సురేఖ ట్వీట్ చేశారు. స్వయంశక్తితో సమంత ఎదిగిన తీరు తనకు ఆదర్శప్రాయమని సురేఖ అన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంతగానీ, సమంత అభిమానులుగానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా తన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నానని సురేఖ పోస్ట్ చేశారు.
సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సురేఖపై బీఆర్ఎస్ శ్రేణులతోపాటు, సమంత, నాగ చైతన్య, నాగార్జున, అఖిల్ అభిమానులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక మహిళా మంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా సమంత గురించి అటువంటి ఆరోపణలు చేయడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on October 3, 2024 10:05 am
ఆంధ్రకింగ్ తాలూకా తర్వాత ఆరు నెలలు గ్యాప్ తీసుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ ఫైనల్ గా కొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు.…
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మహానాడు అంటే ఉద్వేగ భరితమైన వేదిక. పార్టీ విధానాలు, భవిష్యత్ దిశ, నాయకత్వ సందేశం కార్యకర్తలకు…
అనుకున్నంతా అయ్యింది. పెట్రోల్, డిజిల్ ధరలు భారీగా పెరుగుతాయంటూ గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం శుక్రవారంతో నిజమయ్యాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం…
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న మూడో తరం వారసుడు జయకృష్ణ కొత్త సినిమా శ్రీనివాస మంగాపురం షూటింగ్ పూర్తయ్యే స్టేజికు…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…