ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, మోపీదేవి వెంకటరమణలు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా ఉన్నా వారు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం మూడు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ మూడు పదవులు దక్కేది ఎవరికి ? చంద్రబాబు దృష్టిలో ఎవరు ఉన్నారు ? అన్న చర్చ జోరుగా నడుస్తున్నది.
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల నుండి నామినేటెడ్ పదవుల వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కోటా ప్రాతిపదికన చంద్రబాబు పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పదవులు కూడా రెండు టీడీపీ, ఒకటి జనసేనకు అన్న ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల ఎన్నికల్లో సీనియర్ టీడీపీ నేతలు యనమల రామక్రిష్ణుడు, దేవినేని ఉమ, అశోక గజపతి రాజులకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఇద్దరికి టీడీపీ నుండి అవకాశం ఉంటుందని అంటున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక జనసేన తరపున ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్ కు త్యాగం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం లభిస్తుందని తెలుస్తుంది.
This post was last modified on October 1, 2024 1:07 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…