ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో మారిన రాజకీయ పరిస్థితులలో రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, మోపీదేవి వెంకటరమణలు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. పదవీకాలం ఇంకా ఉన్నా వారు రాజీనామాలు చేయడంతో ప్రస్తుతం మూడు రాజ్యసభ పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ మూడు పదవులు దక్కేది ఎవరికి ? చంద్రబాబు దృష్టిలో ఎవరు ఉన్నారు ? అన్న చర్చ జోరుగా నడుస్తున్నది.
కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవుల నుండి నామినేటెడ్ పదవుల వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కోటా ప్రాతిపదికన చంద్రబాబు పదవులను భర్తీ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూడు పదవులు కూడా రెండు టీడీపీ, ఒకటి జనసేనకు అన్న ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇటీవల ఎన్నికల్లో సీనియర్ టీడీపీ నేతలు యనమల రామక్రిష్ణుడు, దేవినేని ఉమ, అశోక గజపతి రాజులకు అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఇద్దరికి టీడీపీ నుండి అవకాశం ఉంటుందని అంటున్నారు. వీరితో పాటు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక జనసేన తరపున ఇటీవల ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్ కు త్యాగం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు అవకాశం లభిస్తుందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…