చెరువులు, కుంటలు, సరస్సులను ఆక్రమించి లేదా.. వాటిని పూర్తిస్థాయిలో పారనివ్వకుండా భూమిని ఆక్రమించి చేసిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శనివారం, ఆదివారం లక్షిత ప్రాంతాల్లో హైడ్రా దూకుడు ప్రదర్శి స్తోంది.
అయితే.. తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ శనివారం, ఆదివారం కొంత దూకుడు తగ్గించింది. అంతేకా దు.. చాలా రోజుల తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి భవనాన్నీ కూల్చి వేస్తామని చెప్పారు.
తమ టార్గెట్ పెద్దలేనని చెప్పిన రంగనాథ్.. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. అవన్నీ రాజకీయ పరమైనవని, వాటితో తమకు సంబంధం లేదని చెప్పారు.
అయితే.. ఒవైసీ మెడికల్ కాలేజీ సహా.. మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డిల కాలేజీలను కూడా కూల్చి వేస్తామని చెప్పా రు. ఇప్పటికే వీటికి నోటీసులు పంపించామని, ప్రస్తుతం విద్యాసంవత్సరం మధ్యలో ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు కూల్చి వేస్తే.. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని అందుకే కొంత సమయం వేచి చూస్తున్నట్టు రంగనాథ్ తెలిపారు.
పేదల ఇళ్లను కూల్చివేయాలన్నది తమ లక్ష్యం కాదని రంగనాథ్ చెప్పారు. అయితే.. విల్లాలను నిర్మించింది మాత్రం పెద్దలేనని.. అందుకే వాటిని కూల్చేస్తున్నట్టు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని.. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటా మని చెప్పారు.
ఇక, కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జువ్వాడ ఫామ్ హౌస్పైనా రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జువ్వాడ తమ పరిధిలో లేదన్నారు. అంతేకాదు.. ఆ ప్రాంతం జీవో 111 పరిధిలో ఉందని తెలిపారు. ఇది హైడ్రా పరిధిలో లేదని కాబట్టి.. తమకు సంబంధం లేదని చెప్పారు. చట్ట ప్రకారం.. ప్రభుత్వ ఆదేశాలు, కోర్టు నిర్దేశాల ప్రకారం నడుచుకుంటామని ఆయన వివరించారు.
This post was last modified on September 29, 2024 3:20 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…