Political News

వారసుడికి పట్టాభిషేకం చేస్తున్న సీఎం స్టాలిన్

అధినేత ఎవరైనా తమ రాజకీయ వారసుడికి పట్టాభిషేకం చేసే విషయంలో ఒకేలా వ్యవహరిస్తుంటారు. అందుకు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారెవరైనా తమ సంతానాన్ని తమ స్థాయికి తీసుకెళ్లేందుకు వీలుగా రంగం సిద్దం చేస్తుంటారు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు సీఎం స్టాలిన్. తన కొడుకు ఉదయనిధి మారన్ ను తమిళనాడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా చేసేందుకు వీలుగా ముహుర్తాన్ని నిర్ణయించారు.

నిజానికి ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలన్న డిమాండ్ డీఎంకే శ్రేణుల నుంచి ఎప్పటి నుంచో ఉంది. పలుమార్లు ఆయన్ను డిప్యూటీ సీఎంగా చేస్తారన్న ప్రచారం సాగింది. ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికి డీఎంకే శ్రేణుల కల నెరవేరనుంది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఉదయనిది ప్రమాణస్వీకారం జరగనుంది. తాజాగా సీఎం స్టాలిన్ మంత్రి వర్గాన్ని పునర్ వ్యవస్థీకరించేందుకు వీలుగా గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలిపారు. ఇదే విషయాన్ని రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం ఉదయనిధి డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర క్రీడలమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన్ను.. డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ ఇస్తున్నారు. ఉదయ నిధి స్టాలిన్ తో పాటు మంత్రిగా సెంథిల్ బాలాజీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లుగా రాజ్ భవన్ ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లారు.

దీంతో ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. రెండు రోజుల క్రితం బెయిల్ పై విడుదలయ్యారు. దీంతో.. ఆయన్ను మళ్లీ కాబినెట్ లోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. వీరితో పాటు డాక్టర్ గోవి. చెళియన్.. ఆర్. రాజేంద్రన్.. ఎస్ఎం నాజర్ లను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే.. ఆ మధ్యన మరో ముగ్గురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించారు. మరోవైపు శుక్రవారం సీఎం స్టాలిన్ ఢిల్లీలో పర్యటించారు. తన పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమస్యలపై చర్చించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కూడా కలిశారు. మొత్తంగా తన ఢిల్లీ పర్యటన తర్వాత తన కొడుక్కి డిప్యూటీ సీఎంగా నియమించాలన్న నిర్ణయాన్ని ప్రకటించారు.

This post was last modified on September 29, 2024 1:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

11 hours ago