Political News

బాబు రాక‌తో మ‌ళ్లీ లులూ జోష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో మ‌ళ్లీ పెట్టుబ‌డుల‌కు జోష్ పెరిగింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు మాసాల్లోనే ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇప్ప‌టికే కొన్ని పాత కంపెనీలు తిరిగి రాక ప్రారంభించ‌గా.. మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో దుబాయ్‌కు చెందిన లులూ గ్రూప్ కూడా మ‌రోసారి ఏపీపై దృష్టి పెట్టింది. తాజాగా లులూ గ్రూప్ చైర్మ‌న్‌.. ఎం.ఎ.యూసుఫ్ అలీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయ‌న సీఎంతో చ‌ర్చించారు. ఇరువురు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకుని ఆలింగ‌నం చేసుకున్నారు.

2015లోనే..

కాగా, లులూ గ్రూప్‌ను గ‌త టీడీపీ హ‌యాంలోనే చంద్ర‌బాబు ఏపీకి ఆహ్వానించారు. ఆహార త‌యారీ, హోట‌ళ్ల రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన లులూ సంస్థ‌లు.. దుబాయ్ బేస్‌డ్ గా ప‌నిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీలోని విశాఖ‌ప‌ట్నం, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులు పెట్టేందుకు గ‌తంలో అంటే.. 2015లోనే చంద్ర‌బాబు ఈగ్రూపును ఆహ్వానించారు. ప‌ర్యాట‌క‌, షిప్పింగ్‌, ఎగుమ‌తులు, దిగుమ‌తులు స‌హా ఐటీ రంగంలోనూ లులూ కంపెనీకి మంచి పేరుంది. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో ఐటీ స‌హా మాల్స్‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై అప్ప‌ట్లోనే ఒప్పందాలు కుదిరాయి.

అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌లు కార్య‌రూపం దాల్చే క్ర‌మంలో ఎన్నిక‌లు రావ‌డం.. 2019లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రమైన కార‌ణాలు.. వైసీపీ ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం లోపించ‌డంతో విశాఖ‌లో ఏర్పాటు చేయ‌ద‌ల‌చిన లులూ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయ‌లేక‌పోయారు. అంతేకాదు.. ఈ సంస్థ‌ను త‌మిళ‌నాడు స‌ర్కారు ఆహ్వానించింది. దీంతో అక్క‌డ ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, దీనిపై రాజ‌కీయంగా కూడా ఏపీలో వివాదం ర‌గులుకున్న విష‌యం తెలిసిందే.

తాము తెచ్చిన పెట్టుబ‌డి దారుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం త‌రిమేసిందంటూ.. పెద్ద ఎత్తున టీడీపీ విమ‌ర్శ‌లు కూడా గుప్పించింది. అయినా.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం, మ‌రోసారి సీఎంగా చంద్ర‌బాబు ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్త‌లు, కంపెనీలు వ‌రుస‌గా తిరిగి వ‌స్తున్నాయి. కొన్నింటిని ప్ర‌భుత్వ‌మే ఆహ్వానిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా లులూ కంపెనీ కూడా ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది.

This post was last modified on September 29, 2024 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago