Political News

బాబు రాక‌తో మ‌ళ్లీ లులూ జోష్

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రాక‌తో మ‌ళ్లీ పెట్టుబ‌డుల‌కు జోష్ పెరిగింది. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడు మాసాల్లోనే ప‌లు కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇప్ప‌టికే కొన్ని పాత కంపెనీలు తిరిగి రాక ప్రారంభించ‌గా.. మ‌రికొన్ని ప్ర‌తిపాద‌న‌లు రెడీ చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో దుబాయ్‌కు చెందిన లులూ గ్రూప్ కూడా మ‌రోసారి ఏపీపై దృష్టి పెట్టింది. తాజాగా లులూ గ్రూప్ చైర్మ‌న్‌.. ఎం.ఎ.యూసుఫ్ అలీ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ఆయ‌న సీఎంతో చ‌ర్చించారు. ఇరువురు ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకుని ఆలింగ‌నం చేసుకున్నారు.

2015లోనే..

కాగా, లులూ గ్రూప్‌ను గ‌త టీడీపీ హ‌యాంలోనే చంద్ర‌బాబు ఏపీకి ఆహ్వానించారు. ఆహార త‌యారీ, హోట‌ళ్ల రంగంలో ప్ర‌పంచ ప్ర‌ఖ్యాతి గాంచిన లులూ సంస్థ‌లు.. దుబాయ్ బేస్‌డ్ గా ప‌నిచేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఏపీలోని విశాఖ‌ప‌ట్నం, విజయవాడ, తిరుపతిలలో పెట్టుబడులు పెట్టేందుకు గ‌తంలో అంటే.. 2015లోనే చంద్ర‌బాబు ఈగ్రూపును ఆహ్వానించారు. ప‌ర్యాట‌క‌, షిప్పింగ్‌, ఎగుమ‌తులు, దిగుమ‌తులు స‌హా ఐటీ రంగంలోనూ లులూ కంపెనీకి మంచి పేరుంది. ఈ నేప‌థ్యంలో విశాఖ‌లో ఐటీ స‌హా మాల్స్‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ప‌ర్యాట‌క ప్రాజెక్టుల‌పై అప్ప‌ట్లోనే ఒప్పందాలు కుదిరాయి.

అయితే.. ఈ ప్ర‌తిపాద‌న‌లు కార్య‌రూపం దాల్చే క్ర‌మంలో ఎన్నిక‌లు రావ‌డం.. 2019లో వైసీపీ విజ‌యం ద‌క్కించుకోవ‌డం తెలిసిందే. ఆ త‌ర్వాత రాజ‌కీయ ప‌రమైన కార‌ణాలు.. వైసీపీ ప్ర‌భుత్వం నుంచి స‌హ‌కారం లోపించ‌డంతో విశాఖ‌లో ఏర్పాటు చేయ‌ద‌ల‌చిన లులూ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయ‌లేక‌పోయారు. అంతేకాదు.. ఈ సంస్థ‌ను త‌మిళ‌నాడు స‌ర్కారు ఆహ్వానించింది. దీంతో అక్క‌డ ఏర్పాటు చేస్తున్నారు. ఇక‌, దీనిపై రాజ‌కీయంగా కూడా ఏపీలో వివాదం ర‌గులుకున్న విష‌యం తెలిసిందే.

తాము తెచ్చిన పెట్టుబ‌డి దారుల‌ను వైసీపీ ప్ర‌భుత్వం త‌రిమేసిందంటూ.. పెద్ద ఎత్తున టీడీపీ విమ‌ర్శ‌లు కూడా గుప్పించింది. అయినా.. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ ఏమాత్రం ప‌ట్టించుకోలేదు. ఇదిలావుంటే.. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌డం, మ‌రోసారి సీఎంగా చంద్ర‌బాబు ప‌గ్గాలు చేప‌ట్ట‌డంతో వెళ్లిపోయిన పారిశ్రామిక వేత్త‌లు, కంపెనీలు వ‌రుస‌గా తిరిగి వ‌స్తున్నాయి. కొన్నింటిని ప్ర‌భుత్వ‌మే ఆహ్వానిస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా లులూ కంపెనీ కూడా ఏపీలో తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది.

This post was last modified on September 29, 2024 10:53 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రచారంలో నాయకుడు లేడు కానీ రూపం ఉంది

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో సాంకేతికత సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. టీవీకే అధినేత విజయ్ ప్రత్యక్షంగా అన్ని నియోజకవర్గాలను సందర్శించడం కష్టంగా…

33 minutes ago

వైభవ్ సూర్యవంశీని ఆపాలంటే…

ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక చూస్తుంటే రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి 'రాజసం' ఉట్టిపడేలా ఉంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి…

37 minutes ago

రాజమౌళి టెన్షన్ పడే టైపు కాదు

ఇండస్ట్రీకి లీకులు కొత్త కాదు. నిన్నటికి నిన్న జన నాయగన్ సినిమానే బయటికొచ్చింది. పైరసీని కట్టడి చేశారు కానీ భారీ…

59 minutes ago

రజినీకాంత్ సినిమాకు దర్శకుల కష్టాలు

అదేంటో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలకు దర్శకుల మార్పు పెద్ద తలనెప్పిగా మారిపోయింది. అయన, కమల్ హాసన్ కలిసి నటించే…

2 hours ago

విజ‌య్ గ్రాఫ్‌… పోలింగ్ ముందు ఎలా ఉంది?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ ఈనెల 23న జరగనుంది. అంటే పది రోజుల్లో ప్రజలు త‌మ‌ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని…

2 hours ago

నంద‌మూరి నాలుగో తరం సినిమా ఏమైంది?

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న నందమూరి కుటుంబం నుంచి ఇప్ప‌టికే మూడు త‌రాల హీరోలు వ‌చ్చారు. ఆ ఫ్యామిలీ నుంచి…

4 hours ago