Political News

స్వర్ణాంధ్రప్రదేశ్@2047.. ప్ర‌జ‌ల సూచనలు కోరుతున్న బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు గొప్ప నిర్ణ‌యం తీసుకున్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం చేసుకోవడంలో రాష్ట్ర ప్రజలు కూడా భాగస్వాములు కావాల‌ని సీఎం భావిస్తున్నారు. ఇందులో భాగంగానే స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఇవ్వమంటూ ప్ర‌జ‌ల‌కు బాబు పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్టర్)‌లో ఆయ‌న‌ ట్వీట్ చేశారు.

‘ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం మీ వద్ద సూచనలు ఉన్నాయా..? అయితే మీరు ఇప్పుడు వాటిని నేరుగా ప్ర‌భుత్వంతో పంచుకోవచ్చు మరియు మీ సహకారానికి మెచ్చుకోలుగా ఇ-సర్టిఫికేట్‌ను అందుకోవచ్చు. 43 వేల డాలర్ల తలసరి ఆదాయంతో, 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది 2047 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలపడమే మా లక్ష్యం.

స్వర్ణాంధ్రప్రదేశ్ @ 2047 వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. ప్రకాశవంతమైన ఏపీని రూపొందించడానికి మేము మా తోటి పౌరుల నుండి సూచనలు ఆహ్వానిస్తున్నాము. ప్రతి వాయిస్ ముఖ్యమైనది మరియు ప్రతి సూచన గణించబడుతుంది. కలిసి మన రాష్ట్రాన్ని నిర్మించుకుందాం.. మీ నుండి వినడానికి ఎదురుచూస్తున్నాము’ అంటూ చంద్ర‌బాబు త‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

కాగా, స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ ‘swarnandra.ap.gov.in’ అనే కొత్త‌ వెబ్‌సైట్‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ అభిప్రాయాలు, సూచనలను ఈ వెబ్‌సైట్ ద్వారా పంపాలని చంద్ర‌బాబు కోరారు. ప్రజలు అందించే సహకారానికి అభినందనగా ప్ర‌భుత్వం వారికి ఈ-సర్టిఫికెట్ జారీ చేస్తుంది.

This post was last modified on September 28, 2024 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago