రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. ఇప్పుడు వైసీపీ విలవిల్లాడుతోంది.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో వందకు పైగా తప్పులు చూపిస్తూ.. దాడి చేస్తున్న తీరు ఓ రేంజ్లో సాగుతోంది. శ్వేత పత్రాల విడుదల ద్వారా.. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కళ్లకు కట్టింది. అప్పులు చేసి.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. ఇక, ఆ తర్వాత..ఏలూరులో ఎర్రవాగు పొంగింది.. దీనినికూడా వైసీపీ నిర్వాకంగా చూపడంలో కూటమి సర్కారు సక్సెస్ అయింది.
మరీ ముఖ్యంగా ఆర్థికంగా చేసిన అప్పులు.. అధికార దుర్వినియోగం.. మద్యం విధానంపై కూటమి సర్కా రు చేసిన కార్నర్తో వైసీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ఇంతలోనే వరదలువచ్చాయి. ఈ వరదల విషయంలో నూ వైసీపీ నిండా మునిగిపోయింది. వాస్తవానికి వరదల్లో నీటమునిగిన వారు అయినా.. తేరుకున్నారు కానీ .. వైసీపీ మాత్రం ఇప్పటికీ తేరుకోలేక పోయింది. వరదలకు కారణంగా..వైసీపీ చేసిన నిర్వాకమేనని కూటమి సర్కారు చేసిన ప్రచారం.. కాంగ్రెస్ నేత షర్మిల చేసిన ఆరోపణలు ప్రజల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇక, ఆ తర్వాత.. తెరమీదికి వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తారస్థాయికి చేరిపోయింది. దీని నుంచి బయట పడడం వైసీపీకి అంత తేలికకాదు. మరోవైపు వరుస వివాదాలు తెరమీదికి వస్తుండడం.. కీలక నాయకుల అరెస్టుతో.. అనేక మంది ఇతర ప్రధాన నాయకులు జెండా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఇప్పుడు వైసీపీ జెండా మోసే వారే కనిపించకుండా పోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ముప్పేట దాడిలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…
పెద్ది సినిమాలో రామ్ చరణ్ పాత్ర రకరకాల ఆటలు ఆడుతుంది. క్రికెట్, పరుగు పందెం, కుస్తీ ఇలా అన్ని గేమ్స్…