రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. ఇప్పుడు వైసీపీ విలవిల్లాడుతోంది.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో వందకు పైగా తప్పులు చూపిస్తూ.. దాడి చేస్తున్న తీరు ఓ రేంజ్లో సాగుతోంది. శ్వేత పత్రాల విడుదల ద్వారా.. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కళ్లకు కట్టింది. అప్పులు చేసి.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. ఇక, ఆ తర్వాత..ఏలూరులో ఎర్రవాగు పొంగింది.. దీనినికూడా వైసీపీ నిర్వాకంగా చూపడంలో కూటమి సర్కారు సక్సెస్ అయింది.
మరీ ముఖ్యంగా ఆర్థికంగా చేసిన అప్పులు.. అధికార దుర్వినియోగం.. మద్యం విధానంపై కూటమి సర్కా రు చేసిన కార్నర్తో వైసీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ఇంతలోనే వరదలువచ్చాయి. ఈ వరదల విషయంలో నూ వైసీపీ నిండా మునిగిపోయింది. వాస్తవానికి వరదల్లో నీటమునిగిన వారు అయినా.. తేరుకున్నారు కానీ .. వైసీపీ మాత్రం ఇప్పటికీ తేరుకోలేక పోయింది. వరదలకు కారణంగా..వైసీపీ చేసిన నిర్వాకమేనని కూటమి సర్కారు చేసిన ప్రచారం.. కాంగ్రెస్ నేత షర్మిల చేసిన ఆరోపణలు ప్రజల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇక, ఆ తర్వాత.. తెరమీదికి వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తారస్థాయికి చేరిపోయింది. దీని నుంచి బయట పడడం వైసీపీకి అంత తేలికకాదు. మరోవైపు వరుస వివాదాలు తెరమీదికి వస్తుండడం.. కీలక నాయకుల అరెస్టుతో.. అనేక మంది ఇతర ప్రధాన నాయకులు జెండా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఇప్పుడు వైసీపీ జెండా మోసే వారే కనిపించకుండా పోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ముప్పేట దాడిలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on September 23, 2024 9:46 am
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…
ఇండియాలో ఓటీటీల హవా మొదలయ్యాక పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకున్న వెబ్ సిరీస్ల్లో ‘మీర్జాపూర్’ ఒకటి. ఇండియాలో…
తెలుగు వారికి అత్యంత ప్రీతిపాత్రమైన టీవీ ఛానెళ్లలో ఈటీవీ ఒకటి. 90వ దశకంలో ప్రైవేటు టీవీ ఛానెళ్ల జోరు పెరుగుతున్న…
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జంధ్యాల దర్శకత్వంలో సీనియర్ నటుడు నరేష్, దివంగత నటుడు కోటా శ్రీనివాసరావులు నటించిన ‘హై హై…