రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. ఇప్పుడు వైసీపీ విలవిల్లాడుతోంది.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో వందకు పైగా తప్పులు చూపిస్తూ.. దాడి చేస్తున్న తీరు ఓ రేంజ్లో సాగుతోంది. శ్వేత పత్రాల విడుదల ద్వారా.. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కళ్లకు కట్టింది. అప్పులు చేసి.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. ఇక, ఆ తర్వాత..ఏలూరులో ఎర్రవాగు పొంగింది.. దీనినికూడా వైసీపీ నిర్వాకంగా చూపడంలో కూటమి సర్కారు సక్సెస్ అయింది.
మరీ ముఖ్యంగా ఆర్థికంగా చేసిన అప్పులు.. అధికార దుర్వినియోగం.. మద్యం విధానంపై కూటమి సర్కా రు చేసిన కార్నర్తో వైసీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ఇంతలోనే వరదలువచ్చాయి. ఈ వరదల విషయంలో నూ వైసీపీ నిండా మునిగిపోయింది. వాస్తవానికి వరదల్లో నీటమునిగిన వారు అయినా.. తేరుకున్నారు కానీ .. వైసీపీ మాత్రం ఇప్పటికీ తేరుకోలేక పోయింది. వరదలకు కారణంగా..వైసీపీ చేసిన నిర్వాకమేనని కూటమి సర్కారు చేసిన ప్రచారం.. కాంగ్రెస్ నేత షర్మిల చేసిన ఆరోపణలు ప్రజల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇక, ఆ తర్వాత.. తెరమీదికి వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తారస్థాయికి చేరిపోయింది. దీని నుంచి బయట పడడం వైసీపీకి అంత తేలికకాదు. మరోవైపు వరుస వివాదాలు తెరమీదికి వస్తుండడం.. కీలక నాయకుల అరెస్టుతో.. అనేక మంది ఇతర ప్రధాన నాయకులు జెండా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఇప్పుడు వైసీపీ జెండా మోసే వారే కనిపించకుండా పోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ముప్పేట దాడిలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on September 23, 2024 9:46 am
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…