రాజకీయంగా వైసీపీకి అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయి. సహజంగా ఏ పార్టీ అయినా.. ఓటమి తర్వాత తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తన తప్పులు సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చేయాలి. కానీ, వైసీపీలో అలాంటి ఆచరణాత్మక కార్యక్రమాలుఎక్కడా జరగడం లేదు.పైగా.. పార్టీ అధినేత జగన్ తీరు మారడం లేదంటూ.. సొంత నేతలే విమర్శలు చేస్తూ..బయటకు వచ్చేస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పార్టీకి అండగా ఉన్న నాయకులు లేక.. ఇప్పుడు వైసీపీ విలవిల్లాడుతోంది.
మరోవైపు.. కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో వందకు పైగా తప్పులు చూపిస్తూ.. దాడి చేస్తున్న తీరు ఓ రేంజ్లో సాగుతోంది. శ్వేత పత్రాల విడుదల ద్వారా.. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను కళ్లకు కట్టింది. అప్పులు చేసి.. రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగింది. ఇక, ఆ తర్వాత..ఏలూరులో ఎర్రవాగు పొంగింది.. దీనినికూడా వైసీపీ నిర్వాకంగా చూపడంలో కూటమి సర్కారు సక్సెస్ అయింది.
మరీ ముఖ్యంగా ఆర్థికంగా చేసిన అప్పులు.. అధికార దుర్వినియోగం.. మద్యం విధానంపై కూటమి సర్కా రు చేసిన కార్నర్తో వైసీపీ ఇప్పటికీ కోలుకోలేదు. ఇంతలోనే వరదలువచ్చాయి. ఈ వరదల విషయంలో నూ వైసీపీ నిండా మునిగిపోయింది. వాస్తవానికి వరదల్లో నీటమునిగిన వారు అయినా.. తేరుకున్నారు కానీ .. వైసీపీ మాత్రం ఇప్పటికీ తేరుకోలేక పోయింది. వరదలకు కారణంగా..వైసీపీ చేసిన నిర్వాకమేనని కూటమి సర్కారు చేసిన ప్రచారం.. కాంగ్రెస్ నేత షర్మిల చేసిన ఆరోపణలు ప్రజల్లో ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇక, ఆ తర్వాత.. తెరమీదికి వచ్చిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం తారస్థాయికి చేరిపోయింది. దీని నుంచి బయట పడడం వైసీపీకి అంత తేలికకాదు. మరోవైపు వరుస వివాదాలు తెరమీదికి వస్తుండడం.. కీలక నాయకుల అరెస్టుతో.. అనేక మంది ఇతర ప్రధాన నాయకులు జెండా మార్చేస్తున్నారు. దీంతో అసలు ఇప్పుడు వైసీపీ జెండా మోసే వారే కనిపించకుండా పోవడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. ముప్పేట దాడిలో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on September 23, 2024 9:46 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…