టాలీవుడ్ లెజెండరీ నటుడు మోహన్ బాబు ఒకప్పుడు నారా చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కానీ మధ్యలో ఆయనతో విభేదాలు వచ్చాయి. 2019 ఎన్నికల ముంగిట తమ కాలేజీకి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై చంద్రబాబుకు వ్యతిరేకంగా రోడ్డెక్కి పోరాటం చేయడమే కాక.. వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు మోహన్ బాబు.
జగన్కు సోదరి వరుస అయ్యే వెరోనికాను మంచు విష్ణు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో జగన్ తనకు మేనల్లుడంటూ మాట్లాడేవారాయన. ఎన్నికలకు ముందు, తర్వాత కొంత కాలం జగన్తో మోహన్ బాబు కుటుంబం సన్నిహితంగానే మెలిగింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. దూరం పెరిగింది. పార్టీ కోసం ఎన్నికల ప్రచారం కూడా చేసిన తనను జగన్ గుర్తించకపోవడం, ఫీజు రీఎంబర్స్మెంట్ సమస్య జగన్ హయాంలో ఇంకా పెద్దదిగా మారడం ఆయనకు కోపం తెప్పించినట్లుంది.
జగన్ మీద విమర్శలు చేయలేదు కానీ.. ఆయనకు అనుకూలంగా కూడా మోహన్ బాబు మాట్లాడలేదు గత కొన్నేళ్లలో. ఒక ఇంటర్వ్యూలో పరోక్షంగా జగన్ మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. తాజా పరిణామాలు గమనిస్తుంటే జగన్తో మోహన్ బాబుకు పూర్తిగా సంబంధాలు చెడినట్లే కనిపిస్తోంది.
తాజాగా తిరుమల లడ్డు వివాదంలో వైసీపీ ఎంతగా బద్నాం అవుతోందో తెలిసిందే. ఈ అంశంపై మోహన్ బాబు కూడా స్పందించారు. లడ్డుకు వాడిన నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన మోహన్ బాబు.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటోంది జగన్ అండ్ కోనే కావడంతో ఆయన తన మేనల్లుడికి ఎర్రజెండా చూపిస్తున్నట్లే. కేవలం ఈ డిమాండ్తో సరిపెట్టకుండా తనకు అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు అంటూ చంద్రబాబును కొనియాడారు. ఆయనకు అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. చూస్తుంటే జగన్కు కటీఫ్ చెప్పి మళ్లీ చంద్రబాబుతో కలిసిపోయే ప్రయత్నం మోహన్ బాబు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు మంచు విష్ణు సైతం లడ్డు వివాదం మీద స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్కు జై కొట్టిన సంగతి తెలిసిందే.
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…
టాలీవుడ్లో బండ్ల గణేష్ విచిత్రమైన పర్సనాలిటీ. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకునే అతను.. నిర్మాతగా మారి పవన్ కళ్యాణ్,…
బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ తీశారు. ఆస్కార్ వేదిక మీద తన బృందానికి అవార్డు వచ్చేలా చేశారు. వారణాసిని ఇంటర్నేషనల్…