Political News

తిరుమలలో భక్తులను జగన్ దోచుకున్నారు: రఘురామ

జగన్ హయాంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా అనేక చర్యలు జరుగుతున్నాయని ఆనాడు ఆ పార్టీ రెబల్ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత తిరుమల కొండతో పాటు ఏపీలో క్రిస్టియానిటీ పెరిగిందని, ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని ఆయన కేంద్రంలోని బీజేపీ పెద్దలకు కూడా పలుమార్లు లేఖ రాశారు. కట్ చేస్తే ఆ రోజు రఘురామ ఆరోపించిన విధంగానే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, కల్తీ నెయ్యి వాడిన వైనంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను దుమారం రేగింది.

ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్పందించారు. తిరుమల శ్రీవారి భక్తులు మనోభావాలను జగన్ దెబ్బతీశారని, అందుకే జగన్‌ను ఆ వేంకటేశ్వర స్వామి వారు ఓడించారని రఘురామ అన్నారు. వెంకన్న నుంచి ఆయన భక్తులను ఎలా దూరం చేయాలనే క్రిమినల్ ఆలోచనలతో జగన్ హయాంలో టీటీడీ బోర్డు పని చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. నెయ్యి కల్తీ చేసిన వైసీపీకి ప్రజలు గొయ్యి తీశారని సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు ఉన్నట్లు పరీక్షల్లో తేలిందని, అవి టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు కావని అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలిసీ సీఎం చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయం బయట పెట్టాల్సి వచ్చిందని వివరణనిచ్చారు. జగన్ హయాంలో తిరుమలలో లీటర్ వాటర్ బాటిల్ ధర 60 రూపాయలనని గుర్తు చేశారు. భక్తులకు ఉచితంగా మంచినీరు సీసాలు అందించాలని, భక్తులు బస చేసే గదుల ధరలు తగ్గించాలని రఘురామ అభిప్రాయపడ్డారు. తిరుమల కొండపై భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

జగన్ హయాంలో భక్తులను దోచుకున్నారని, వాటర్ బాటిల్ ధర 60 రూపాయలు పెట్టారని మండిపడ్డారు. అద్దె గదుల ధరలను అడ్డుగోలుగా పెంచారని, హోటళ్ల లీజును పెంచడంతో యజమానులు ఆ భారాన్ని భక్తులపై మోపారని ఆరోపించారు. స్వామి దర్శనానికి క్యూ లైన్లలో నిలుచున్న భక్తులకు పాలు ఇచ్చే వారని, కానీ, ఆ విధానానికి కూడా జగన్ స్వస్తి పలికారని ఆరోపించారు. జెరూసలేం, మక్కా యాత్రలకు వెళ్లే భక్తులకు రాయితీలు ఇచ్చిన జగన్ తిరుమలకు వచ్చే వారి పై ఆర్థిక భారం మోపారని ఆరోపించారు.

This post was last modified on September 21, 2024 4:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago