Trends

వంద రోజుల ఉత్సాహం.. త‌మ్ముళ్ల‌ ‘దాహం తీరన‌ట్టే’ !

కూట‌మి స‌ర్కారుకు వంద రోజులు పూర్త‌య్యాయి. సంతృప్తి విష‌యంలో కూట‌మి పార్టీల నాయకులు త‌ల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా? అవును! నిజ‌మే. ఎవ‌రు ఎలా ఉన్నా.. టీడీపీ నాయ కులు మాత్రం ఒకింత నిరుత్సాహంతోనే ఉన్నారు.

గ‌త ఐదేళ్ల‌లో ముఖ్యంగా చివ‌రి మూడేళ్ల‌లో టీడీపీ అనేక ఇక్క‌ట్లు ఎదుర్కొంది. అనేక కేసులు పెట్టించుకున్న నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే.. “ఇంత‌కు ఇంత క‌సి తీర్చుకుంటాం. మీరు ఎంత‌వ‌రకైనా వెళ్లండి!” అని అప్ప‌ట్లో టీడీపీ సీనియ‌ర్లు చెప్పుకొచ్చారు.

దీంతో చాలా మంది క్షేత్ర‌స్థాయి నాయ‌కులు వైసీపీ నేత‌ల‌పై పోరాటాలు చేశారు. ఈ క్ర‌మంలోనే అనేక మందిపై కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికీ ప‌దుల సంఖ్య‌లో త‌మ్ముళ్లు అన్ని జిల్లాల‌కు చెందిన వారు జైళ్ల‌లోనే మ‌గ్గుతున్నారు.

త‌మ ప్ర‌భుత్వం వ‌స్తుంది.. బ‌య‌ట‌కు తెస్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌భుత్వం వ‌చ్చింది.. కానీ, వారు ఇంకా రాలేదు. క‌నీసం బెయిళ్లు కూడా ద‌క్క‌ని వారు ప‌దుల సంఖ్య‌లోనే ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా కుటుంబాల‌కు చెందిన‌వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

తాజాగా ఇదే విష‌యాన్ని పార్టీ రాష్ట్ర చీఫ్ ప‌ల్లా శ్రీనివాస‌రావుకు అన్న‌మ‌య్య జిల్లాకు చెందిన టీడీపీ కుటుంబాలు విన్న‌వించాయి. అప్ప‌ట్లో అంగ‌ళ్లు వ‌ద్ద జ‌రిగిన ఘ‌ట‌న‌లో త‌మ వారు అరెస్ట‌యి.. ఇంకా జైళ్ల లోనే ఉన్నార‌ని.. వారు బ‌య‌ట‌కు రాలేద‌ని తెలిపారు.

సుమారు 30 కుటుంబాలు మంగ‌ళ‌వారం ప‌ల్లాకు ఇదే విష‌యంపై విన‌తులు ఇచ్చారు. అంటే.. వీరంతా అసంతృప్తితోనే ఉన్నారు. ఇక‌, వైసీపీపై క‌సి తీర్చుకోవాల‌న్న నాయ‌కులు మ‌రికొంద‌రు ఉన్నారు.

అంటే.. వైసీపీ కీల‌క నాయ‌కులు, మాజీ మంత్రుల‌ను అరెస్టు చేయాల‌ని.. వారు అప్ప‌ట్లో చేసిన నేరాల‌ను వెలికి తీయాల‌ని కోరుతున్నారు. కానీ, ఇవ‌న్నీ చ‌ట్ట‌బ‌ద్ధంగానే జ‌రుగుతాయ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రి నారా లోకేష్‌లు చెబుతున్నారు.

కానీ, త‌మ్ముళ్లు మాత్రం అప్ప‌ట్లో చట్టాల‌ను చూసే త‌మ‌పై కేసులు పెట్టారా? అంటూ మూతులు తిప్పుకొంటున్నారు. అంటే.. ఒక ర‌కంగా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. తాము ఆశించిన విధంగా లేక పోతే తాము ఇబ్బందులు ప‌డిన‌ట్టుగా.. వైసీపీని ఇర‌కాటంలో పెట్ట‌లేక పోతున్నార‌న్న భావ‌న మాత్రంఉంది. అందుకే.. టీడీపీ నేత‌ల్లో ఒకింత జోష్ త‌గ్గింద‌నే చెప్పాలి.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

2 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

3 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

3 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

3 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

3 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

4 hours ago