ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా ఉన్నారు. ఉదాహరణకు విష్ణుకుమార్ రాజు వంటి వారు. అదేవిధంగా మేధావులు కూడా ఉన్నారు.
ఉదాహరణకు కామినేని శ్రీనివాస్ వంటివారు. అయితే.. తాజాగా బుధవారంతో కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆ జోష్ ఎక్కడా కనిపించ డం లేదు. ఒకవైపు సర్కారు 100 రోజుల పండుగను చేసుకోవాలని భావించింది.
కానీ, వర్షాలు, వరదల కారణంగా ఈ పండుగకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. కానీ, రాజకీయంగా వేసిన అడుగులు, ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలపై మాత్రం కూటమి పెద్దలు చర్చిస్తున్నారు.
ఈ క్రమంలో బీజేపీ విషయాన్ని తీసుకుంటే.. అసెంబ్లీలో ఒకరిద్దరు మాట్లాడింది మినహా.. ప్రజల మధ్య కనిపించిన బీజేపీ ఎమ్మెల్యేలు లేరనే చెప్పారు. ఒక్క మంత్రి సత్యకుమార్ యాదవ్ మాత్రం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
అయితే.. వరద తగ్గిన తర్వాతే సత్యకుమార్ పర్యటించడంతో ఆయన ఆశించిన మేలు కానీ, పేరు కానీ రాలేదు. ఇక, ఎప్పుడూ సమకాలీన రాజకీయాలపై మాట్లాడే విష్ణుకుమార్ రాజు కూడా.. తనకు ప్రాధాన్యం దక్కలేదన్న ఉద్దేశంతో మౌనంగా ఉన్నారు.
కామినేని శ్రీనివాసరావు తన వ్యాపారాల్లో మునిగిపోయారు. ఇక, ఇతర నాయకులు కూడా ఎవరికివారు తమ పనుల్లో ఉన్నారే తప్ప.. ప్రభుత్వ పరంగా కార్యక్రమాల్ల పాల్గొన్నవారు కూడా లేరు.
ఇలా బీజేపీ నాయకులు ఈ వంద రోజుల్లో సాధించిన ప్రగతి అంటూ ఏమీ ప్రత్యేకంగా లేదు. సత్యకుమార్ మంత్రి కాబట్టిపలుమార్లు ఆసుపత్రుల్లో పర్యటించారు. సౌకర్యాలపై ఆరా తీశారు. అయితే.. ఈయన మాత్రం వైసీపీపై నిశిత విమర్శలు చేస్తూ.. ముఖ్యమంత్రిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
మిగిలిన వారు మాత్రం ముసుగుతన్నినట్టు వ్యవహరిస్తున్నారు. మరి వీరి పరిస్థితి ఏంటనేది పార్టీనే ఆలోచించుకోవాలి. ఏదేమైనా.. వంద రోజుల బీజేపీ గ్రాఫ్ పెద్దగా లేచినట్టు కనిపించడం లేదు.
This post was last modified on September 20, 2024 3:50 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఘన విజయం సాధించే దిశగా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ అధినేత, కోలీవుడ్…
సమంత మా ఇంటి బంగారం మే 15 రావడం లేదు. ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు కానీ ప్రమోషన్స్ నాలుగైదు…
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…