Political News

నందిగం సురేష్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయ‌కుడు నందిగం సురేష్‌పై తాజాగా మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయన‌పై టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, 14 రోజులు జైల్లో ఉన్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఇదే కేసులో పోలీసుల క‌స్ట‌డీకి కూడా ఆయ‌న‌ను తీసుకున్నారు. కూలంక‌షంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం తిప్ప‌లు ప‌డుతున్నారు. బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో పెండింగులో ఉంది.

అయితే.. ఇప్పుడు నందిగం సురేష్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. 2020లో తుళ్లూరు మండ‌లం.. వెల‌గ‌పూడిలో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో ఆయ‌న ప్ర‌మేయం ఉందంటూ.. తాజాగా పోలీసులు కేసు పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు పీటీవారెంటు కూడా జారీ చేశారు. దీంతో ప్ర‌స్తుతం టీడీపీ ఆఫీసుపై కేసులో నందిగంకు బెయిలు ద‌క్కినా.. వెంట‌నే హ‌త్య కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

2020లో తుళ్లూరు మండ‌లం, వెల‌గ‌పూడికి చెందిన ఎస్సీ మ‌హిళ మ‌రియ‌మ్మ‌.. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ లు గుప్పించారు. త‌న‌కు వ‌స్తున్న పింఛ‌నును నిలిపివేశార‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌లేద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను దూషించారు. దీంతో అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ అనుచ‌రులు.. ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో మ‌రియ‌మ్మ పై దాడి కూడా జ‌రిగిన‌ట్టు ఆమె కుమారుడు తాజాగా తుళ్లూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో ఆమె మ‌ర‌ణించింద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం ఇప్పుడై నా త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. మంత్రి నారా లోకేష్‌ను క‌లిసి కొన్నాళ్ల కింద‌ట ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. నందిగం సురేష్ స‌హా ఆయ‌న అనుచ రుల‌పై కేసులు పెట్టారు. దీంతో నందిగం చుట్టూ మ‌రో కీల‌క కేసు చుట్టుకున్న‌ట్టు అయింది.

This post was last modified on September 19, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్…

6 minutes ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

3 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

5 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

6 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

6 hours ago

చిరు – బాలయ్య మల్టీస్టారర్ కల నెరవేరుతుందా?

కమల్ హాసన్, రజనీకాంత్ కాంబోలో అనౌన్స్ మెంట్ వీడియో చూశాక మూవీ లవర్స్ లో మాములు ఎగ్జైట్ మెంట్ కలగడం…

7 hours ago