Political News

నందిగం సురేష్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయ‌కుడు నందిగం సురేష్‌పై తాజాగా మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయన‌పై టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, 14 రోజులు జైల్లో ఉన్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఇదే కేసులో పోలీసుల క‌స్ట‌డీకి కూడా ఆయ‌న‌ను తీసుకున్నారు. కూలంక‌షంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం తిప్ప‌లు ప‌డుతున్నారు. బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో పెండింగులో ఉంది.

అయితే.. ఇప్పుడు నందిగం సురేష్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. 2020లో తుళ్లూరు మండ‌లం.. వెల‌గ‌పూడిలో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో ఆయ‌న ప్ర‌మేయం ఉందంటూ.. తాజాగా పోలీసులు కేసు పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు పీటీవారెంటు కూడా జారీ చేశారు. దీంతో ప్ర‌స్తుతం టీడీపీ ఆఫీసుపై కేసులో నందిగంకు బెయిలు ద‌క్కినా.. వెంట‌నే హ‌త్య కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

2020లో తుళ్లూరు మండ‌లం, వెల‌గ‌పూడికి చెందిన ఎస్సీ మ‌హిళ మ‌రియ‌మ్మ‌.. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ లు గుప్పించారు. త‌న‌కు వ‌స్తున్న పింఛ‌నును నిలిపివేశార‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌లేద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను దూషించారు. దీంతో అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ అనుచ‌రులు.. ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో మ‌రియ‌మ్మ పై దాడి కూడా జ‌రిగిన‌ట్టు ఆమె కుమారుడు తాజాగా తుళ్లూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో ఆమె మ‌ర‌ణించింద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం ఇప్పుడై నా త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. మంత్రి నారా లోకేష్‌ను క‌లిసి కొన్నాళ్ల కింద‌ట ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. నందిగం సురేష్ స‌హా ఆయ‌న అనుచ రుల‌పై కేసులు పెట్టారు. దీంతో నందిగం చుట్టూ మ‌రో కీల‌క కేసు చుట్టుకున్న‌ట్టు అయింది.

Satya

Recent Posts

కాంగ్రెస్ చెయ్యలేనిది మోదీ చేసి చూపించారు

విష‌యం చిన్న‌దే అయినా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండ‌గా చేయ‌లేనిది.. ప్ర‌స్తుత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసి చూపించారు. అదే.. దేశంలో…

23 minutes ago

ముద్రగడకు గవర్నర్ పదవిని సిఫార్సు చేసిన పవన్

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో కీలక నేతగా వ్యవహరించారు. తెలుగు నేల రాజకీయాల్లో మూడు పర్యాయాలు…

1 hour ago

చెన్నై ల‌వ్ స్టోరీ ఎందుకు చేతులు మారింది?

బేబీ సినిమాతో పెద్ద సంచ‌ల‌న‌మే రేపాడు ద‌ర్శ‌క నిర్మాత సాయిరాజేష్‌. కెరీర్లో తొలి అడుగులు వేస్తున్న వైష్ణ‌వి చైత‌న్య‌, ఆనంద్…

3 hours ago

డ్ర‌గ్స్ కోసం ఎగ‌బ‌డ్డ ఎమ్మెల్సీ కొడుకు… ప‌ట్టేసుకున్న పోలీసులు

హైద‌రాబాద్‌ను డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి వెంటాడుతోంది. ఇటు ప్ర‌భుత్వం, అటు పోలీసులు అనుక్ష‌ణం డ్ర‌గ్స్ క‌ట్ట‌డికి ఎంతగా ప్ర‌య‌త్నిస్తున్నా.. ఏదో ఒక…

3 hours ago

హ‌మ్మ‌య్య‌… ఎట్ట‌కేల‌కు క‌దిలిన క‌మ‌ల‌నాథులు!

ఏపీలో కూట‌మిగా ఏర్పడి.. అధికారాన్ని పంచుకుంటున్న బీజేపీ.. గ‌త రెండేళ్ల కాలంలో ఎప్పుడూ.. పెద‌వి విప్పి.. కూట‌మి ప్ర‌భుత్వం సాధించిన…

4 hours ago

నోలన్ విధ్వంసానికి ఆకాశమే హద్దు

ఇప్పుడు వరల్డ్ నంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అంటే మరో మాట లేకుండా క్రిస్టోఫర్ నోలన్ పేరు చెప్పేస్తారు ఆడియన్స్.…

4 hours ago