Political News

నందిగం సురేష్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయ‌కుడు నందిగం సురేష్‌పై తాజాగా మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయన‌పై టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, 14 రోజులు జైల్లో ఉన్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఇదే కేసులో పోలీసుల క‌స్ట‌డీకి కూడా ఆయ‌న‌ను తీసుకున్నారు. కూలంక‌షంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం తిప్ప‌లు ప‌డుతున్నారు. బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో పెండింగులో ఉంది.

అయితే.. ఇప్పుడు నందిగం సురేష్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. 2020లో తుళ్లూరు మండ‌లం.. వెల‌గ‌పూడిలో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో ఆయ‌న ప్ర‌మేయం ఉందంటూ.. తాజాగా పోలీసులు కేసు పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు పీటీవారెంటు కూడా జారీ చేశారు. దీంతో ప్ర‌స్తుతం టీడీపీ ఆఫీసుపై కేసులో నందిగంకు బెయిలు ద‌క్కినా.. వెంట‌నే హ‌త్య కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

2020లో తుళ్లూరు మండ‌లం, వెల‌గ‌పూడికి చెందిన ఎస్సీ మ‌హిళ మ‌రియ‌మ్మ‌.. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ లు గుప్పించారు. త‌న‌కు వ‌స్తున్న పింఛ‌నును నిలిపివేశార‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌లేద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను దూషించారు. దీంతో అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ అనుచ‌రులు.. ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో మ‌రియ‌మ్మ పై దాడి కూడా జ‌రిగిన‌ట్టు ఆమె కుమారుడు తాజాగా తుళ్లూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో ఆమె మ‌ర‌ణించింద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం ఇప్పుడై నా త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. మంత్రి నారా లోకేష్‌ను క‌లిసి కొన్నాళ్ల కింద‌ట ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. నందిగం సురేష్ స‌హా ఆయ‌న అనుచ రుల‌పై కేసులు పెట్టారు. దీంతో నందిగం చుట్టూ మ‌రో కీల‌క కేసు చుట్టుకున్న‌ట్టు అయింది.

This post was last modified on September 19, 2024 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

49 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

1 hour ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

2 hours ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

3 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago