Political News

నందిగం సురేష్‌పై మ‌ర్డ‌ర్ కేసు.. ఏం జ‌రిగింది?

వైసీపీ మాజీ ఎంపీ, ఎస్సీ నాయ‌కుడు నందిగం సురేష్‌పై తాజాగా మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఇప్ప‌టికే ఆయన‌పై టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై జ‌రిగిన దాడి కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అరెస్టు చేయ‌డం, 14 రోజులు జైల్లో ఉన్న ప‌రిస్థితి ఉంది. ప్ర‌స్తుతం ఇదే కేసులో పోలీసుల క‌స్ట‌డీకి కూడా ఆయ‌న‌ను తీసుకున్నారు. కూలంక‌షంగా ఈ కేసును విచారించారు. మొత్తానికి ఈ కేసులో నందిగం తిప్ప‌లు ప‌డుతున్నారు. బెయిల్ పిటిష‌న్ హైకోర్టులో పెండింగులో ఉంది.

అయితే.. ఇప్పుడు నందిగం సురేష్‌పై గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు మ‌ర్డ‌ర్ కేసును న‌మోదు చేశారు. 2020లో తుళ్లూరు మండ‌లం.. వెల‌గ‌పూడిలో జ‌రిగిన ఓ హ‌త్య కేసులో ఆయ‌న ప్ర‌మేయం ఉందంటూ.. తాజాగా పోలీసులు కేసు పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు పీటీవారెంటు కూడా జారీ చేశారు. దీంతో ప్ర‌స్తుతం టీడీపీ ఆఫీసుపై కేసులో నందిగంకు బెయిలు ద‌క్కినా.. వెంట‌నే హ‌త్య కేసులో ఆయ‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఏం జ‌రిగింది?

2020లో తుళ్లూరు మండ‌లం, వెల‌గ‌పూడికి చెందిన ఎస్సీ మ‌హిళ మ‌రియ‌మ్మ‌.. వైసీపీ స‌ర్కారుపై విమ‌ర్శ లు గుప్పించారు. త‌న‌కు వ‌స్తున్న పింఛ‌నును నిలిపివేశార‌ని.. ఇళ్లు ఇస్తామ‌ని కూడా ఇవ్వ‌లేద‌ని అప్ప‌టి సీఎం జ‌గ‌న్‌ను దూషించారు. దీంతో అప్ప‌టి ఎంపీ నందిగం సురేష్ అనుచ‌రులు.. ఆమె ఇంటిపైకి దాడికి వెళ్లారు. ఈ ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో మ‌రియ‌మ్మ పై దాడి కూడా జ‌రిగిన‌ట్టు ఆమె కుమారుడు తాజాగా తుళ్లూరు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఆ దాడిలో ఆమె మ‌ర‌ణించింద‌ని పేర్కొన్నారు.

ఈ విష‌యంపై అప్ప‌ట్లోనే పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేద‌న్నారు. క‌నీసం ఇప్పుడై నా త‌మ‌కు న్యాయం చేయాలంటూ.. మంత్రి నారా లోకేష్‌ను క‌లిసి కొన్నాళ్ల కింద‌ట ఫిర్యాదు ఇచ్చారు. దీని ఆధారంగా తుళ్లూరు పోలీసులు తాజాగా కేసు న‌మోదు చేశారు. నందిగం సురేష్ స‌హా ఆయ‌న అనుచ రుల‌పై కేసులు పెట్టారు. దీంతో నందిగం చుట్టూ మ‌రో కీల‌క కేసు చుట్టుకున్న‌ట్టు అయింది.

Satya

Recent Posts

దీదీ వర్సెస్ రీతబ్రత… అసలైన తృణమూల్ ఎవరిది?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…

1 hour ago

ఆచార్య దర్శకుడితో రామ్ చరణ్…

కొన్ని డిజాస్ట‌ర్లు ఇండ‌స్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో ప‌నిచేసిన వాళ్లంద‌రినీ జీవిత కాల చేదు జ్ఞాప‌కాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…

3 hours ago

అఫిషియల్… తల్లి కాబోతున్న సమంత

మా ఇంటి బంగారం సినిమా విజయంతో సంబరాల్లో ఉన్న సమంత అభిమానులకు మరో శుభవార్త అందింది. సినిమా సక్సెస్ మీట్…

3 hours ago

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో…

4 hours ago

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

4 hours ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

5 hours ago